Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
పెరుగులో ఇవి కలిపి తింటున్నారా ? చాలా డేంజర్ అంటున్న నిపుణులు
మనలో ఛాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంత రుచికరమైన కూరతో భోజనం చేసినా చివరికి పెరుగుతో తినాల్సిందే. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. పెరుగులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగవడంతో పాటు శరీరంలో ఎన్నో జీవ క్రియలకు పెరుగు ఎంతో మేలు చేస్తుంది.
అయితే పెరుగుతో ఇతర కూరలు కలుపుకుని తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇతర కూరల్లో పెరుగు కలుపుకొని తినడం వల్ల.. పెరుగులో ఉండే ఔషద గుణాలు పోయి.. అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే పెరుగుతో కలిపి తినకూడని ఆ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగుతో ఏఏ కూరలు కలిపి తినొద్దంటే..
> పెరుగులో ఎప్పుడూ కూడా వెల్లుల్లి కలిపి తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వెల్లుల్లిలో వేది చేసే గుణం ఉంటుంది. దీనిని పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల.. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
> సాధారణంగా పెరుగులో ఉల్లిపాయ వేసుకొని సలాడ్ మాదిరిగా చేసుకొని తింటూ ఉంటారు. ప్రతీ ఫంక్షన్లో ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా పెరుగులో ఉల్లిపాయలను కలిపి తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తినటం వల్ల పేగు నొప్పి వస్తుందని, జీర్ణ సంబంధిత సమస్యలూ పెరిగే అవకాశముందని అంటున్నారు.
> పెరుగులో కొందరు దొసకాయను కూడా కలిపి తింటూ ఉంటారు. దోసకాయలో 70% నీరు ఉంటుంది. దీంతో పెరుగు, దోసకాయ కలిపి తినడం వల్ల.. జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు..
> పెరుగులో టొమాటోను కూడా కలిపి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల.. అజీర్ణం, అసిడిటీ సమస్యలు వస్తాయట. టామోటాలో ఉండే ఆమ్ల గుణం, పెరుగులో ఉండే ఆమ్ల గుణం రెండు కలిపి తీసుకోవడం వల్ల.. ఈ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
> పాలకూర, పెరుగు రెండు కలిపి ఎప్పుడూ తినొద్దని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. పాలకూరలో యాక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది క్యాల్షియం శోషణకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. దీనివల్ల కడుపునొప్పితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఆహారాన్ని అయినా మనం ఒరిజినల్గానే ఆస్వాదిస్తే మంచిగా ఉంటుంది. పైగా అందులో ఉండే ఔషధ గుణాలు, శరీరానికి మేలూ చేసే పోషక విలువలు మన శరీరానికి సరిగ్గా అందుతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలన్నీ మాకు ఇంటర్నెట్లో అందించిన సమాచారం ఆధారంగానే అందించాము. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications