Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
ప్రతిరోజూ పండు కొంటున్నారా? గుండె పదిలం?
పండ్లు చాలా రుచి, నోరూరిస్తాయి. తినేందుకు తేలిక. వీటిని వేరే ఐస్ క్రీమ్ లేదా ఇతర ఆహారాలతో కూడా కలిపి తినేయవచ్చు. మరి మీ ఆహారంలో ప్రతిరోజూ పండ్లు తగినన్ని చేర్చి తింటున్నారా? మనమంతా ప్రతిరోజూ ముఖ సౌందర్యం మెరుగుపడాలని, చర్మం కాంతులీనాలని ఎన్నో క్రీములు, పౌడర్లు రాస్తూనే ఉంటాం.అందులో విటమిన్లు, పండ్లు వంటివి ఎన్నో ఉన్నాయంటూ తయారీదారులు చెపుతూనే ఉంటారు. అయితే, సహజంగా దొరికే పండ్లు కొనకుండా మనం వీటిని ఎందుకు కొనుగోలు చేస్తాం? మరి ప్రతిరోజూ మీరు ఎన్ని రకాల పండ్లు మీరు ఆహారంలో తినాలో పరిశీలించండి.

2010 సంవత్సరంలో చేసిన ఒక స్టడీలో ప్రతిరోజూ రెండు కప్పుల పండ్లు తినాలిట. అయితే, మీ బరువును బట్టి తీసుకోవాల్సిన కేలరీలను బట్టి కూడా తినాలని తెలిపారు. రోజుకు అయిదు సార్లు పండ్లు, కూరలు తింటే, అది మీ వయసు, లింగాన్ని బట్టి కూడా ఉంటుంది. మహిళలు 19 నుండి 50 సంవత్సరాల వారు రోజుకు 7 లేదా 8 సార్లు, పురుషులు 8 నుండి పది సార్లు తినాలి. 50 సంవత్సరాలు వయసు పైబడిన పురుషులు మహిళలు అయితే 7 సార్లు వెజిటబుల్స్ మరియు పండ్లు రోజుకు తింటే సరిపోతుంది.
ఇవన్ని విద్యాపరంగా చెప్పుకోటానికి బాగానే ఉంటాయి. పండ్లు కేన్సర్, ఊబకాయం, గుండె జబ్బులు వంటి మొండి వ్యాధులు రాకుండా చేస్తాయి. పండ్లలో పోషకాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కొన్ని పండ్లలో సహజ షుగర్ మరియు కొన్ని ద్రవాలు ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతలను నియంత్రిస్తాయి. పండ్లలో పీచు పదార్ధం కూడా అధికంగా ఉండి మీకు ప్రతిరోజూ సుఖ విరోచనమై మలబద్ధకం లేకుండా చేస్తాయి. అంతేకాదు, బరువును తగ్గించటంలో గణనీయ పాత్రను పోషిస్తాయి. పండ్లు చాలావరకు తొక్క తీయకుండా, రసం తీయకుండా....ఎలా ఉన్నవి అలా తింటే ఎంతో ఆరోగ్యం
మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కల పండ్లను మీ ప్రతిరోజూ ఆహారంలో ఎలా చేర్చాలి?
రోజుకు రెండు కప్పుల పండ్లు తీసుకోవాలని నిర్దేశించారు కాబట్టి, వీటిని రోజుకు నాలుగు సార్లు తినండి. బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం, సాయంత్రం చివరగా రాత్రి డిన్నర్ అయిన తర్వాత. నిలువ రసాయనాలు వేసిన డబ్బాలలోని పండ్ల రసాలు తాగకండి. వీటిలో షుగర్ అధికం, నిలువ కొరకు రసాయనాలు వేస్తారు. పండ్ల రసాలు లేదా తొక్క తీసినవి కాకుండా తాజా పండ్లు ఎలా ఉన్నవి అలా తింటే పోషక విలువలు అధికం అని తెలుసుకోండి. ఏ సీజన్ లో వచ్చే పండ్లను ఆ సీజన్ లో అధికంగా తినండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications