Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటే..ఇది దంతాలకు సంజీవని!
పాత రోజుల్లో దంత సంరక్షణ కోసం చాలామంది వేప పుల్ల, తుమ్మ పుల్ల వాడేటోళ్లు. నేటికీ మనదేశంలోని పల్లెటూర్లలో చాలామంది పళ్లు తోముకోడానికి వేప పుల్లలనే ఉపయోగిస్తుంటారు. కానీ పసుపు పచ్చగా మారిన మీ పళ్లను తెల్లగా మెరిపించి, పయోరియా, పంటినొప్పి వంటి తీవ్రమైన సమస్యలను కూడా దూరం చేసే ఒక అద్భుతమైన మొక్క గురించి మీరు ఎప్పుడైనా విన్నారా?
అలాంటి ఒక సంజీవని లాంటి మొక్కే ఉత్తరేణి. మన దంత ఆరోగ్యానికి ప్రకృతి ప్రసాదించిన సంజీవని ఉత్తరేణి మొక్క. ఇది మన పెరట్లో, పొలాల గట్లపై, అడవులలో చాలా విరివిగా కనిపిస్తుంది. అయితే దీని అద్భుత ఔషధ గుణాల గురించి తెలియక చాలామంది దీనిని ఒక పనికిరాని కలుపు మొక్కగా భావించి పీకిపారేస్తుంటారు.

కానీ ఆయుర్వేదంలో దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దంత సంబంధిత వ్యాధుల నివారణలో ఇది ఒక దివ్యౌషధంలా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రెండు రకాలు - అపారమైన ప్రయోజనాలు
నిపుణుల ప్రకారం ఉత్తరేణిలో ప్రధానంగా రెండు జాతులు ఉంటాయి - తెల్ల ఉత్తరేణి, ఎరుపు ఉత్తరేణి. ఈ రెండూ కూడా వైద్యంలో విస్తృతంగా ఉపయోగించబడతాయి. వీటి వేర్లతో చేసిన పుల్లతో పళ్లు తోముకోవడం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
పసుపు పళ్లకు వీడ్కోలు: ఈ మొక్క వేరుతో చేసిన పుల్లతో కేవలం 10 రోజుల పాటు క్రమం తప్పకుండా పళ్ళు తోముకుంటే చాలు ఎంతటి గార పట్టిన పసుపు పళ్లయినా ముత్యాల్లా తెల్లగా మెరవడం ఖాయం.
పయోరియా, చిగుళ్ల నొప్పికి చెక్: పయోరియా, చిగుళ్ల వాపు, నొప్పి, రక్తం కారడం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక వరం. దీని పుల్లతో రోజూ బ్రష్ చేయడం వల్ల చిగుళ్లు గట్టిపడి, పయోరియా సమస్య క్రమంగా తగ్గిపోతుంది.
తక్షణ పంటినొప్పి నివారణ: తీవ్రమైన పంటినొప్పితో బాధపడుతున్నప్పుడు 2-3 ఉత్తరేణి ఆకులను నలిపి రసం తీయాలి. ఆ రసంలో దూదిని ముంచి నొప్పి ఉన్న పంటిపై లేదా పుచ్చిపోయిన పంటిపై ఉంచితే నొప్పి నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది.
సంపూర్ణ నోటి ఆరోగ్యం: ఉత్తరేణి పుల్లతో రోజూ పళ్లు తోముకోవడం వల్ల దంతాలు శుభ్రపడటమే కాకుండా కదిలే పళ్లను గట్టిపరచడం, బలహీనమైన చిగుళ్లకు బలాన్నివ్వడం, నోటి దుర్వాసనను తరిమికొట్టడం వంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
ఇది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి నోటి పూతలు, గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications