Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
ఎంతకీ దగ్గు తగ్గడం లేదా? ఇలా చేస్తే ఇట్టే తగ్గిపోతుంది, కావాలంటే ట్రై చేసి చూడండి
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఒక్కొక్కటిగా ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మొదటి జలుబుతో మొదలవుతుంది. కొంత మందిలో దగ్గు వస్తుంది. తర్వాత జ్వరాలు వచ్చేస్తాయి. కలుషిత నీరు తాగడం, వాతావరణ మార్పు, ఇన్ని రోజులు చల్లని నీరు తాగిన అలవాటులో వాటినే తాగుతుండటం వల్ల గొంతు సమస్యలు తలెత్తి దగ్గు మొదలవుతుంది. కొంత మందిలో 2, 3 రోజుల్లో దగ్గు తగ్గిపోతుంది. కానీ కొంత మంది మాత్రం వారాల తరబడి దగ్గుతో ఇబ్బంది పడుతుంటారు.
అదే పనిగా దగ్గడం వల్ల ఎదుటి వారికి ఇబ్బంది, మనకూ ఇబ్బందే. ఇలాంటి దగ్గును కొన్ని చిట్కాలు ఇట్టే తగ్గించుకోవచ్చని పెద్దలు ఎప్పుడూ చెప్పేది. ఆ చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వర్షాకాలంలో తడి పెరుగుతుంది. తడి వాతావరణం, చల్లని వాతావరణంలో సూక్షక్రిములు పెరగడానికి అనువైన పరిస్థితులు. దీంతో నీటిలో, ఆహారంలో సూక్షక్రిములు చేరుతాయి. వాటిని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు చేరి రోగాలకు కారణం అవుతాయి. శరీరంలోకి చేరిన బ్యాక్టీరియాను తరిమికొట్టేందుకు మనలోని రోగనిరోధక శక్తి ప్రయత్నిస్తుంది. ఈ రోగనిరోధక శక్తిని కొద్దిగా చేయూత అందిస్తే రోగాలను సులభంగా తగ్గించుకోవచ్చు.
దగ్గు మొదలు కాగానే చాలా మంది మందులు, సిరప్ లు తాగుతుంటారు. దీని వల్ల బయటి నుంచి వచ్చే యాంటీ బాడీలు బ్యాక్టీరియాను చంపి దగ్గు తగ్గిస్తుంది. కానీ ఇలా తరచూ చేయడం మంచిది కాదు అంటున్నారు వైద్యులు. బయటి మందులకంటే కూడా మనలోని రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే వ్యాధులపై పోరాడేలా చూడాలంటున్నారు. అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి.
ఆవిరి పట్టుకోవాలి:
జలుబు చేసినా, దగ్గు ఇబ్బంది పెట్టినా చాలా మంది పాటించే చిట్కా ఆవిరి పట్టుకోవడం. ఈ పద్ధతి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టే ఈ రెమిడీ చాలా కాలంగా పాటిస్తూ వస్తున్నాం. వేడి వేడి నీటిలో పసుపు, శొంఠి లాంటివి వేసుకుంటే మరింత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. నీరు, ముక్కు ద్వారా ఆవిరి పీలిస్తే.. గొంతులోని మ్యూకస్ కణాలు చనిపోతాయి. ఆవిరి వేడికి అవి చనిపోవడం వల్ల దగ్గు తగ్గుతుంది. ఇలా ఒకటీ రెండూ సార్లు చేస్తే దగ్గు, జలుబు ఇట్టే తగ్గిపోతుంది.
వేడి నీరు, తేనె:
తేనెకు ఆయర్వేదంలో ప్రముఖ స్థానం ఉంటుంది. ఆయుర్వేద మందుల్లో తేనెను ఎక్కువగా వాడతారు. అందులోని పోషక విలువల వల్ల తేనె తీసుకోవడం మంచిది అని చెబుతుంటారు. తేనెలోని పోషకాలు ఆరోగ్యానికి మంచివి. వేడి వేడి నీటిలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఊపిరితిత్తలకు కావాల్సిన మాయిశ్చర్ అందుతుంది. ఇలా చేస్తే గొంతు నొప్పి కూడా తగ్గుతుంది.
నిమ్మరసం:
నిమ్మరసంలో విటమిన్-సి ఉంటుంది. విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నిమ్మకాయలో, ఉసిరికాయల్లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. సప్లిమెంట్ల రూపంలో కంటే కూడా విటమిన్-సిని పండ్లు, ఫలాల రూపంలో తీసుకోవడం మరింత మంచిది. అలాగే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











