Latest Updates
-
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే!
పెరుగులో ఇవి కలిపి తింటున్నారా ? చాలా డేంజర్ అంటున్న నిపుణులు
మనలో ఛాలా మంది పెరుగును ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఎంత రుచికరమైన కూరతో భోజనం చేసినా చివరికి పెరుగుతో తినాల్సిందే. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. పెరుగులో ఉండే ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ వ్యవస్థ మెరుగవడంతో పాటు శరీరంలో ఎన్నో జీవ క్రియలకు పెరుగు ఎంతో మేలు చేస్తుంది.
అయితే పెరుగుతో ఇతర కూరలు కలుపుకుని తినడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిదికాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలా ఇతర కూరల్లో పెరుగు కలుపుకొని తినడం వల్ల.. పెరుగులో ఉండే ఔషద గుణాలు పోయి.. అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. అయితే పెరుగుతో కలిపి తినకూడని ఆ ఫుడ్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

పెరుగుతో ఏఏ కూరలు కలిపి తినొద్దంటే..
> పెరుగులో ఎప్పుడూ కూడా వెల్లుల్లి కలిపి తినొద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వెల్లుల్లిలో వేది చేసే గుణం ఉంటుంది. దీనిని పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల.. అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
> సాధారణంగా పెరుగులో ఉల్లిపాయ వేసుకొని సలాడ్ మాదిరిగా చేసుకొని తింటూ ఉంటారు. ప్రతీ ఫంక్షన్లో ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా పెరుగులో ఉల్లిపాయలను కలిపి తినడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా తినటం వల్ల పేగు నొప్పి వస్తుందని, జీర్ణ సంబంధిత సమస్యలూ పెరిగే అవకాశముందని అంటున్నారు.
> పెరుగులో కొందరు దొసకాయను కూడా కలిపి తింటూ ఉంటారు. దోసకాయలో 70% నీరు ఉంటుంది. దీంతో పెరుగు, దోసకాయ కలిపి తినడం వల్ల.. జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయని చెబుతున్నారు..
> పెరుగులో టొమాటోను కూడా కలిపి తింటూ ఉంటారు. ఇలా తినడం వల్ల.. అజీర్ణం, అసిడిటీ సమస్యలు వస్తాయట. టామోటాలో ఉండే ఆమ్ల గుణం, పెరుగులో ఉండే ఆమ్ల గుణం రెండు కలిపి తీసుకోవడం వల్ల.. ఈ సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
> పాలకూర, పెరుగు రెండు కలిపి ఎప్పుడూ తినొద్దని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. పాలకూరలో యాక్సాలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది క్యాల్షియం శోషణకు తీవ్ర ఆటంకం కలిగిస్తోంది. దీనివల్ల కడుపునొప్పితో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎలాంటి ఆహారాన్ని అయినా మనం ఒరిజినల్గానే ఆస్వాదిస్తే మంచిగా ఉంటుంది. పైగా అందులో ఉండే ఔషధ గుణాలు, శరీరానికి మేలూ చేసే పోషక విలువలు మన శరీరానికి సరిగ్గా అందుతాయి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన విషయాలన్నీ మాకు ఇంటర్నెట్లో అందించిన సమాచారం ఆధారంగానే అందించాము. వీటిని పాటించే ముందు తప్పనిసరిగా నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











