Latest Updates
-
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే! -
టెన్షన్స్ తో బీపీ పెరుగుతోందా? అయితే బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు ఉన్నట్లే!..బయటపడే బ్రహ్మాస్త్రం ఇదే! -
షుగర్ కి చెక్, బరువుకు బ్రేక్..రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ రాగి దోశ..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం!
పొరపాటున కూడా తేనెతో పాటు వీటిని తినొద్దు, ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుంది
తేనె.. ఆరోగ్య ప్రదాయిని. పలు రకాల వంటకాల్లో తేనెను వాడతారు. కొందరు చక్కెరకు ప్రత్యామ్నాయంగా పాలు, టీ, కాఫీల్లో వేసుకుంటారు. తేనెలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందువల్ల తేనెను ఆరోగ్య ప్రదాయినిగా అభివర్ణిస్తారు. అందుకే ఆయుర్వేదంలో తేనె వాడకం ఎక్కువగా ఉంటుంది.

తేనె ఆరోగ్యానికి ఎంత మంచిదైనా తేనెతో పాటు కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ హానికరమైన తేనె కాంబినేషన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేడి నీరు, వేడి పాలతో తేనె:
తేనె సహజంగానే వేడిగా ఉంటుంది. కాబట్టి తేనెను ఎప్పుడూ వెచ్చని వస్తువులతో పాటు తీసుకోకూడదు. వేడి వస్తువులతో తేనె కలిపి తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుంది. కొందరు వేడి నీటిలో, వేడి పాలలో తేనె కలుపుకుని తాగుతుంటారు. ఇది ఆరోగ్య సమస్యలను తెచ్చిపెట్టవచ్చు.
చేపలు, మాంసంతో తేనె:
మాంసాహారం ముఖ్యంగా చేపలు, మాంసంతో తేనెను కలిపి ఎప్పుడూ తినకూడదు. అలాగే వీటిని తిన్న ఒక గంట ముందు అలాగే గంట తర్వాత కూడా తేనెకు దూరంగా ఉండాలి. మాంసం, చేపలతో తేనె తీసుకోవడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు చెబుతున్నారు. అలా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.
నెయ్యితో తేనెను కలిపి తీసుకోవద్దు:
తేనెను నెయ్యితో కలిపి ఎప్పుడూ తీసుకోవద్దు. ఎందుకంటే నెయ్యి మరియు తేనెలోని పోషకాలు ఒకదానికొకటి క్రాస్ చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల కడుపు నొప్పి, తలనొప్పి వస్తుంది.
చక్కెరతో తేనె:
తేనెలో పంచదార కలిపితే ఆ మిశ్రమాన్ని విషంగా పరిగణించాల్సిందే. ఎందుకంటే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ సంబంధిత సమస్యలు ఇబ్బంది పెడతాయి. కనీసం ఒక గంట ముందు, గంట తర్వాత మాత్రమే తేనె కానీ చక్కెర కానీ తీసుకోవాలి.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











