Latest Updates
-
ఆరుద్ర నుంచి పునర్వసులోకి చంద్రుడు: ఈ రాశుల వారికి ఊహించని మార్పులు.. రాహుకాలం సమయాలివే! -
డేటింగ్ యాప్లో పరిచయం.. పెళ్లయ్యాక కట్నం కోసం వేధింపులు: ఆన్లైన్ సంబంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
వాట్సాప్లో పెళ్లి పత్రికల పేరుతో కొత్త మోసం… ఆ లింక్ క్లిక్ చేస్తే మీ జీవితమే తలకిందులు! -
ఇంట్లో కూరగాయలు లేవా? కేవలం 5 నిమిషాల్లో ఈ కరకరలాడే ఉల్లిపాయ భుజియా చేసి చూడండి! -
మిథున, తులా, కుంభ రాశుల వారికి ఈరోజు అదృష్టం..ఆర్థికంగా భారీ లాభాలు పొందే అరుదైన అవకాశం! -
మీ ఒంట్లో ఈ 7 లక్షణాలు కనిపిస్తే.. మీరు కరెక్ట్ గా నీళ్లు తాగుతున్నట్టే లెక్క! -
గురు పుష్య యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకమే మారిపోతుందా? అదృష్టం మీ వెంటే! -
మంగళవారం పనులు మొదలుపెడుతున్నారా? ఈరోజు శుభ ముహూర్తాలు, రాహుకాలం తెలుసుకోకపోతే పనుల్లో ఆటంకాలు తప్పవా? -
రేవతిలో శని, రోహిణిలో బుధుడు: ఈ రాశుల వారికి నేడు ఊహించని ధనలాభం, అదృష్టం! -
మిథునం, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. ఎవరికి ధన లాభం? - మంగళవారం, 19 మే 2026
బరువు తగ్గేందుకు.. ఆహారంలో సమతుల్యత తప్పనిసరి
ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల జాగ్రత్త పెరగడం మొదలైంది. అంటే ఆహారంపట్ల జాగ్రత వహించడం పెరిగింది. ఎట్టకేలకు రుచులకోసం తాపత్రయం పోయి కేలరీలను లెక్కేసుకోవడం అలవడింది. జిహ్వచాలప్యం కాస్తంత అణచుకుంటే నిండు నూరేళ్లు అనారోగ్యాలు దరిచేరకుండా గడపొచ్చుననే ఆలోచన వచ్చింది. కాబట్టి తినే ఆహారం విషయంలో మనం ఉండాల్సినంత జాగ్రత్తగా ఉంటున్నామో లేదో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువుతో బలంగా, శక్తిగా ఉన్నామో లేదో చూసుకోవాలి. బరువు ఎక్కువై, ఊబకాయం తెచ్చుకుంటే ఎంత కష్టమో, తక్కువై బలహీనంగా ఉన్నా అంతే కష్టం. కనుక సమతుల్యతను కాపాడుకోవాలి. ఆహారంలో ఉండే పోషకాలు శక్తిని విడుదల చేస్తాయి. ఏదైనా అనారోగ్యంతో బాధపడుతుంటేనో, లేక హార్మోన్ల అపసవ్యత చోటుచేసుకుంటేనో తప్పించి సాధారణంగా మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి బరువులో హెచ్చుతగ్గులు ఉంటాయి.
ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ఆహార నియమాలను పాటించాలి. తీసుకున్న ఆహారం సవ్యంగా జీర్ణమయ్యేందుకు కొంత వ్యాయామం తప్పనిసరి. లేకుంటే బరువు విపరీతంగా పెరిగిపోతుంటుంది. కొవ్వు నిల్వలు చేరతాయి. శరీరానికి అవసరమైన శక్తి సరిగా విడుదల కాదు. దాంతో బరువు తగ్గించుకోడానికి నానా యాతనా పడాలి. అవసరమైన కంటే ఎక్కువ ఆహారం ఎలా మంచిది కాదో, తక్కువ తినడమూ శ్రేయస్కరం కాదు. శరీరం శుష్కించుకు పోయి, నీరసం ముంచుకొస్తుంటుంది. ఏ పనిమీదా శ్రద్ధాసక్తులు ఉండవు. ఈ దశ ముదిరితే అసలు జీవితం మీదే ఆసక్తి నశిస్తుంది. కనుక ఏవిధంగా చూసినా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రణాళిక వేసుకోవాలి.

మనలో చాలామంది చేసే తప్పు ఏమిటంటే, ఆహారం రుచిగా ఉంటె సరిపోతుంది అనుకుంటాం. కానీ ఆహారం శుచిగా ఉండటం అంతకంటే ముఖ్యం. పరిశుభ్రంగా లేని పదార్ధాల వల్ల లేనిపోని జబ్బులొస్తాయి. అలాగే నిలవున్న పదార్ధాలు విషతుల్యం అయ్యి, ఫుడ్ పాయిజన్ గా మారే ప్రమాదం ఉంది. ఇక ముఖ్యమైన అంశం ఆహారంలో పోషక విలువలు ఉండాలి. కింది కనీస జాగ్రత్తలు పాటించాలి.
1. ప్రోటీన్లు ఉండే ఆహారం తీసుకోవడంవల్ల శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్సు అందుతాయి.
2. వీలైనంతవరకు ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకపోవడం మంచిది.
3. రుచికి, చూపులకు బాగుంటుంది కదాని పోలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని వాడతాం. కానీ దంపుడు బియ్యపు అన్నం ఎంతో శ్రేష్టం.
4. అన్నం కంటే ఎక్కువగా కూరలను తినడం మంచిది.
5.ఆయా సీజన్లలో దొరికే పండ్లను సేవిస్తుండాలి.
6. నీళ్ళు బాగా తాగాలి. రోజుకు నాలుగు లీటర్లకు తక్కువ కాకుండా తాగితే మంచిది.
7. ఎక్కువ నీళ్ళు తాగి, తరచుగా యూరిన్ పాస్ చేయడంవల్ల శరీరంలో చోటు చేసుకున్న మలినాలు చాలావరకూ వెళ్ళిపోతాయి.
8. ఆహారం ఎక్కువ మొత్తంలో ఒకేసారి తీసుకోవడం కంటే కొంచెం మోతాదులో ఎక్కువసార్లు తినడం మంచిది.
9. తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమయ్యేందుకు తగిన వ్యాయామం చేయాలి.
10. ఉదయం, సాయంత్రం వాకింగ్ చేస్తే దాన్ని మించిన ఆరోగ్య రహస్యం ఇంకొకటి లేదు.
ఈమాత్రం కనీస సూత్రాలు పాటించి ఆరోగ్యాన్ని సంరక్షించుకుందాం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications