Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
పొరపాటున కూడా తేనెతో పాటు వీటిని తినొద్దు, ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది
తేనె.. ఆరోగ్య ప్రదాయిని. పలు రకాల వంటకాల్లో తేనెను వాడతారు. కొందరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా పాలు, టీ, కాఫీల్లో వేసుకుంటారు. తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల తేనెను ఆరోగ్య ప్రదాయినిగా అభివర్ణిస్తారు. అందుకే ఆయుర్వేదంలో తేనె వాడకం ఎక్కువగా ఉంటుంది.

తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదైనా తేనెతో పాటు కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ హానికరమైన తేనె కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నీరు, వేడి పాలతో తేనె:
తేనె సహజంగానే వేడిగా ఉంటుంది. కాబట్టి తేనెను ఎప్పుడూ వెచ్చని వస్తువులతో పాటు తీసుకోకూడదు. వేడి వస్తువులతో తేనె కలిపి తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కొందరు వేడి నీటిలో, వేడి పాలలో తేనె కలుపుకుని తాగుతుంటారు. ఇది ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.
చేపలు, మాంసంతో తేనె:
మాంసాహారం ముఖ్యంగా చేపలు, మాంసంతో తేనెను కలిపి ఎప్పుడూ తినకూడదు. అలాగే వీటిని తిన్న ఒక గంట ముందు అలాగే గంట తర్వాత కూడా తేనెకు దూరంగా ఉండాలి. మాంసం, చేపలతో తేనె తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. అలా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
నెయ్యితో తేనెను కలిపి తీసుకోవద్దు:
తేనెను నెయ్యితో కలిపి ఎప్పుడూ తీసుకోవద్దు. ఎందుకంటే నెయ్యి మరియు తేనెలోని పోషకాలు ఒకదానికొకటి క్రాస్ చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కడుపు నొప్పి, తలనొప్పి వస్తుంది.
చక్కెరతో తేనె:
తేనెలో పంచదార కలిపితే ఆ మిశ్రమాన్ని విషంగా పరిగణించాల్సిందే. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. కనీసం ఒక గంట ముందు, గంట తర్వాత మాత్రమే తేనె కానీ చక్కెర కానీ తీసుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











