Latest Updates
-
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు! -
ఒకేసారి ఇడ్లీ, రైస్లోకి పర్ఫెక్ట్ రెసిపీ.. నోరూరించే ఘాటుతో టిఫిన్ సెంటర్ స్టైల్ టొమాటో చట్నీ.! -
ఆగష్టు 28న చంద్రగ్రహణం.. ఈ రాశుల వారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త.! -
ఒక్కసారి ఈ టర్కిష్ టమాటో ఆనియన్ సలాడ్ రుచి చూస్తే..నాలుక నిద్రలేచి నాట్యమాడతది!
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.!
ఈ రోజుల్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా అనీమియాతో బాధపడుతున్నారు. వైద్య గణాంకాల ప్రకారం దేశంలో సుమారు 57శాతం మంది మహిళలు, కౌమార దశలోని బాలికలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్న కారణంగా అనీమియా సంభవిస్తుంది. శరీరంలోని అన్ని భాగాలకు హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను తీసుకెళ్తున్న కారణంగా ఇది తగ్గితే తగినంత ఆక్సిజన్ సప్లై లేక అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు మహిళలు ప్రతిరోజూ తప్పనిసరిగా వీటిని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో చూద్దాం..

రక్తహీనత సమస్య ఉన్నవారిలో ఎక్కువగా అలసట, నీరసం, చర్మం పాలిపోవడం కనిపిస్తాయి. ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తరచుగా కళ్లు తిరగడం వంటివాటిని ఎదుర్కొంటారు. అయితే రక్తహీనత ఉంటేనే ఈ సమస్య వస్తుందని చెప్పలేం. కానీ వైద్య పరీక్షల్లో ఈ సమస్య ఉందని తేలితే తప్పనిసరిగా అందుకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

అయితే సాధారణంగా రక్తహీనత సమస్య ఉంది అంటే వారిని తప్పనిసరిగా బీట్రూట్, బెల్లం, నానబెట్టిన ఎండు ద్రాక్ష తినమని సలహా ఇస్తారు. బీట్రూట్, బెల్లం విషయాలను పక్కనపెడితే ఎండుద్రాక్ష తింటే రక్తహీనత సమస్య నిజంగానే తగ్గిపోతుందా? వాస్తవాలు తెలుసుకుందాం..
ఎండుద్రాక్షతో ప్రయోజనాలు..
ఎండుద్రాక్షలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని రోజూ ఒక ఐదు లేదా పది నానబెట్టుకుని తినడం ద్వారా శరీరంలో ఎర్ర రక్త కణాలు, హిమోగ్లోబిన్ తయారీకి దోహదపడుతుంది. వీటిశాతం పెరిగి అనీమియా శాతాన్ని నివారిస్తుంది. అందుకే ఎండుద్రాక్ష తినమని సలహా ఇస్తారు. ఈ క్రమంలో డైటీషియన్లు కూడా ఐరన్, పోషకాహార లోపాన్ని నివారించేందుకు ఎండుద్రాక్షను సిఫారసు చేస్తారు. అయితే హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువగా ఉంటే లేదా శరీరం ఐరన్ను సరిగ్గా తీసుకునే సామర్థ్యం లేకపోయినా ఎండుద్రాక్ష తింటే ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

మీకు రక్తహీనత సమస్య ఉన్నట్లు తేలితే అందుకు సరైన కారణాలను ముందు తెలుసుకోవడం ముఖ్యం. అధిక రుతుస్రావం, భోజనంలో ఐరన్ లోపం, పేగులు ఐరన్ను సరిగ్గా గ్రహించలేకపోవడం ఇంకా ఇతర సమస్యల కారణంగా మహిళలను ఈ సమస్యను ఎదుర్కొనే అవకాశం ఉంది. అయితే డైలీ ఆహారంలో ఎండు ద్రాక్షను తీసుకోవడం ద్వారా కొంతవరకు ఉపశమనం పొందవచ్చు.

ఎలా తీసుకోవాలి..
నానబెట్టిన ఎండుద్రాక్షలు మెత్తగా ఉండి సులభంగా జీర్ణమవుతాయి. వీటితో పాటు పప్పు ధాన్యాలు ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, మాంసం, చేపలు వంటి ఐరన్ పుష్కలంగా ఉన్న వాటిని కూడా ఆహారంలో చేర్చుకోవాలి. డైటీషియన్ల అభిప్రాయం మేరకు ఆకుకూరల కంటే మాంసాహార ఉత్పత్తుల ద్వారా ఐరన్ను శరీరం త్వరగా గ్రహిస్తుంది. ఐరన్ ఫుడ్స్తో పాటు మీ ఆహారంలో విటమిన్ సి చేర్చుకోవడం కూడా చాలా ముఖ్యం. వైద్యుల సలహా మేరకు ఆహార పదార్థాలతో పాటు సప్లిమెంట్లను కూడా వాడటం ద్వారా రక్తహీనత సమస్య నుంచి బయటపడొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications