Latest Updates
-
సోషల్ మీడియాలో రాజయోగం పేరుతో హడావుడి.. ఈ రాశుల వారికి నిజంగానే అదృష్టం ఉందా? -
వేడివేడి అన్నంలోకి అదిరిపోయే మటన్ ఊరగాయ.. ముక్క తగిలితే మజానే! -
ఈ 7 దేవాలయాల్లో శాస్త్రానికి వ్యతిరేకంగా జరిగే అద్భుత సంఘటనలు శాస్త్రవేత్తలు కూడా నిరూపించలేకపోయారు -
జూన్ 1, 2026: గ్రహాల సంచారంతో ఈ రాశుల వారికి అదృష్టం.. రాహుకాలం వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
వృశ్చికం, కర్కాటక రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - సోమవారం, 01 జూన్ 2026 -
కేవలం 3 పదార్థాలతో ఇంట్లోనే క్రీమీ మ్యాంగో ఐస్ క్రీమ్.. ఎలాగో తెలుసా? -
వేడి వేడి అన్నం, రసంలోకి అదిరిపోయే కాంబినేషన్.. తమిళనాడు ఫేమస్ కొంగు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే -
తెలుసుకోకుండానే ప్రేమ చల్లారిపోతోంది ఇది మీ బంధంలో జరుగుతోందా? -
పల్లెటూరి స్టైల్ రవ్వ ఇడ్లీ: ఒక్కసారి ఇలా చేస్తే.. హోటల్ రుచిని మించిపోతుంది -
శరీరంతో చేసిన ద్రోహం కంటే మనసు పరాయిదైపోవడం ఎందుకు ఎక్కువగా గుండె పగులుస్తుంది
లో బీపీ ఉన్నప్పుడు ఉప్పు నీళ్లు తాగడం సరక్షితమేనా? సమ్మర్ లో గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం..
ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో రక్తపోటు (బీపీ) సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. కొందరు హై బీపీతో బాధపడితే, మరికొందరు లో బీపీ (తక్కువ రక్తపోటు)తో సతమతమవుతున్నారు. ముఖ్యంగా మండుతున్న వేసవి కాలంలో లో బీపీ ముప్పు చాలా ఎక్కువ. ఎండల తీవ్రతకు ఉన్నట్లుండి బీపీ పడిపోవడం అనేది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారవచ్చు. కాబట్టి ఈ సమస్య పట్ల సరైన అవగాహన, తక్షణమే తీసుకునే జాగ్రత్తల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఎంతో అవసరం.

లో బీపీ ఎందుకు వస్తుంది? లక్షణాలు ఎలా ఉంటాయి?
ఎండాాకాలంలో చెమట రూపంలో శరీరంలోని నీటి శాతం వేగంగా తగ్గిపోయి డీహైడ్రేషన్ బారిన పడటం, బరువు తగ్గడం, పనుల ఒత్తిడిలో పడి ఎక్కువ సేపు పస్తులు ఉండటం, ఉప్పు శాతం తగ్గడం లేదా కొన్ని రకాల మందుల దుష్ప్రభావాల వల్ల లో బీపీ వస్తుంది. బీపీ పడిపోయిన వ్యక్తిలో అకస్మాత్తుగా తల తిరగడం, విపరీతమైన నీరసం రావడం, కళ్ల కింద నల్లబడటం, కళ్లు బైర్లు కమ్మడం, విపరీతంగా చెమటలు పట్టడం లేదా ఒక్కోసారి స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అలాంటప్పుడు కంగారు పడకుండా ఏం చేయాలి?
ఈ పరిస్థితి ఎదురైనప్పుడు చుట్టుపక్కల వారు కంగారు పడకూడదు. ఎవరికైనా ఉన్నట్లుండి బీపీ పడిపోతే, ముందుగా ఆ వ్యక్తిని ప్రశాంతమైన, చల్లటి ప్రదేశంలో నేలపై పడుకోబెట్టండి. వారి కాళ్లను పైకి ఎత్తండి. అవసరమైతే కాళ్ల కింద రెండు, మూడు దిండ్లు కూడా పెట్టవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల గుండె నుంచి మెదడుకు రక్త ప్రసరణ వేగంగా జరిగి, తలతిరగడం ఆగుతుంది. బాధితులు త్వరగా కోలుకుంటారు.

ఉప్పు నీరు సంజీవనిలా పనిచేస్తుందా?
లో బీపీతో బాధపడుతున్న వ్యక్తికి వెంటనే గ్లాసు నీటిలో కొద్దిగా ఉప్పు, పంచదార కలిపి తాగించడం అద్భుతమైన ప్రథమ చికిత్సగా డాక్టర్లు చెబుతున్నారు. ఉప్పులో ఉండే సోడియం శరీరంలో ద్రవాల సమతుల్యతను కాపాడటానికి సహాయపడుతుంది. బీపీ పడిపోయినప్పుడు శరీరంలో సోడియం లోపిస్తుంది. కాబట్టి ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగడం వారికి తక్షణ శక్తిని ఇస్తుంది. అయితే ఇది కేవలం ప్రథమ చికిత్స మాత్రమేనని, పరిస్థితి కుదుటపడిన తర్వాత తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించి పూర్తిస్థాయి ట్రీట్మెంట్ తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎప్పుడు అప్రమత్తం కావాలి?
ఒకవేళ గుండె సంబంధిత వ్యాధులు, తీవ్రమైన ఇన్ఫెక్షన్లు, రక్తస్రావం లేదా మరేదైనా పెద్ద ఆరోగ్య సమస్య వల్ల బీపీ పడిపోతే.. కేవలం ఉప్పు నీరు తాగించడం మాత్రమే సరిపోదు. ఇలాంటి సందర్భాల్లో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హాస్పిటల్ కి తరలించాలి. తరచుగా లో బీపీకి గురయ్యే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపవాసాలు చేయకూడదని సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఈ ఎండాకాలంలో రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు త్రాగాలి. శరీరంలో నీటిశాతం తగ్గకుండా కొబ్బరి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు తీసుకోవాలి. సరైన సమయానికి పౌష్టిక ఆహారం తీసుకుంటే ఈ లో బీపీ సమస్యను మనం సులభంగా జయించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications