Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
భోజనం తర్వాత ఈచిన్న పని చేస్తే ఆ పెద్ద సమస్యకు చెక్ పెట్టొచ్చు..గ్యాస్ రిలీజ్ కూడా!
మారిన జీవనశైలి,ఒక టైం పాడు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. చివరికి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయితే ఆరోగ్యంగా ఉండాలంటే జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేస్తే సరిపోతుంది. నడక ద్వారా బోలెడు న్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలిసిందే. అయితే భోజనం చేశాక కొద్దిసేపు నడవడం, ఆ సమయంలో సహజంగా గాలి పీల్చడం వల్ల జీర్ణక్రియతో పాటు మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి.
మన జీర్ణక్రియ ప్రక్రియ ఆహారం తిన్న వెంటనే మొదలవుతుంది. ఈ సమయంలో కొద్దిసేపు నడవడం వల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. తద్వారా ఆహారం త్వరగా జీర్ణమై కడుపు ఉబ్బరం లేదా అసౌకర్యం తగ్గుతుంది. అంతేకాకుండా నడక ప్రేగు కండరాలను కూడా ఉత్తేజపరుస్తుంది, ఇది జీర్ణవ్యవస్థ ద్వారా ఆహారాన్ని సులభంగా ముందుకు కదిలించడంలో సహాయపడుతుంది.

గాలిని పంపడం ఎందుకు ముఖ్యం
జీర్ణక్రియ సమయంలో ప్రేగులలో సహజంగా వాయువు ఉత్పత్తి అవుతుంది. ఈ వాయువు సకాలంలో శరీరం నుంచి బయటకి వెళ్లకపోతే కడుపులో నొప్పి, అసౌకర్యం, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. భోజనం తర్వాత నడుస్తున్నప్పుడు తేలికగా కదలడం వల్ల ఈ పేరుకుపోయిన వాయువు సులభంగా బయటకి వెళ్లిపోతుంది. దీనిని వాడుక బాషలో పిత్తులు అని పిలుస్తారు. ఒక్కసారి ఈ గ్యాస్ బయటకు వెళ్లిపోతే కడుపులో చాలా హాయిగా ఉన్నట్లు అనిపిస్తుంది. శారీరక ఆరోగ్యానికి ఇది చాలా సాధారణమైన, అవసరమైన ప్రక్రియ.
పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
జర్నల్ ఆఫ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ అండ్ లివర్ డిసీజెస్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం భోజనం తర్వాత తేలికపాటి శారీరక శ్రమ, ముఖ్యంగా నడక, కడుపు నుంచి ఆహారాన్ని ఖాళీ చేసే (గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్) ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల అజీర్ణం, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు గణనీయంగా తగ్గుతాయి.
మరో అధ్యయనం ప్రకారం భోజనం తర్వాత క్రమం తప్పకుండా నడిచే వారిలో ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (IBS) వంటి వ్యాధుల ముప్పు చాలా తక్కువగా ఉంటుంది. నడక క్రమమైన ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది..గ్యాస్ పేరుకుపోయే ధోరణిని తగ్గిస్తుంది.
మొత్తంగా చూస్తే భోజనం చేసిన తర్వాత కనీసం 10-15 నిమిషాలు తేలికపాటి వేగంతో నడవడం మీ జీర్ణక్రియకు, తద్వారా మీ మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ అలవాటును మీ దినచర్యలో చేర్చుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











