Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
గుండెల్లో మంటగా అనిపిస్తుందా?..వెంటనే ఇలా చేయండి
పండగలొచ్చాయంటే చాలు, మన ఇళ్లన్నీ సందడిగా మారిపోతాయి. కృష్ణాష్టమి, వినాయక చవితి, దసరా వంటి పర్వదినాలలో నోరూరించే పిండివంటలు, ఘుమఘుమలాడే వంటకాలు, తీపి పదార్థాలు తినకుండా ఉండటం ఎవరికైనా కష్టమే. బంధుమిత్రులతో కలిసి సరదాగా భోజనం చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువగా తిన్నామా అని కూడా అనిపించదు. అయితే ఇదే సమయంలో కొంచెం ఎక్కువగా నూనె వంటకాలు, స్వీట్లు తిన్నారంటే గుండెల్లో మంట మొదలవుతుంది.
ఛాతీలో మొదలైన ఈ మంట కొన్నిసార్లు గంటల తరబడి, రోజుల తరబడి మనల్ని వేధిస్తుంది. ఏమీ తినాలన్నా, తాగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు కడుపులో యాసిడ్ పెరిగి, తేన్పులతో చికాకు పుడుతుంది. అయితే ఈ సమస్యతో మీరు బాధపడుతుంటే వెంటనే మెడికల్ షాపుకి పరుగెత్తాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే దొరికే కొన్ని పదార్థాలతో ఈ సమస్యకు వెంటనే చెక్ పెట్టవచ్చు. అవేంటో ఇక్కడ చూడండి.

చల్లని పాలు
మీకు గుండెల్లో మంట తీవ్రంగా అనిపిస్తే వెంటనే ఫ్రిజ్లోంచి తీసిన చల్లని పాలు చక్కెర కలపకుండా నెమ్మదిగా సిప్ చేస్తూ తాగండి. పాలలో ఉండే కాల్షియం కడుపులోని అదనపు యాసిడ్ ను న్యూట్రలైజ్ చేసి మంట నుంచి తక్షణమే ఉపశమనం కలిగిస్తుంది. ఇది అత్యంత ఈజీ, ప్రభావవంతమైన చిట్కా.
సోంపు, పటిక బెల్లం
భోజనం తర్వాత కొద్దిగా సోంపు, పటిక బెల్లం కలిపి నమలడం మనకు అలవాటే. ఇది కేవలం నోటికి సువాసన ఇవ్వడమే కాదు, జీర్ణక్రియను మెరుగుపరిచి అసిడిటీని తగ్గిస్తుంది. ఈ రెండింటినీ నమిలిన తర్వాత గ్లాసు చల్లటి నీరు తాగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
కొబ్బరి నీళ్లు, అరటిపండు
కొబ్బరి నీళ్లు శరీరానికి చలువ చేసి, కడుపులోని యాసిడ్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతాయి. అదేవిధంగా పొటాషియం అధికంగా ఉండే అరటిపండు కూడా జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది. పండగ తర్వాత శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, మంటను తగ్గించుకోవడానికి ఈ రెండూ అద్భుతంగా పనిచేస్తాయి.
అల్లం
అల్లంలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు జీర్ణశక్తిని పెంచి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలను దూరం చేస్తాయి. ఒక చిన్న అల్లం ముక్కను నమలవచ్చు లేదా అల్లం టీ, అల్లం రసం నీళ్లలో కలుపుకుని తాగినా మంచిదే.
ఉసిరికాయ
గుండెల్లో మంటకు ఉసిరికాయ ఒక దివ్యౌషధం. దీనిలో విటమిన్ సి తో పాటు యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కడుపులోని మంటను తగ్గించి, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. పచ్చి ఉసిరికాయను తినవచ్చు లేదా ఉసిరి రసం, ఉసిరి మురబ్బా (జామ్) రూపంలోనైనా తీసుకోవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications