Latest Updates
-
మిథునం, కన్య, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన ధన యోగం..! - బుధవారం, 22 ఏప్రిల్ 2026 -
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా?
రక్తపోటు తగ్గించే అద్భుత కాంబినేషన్ పిల్!

తాజాగా చేసిన ఒక అధ్యయనంలో రీసెర్చర్లు రెండు లేదా అంతకంటే అధిక మందులు కలగలిపిన ఒక సూపర్ పిల్ కనిపెట్టారని అది రక్తపోటును అదుపులో వుంచి గుండె జబ్బులు రాకుండా చేస్తుందని వెల్లడైంది. చాలామంది అధిక రక్తపోటు వున్న రోగులు అనేక రకాల మందులను వాడుతూంటారు. అవి కూడా రోజులో వివిధ సమయాలలో వేసి గుండె జబ్బు లేదా పోటు లేదా స్ట్రోక్ వంటివి రాకుండా జాగ్రత్త పడుతూంటారు. రోగులు కొందరు వయసుపైబడినవారైన కారణంగా వివిధ రకాల టాబ్ లెట్లను వివిధ సమయాలలో వేసుకోవడం కష్టంగానే వుంటుంది. కొన్ని మార్లు, కనీసం ఒక మందు అయినా తాము మరచిపోతూంటారు. దాని కారణంగా కూడా కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తూంటాయి. లేదా ఏది ముందు, ఏది తర్వాత వేయాలి అనే అంశం కూడా వారికి సందిగ్ధంగానే వుంటుంది.
రీసెర్చి మేరకు ఇంగ్లాండ్ దేశంలో ఇరవై లక్షల మంది వ్యక్తులు ప్రతిరోజూ రక్తపోటు లేదా హైపర్ టెన్షన్ వ్యాధికి మూడు లేదా అంతకంటే ఎక్కువగా టాబ్ లెట్స్ వేస్తున్నారు. అయితే వీరిలో కనీసం 80 శాతంమంది రోగులు, వైద్యులు చెప్పిన విధంగా నిర్దేశిత మందులు వాడటం లేదని కూడా అధ్యయనంలో వెల్లడైంది. అంటే దీని అర్ధం వారి రక్తపోటు సరిగా నియంత్రించబడటం లేదని కూడా చెప్పవచ్చు.
కనుక ఈ మూడు లేదా అంతకంటే అధికంగా వున్న రకాల మాత్రలను ఒకే మందుగా రూపొందించి దాని వినియోగాన్ని సమర్ధవంతం చేయడానికి గాను రీసెర్చర్లు ఒకే సూపర్ పిల్ కనుగొన్నట్లు స్ట్రోక్ అసోసియేషన్ డిప్యూటీ డైరెక్టర్ డా. పీటర్ కోల్ మన్ పేర్కొన్న్నట్లుగా డెయిలీ ఎక్స్ ప్రెస్ పత్రిక పేర్కొంది. సుమారు 13.6 శాతంమంది రోగులు అధిక రక్తపోటులకు వైద్యం చేయబడినప్పటికి తీవ్రమైన గుండె జబ్బులబారిన పడినట్లు స్టడీ వెల్లడిచేసింది. అయితే, అన్నీమందులు కలిపిన ఒకే సూపర్ పిల్ వేసినపుడు గుండెపోట్ల శాతం 8.3 కు పడినట్లు తెలిసింది.
కనుక కాంబినేషన్ పిల్ తో చేసే వైద్యం రోగులకు లబ్దికరంగా వుందని గుండె సమస్యలను తగ్గించడమే కాక మందుల వ్యయం కూడా తగ్గిందని స్టడీ నేత డా. జొనాధన్ బెస్లీ తెలిపారు. సుమారుగా పది మిలియన్ రోగుల మెడికల్ రికార్డులను వీరు పరిశీలించారు. అయితే, ఈ కాంబినేషన్ పిల్ అందరికి వాడరాదని, ప్రతి వ్యక్తి రోగ సమస్యను పరిశీలించి వారికి వినియోగించాలని డా. కోల్ మన్ ప్రకటించారు. ఈ స్టడీని జర్నల్ ఆఫ్ మెడికల్ ఎకనామిక్స్ లో ప్రచురించారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











