Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
సాయిచంద్ కూడా ఆయనలాగే చనిపోయాడా.. అసలు గుండెపోటు వస్తే ఏం చేయాలి?
ప్రముఖ సింగర్, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ హఠాత్తుగా గుండెపోటుతో హఠాన్మరణం చెందిన సంగతి అందిరికీ తెలిసిందే. అతి చిన్న వయసులోనే ఆయన హార్ట్ ఎటాక్ తో చనిపోవడం బీఆర్ఎస్ శ్రేణులందరితో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రజలను కూడా తీవ్ర విస్మయానికి గురి చేసింది. 39 ఏళ్ల వసయులోనే సాయి చంద్ గుండెపోటుతో చనిపోవడంపై పలువురు వైద్యులు స్పందిస్తున్నారు.

కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా అలాగే చనిపోయారు. అయితే వీరిద్దరి మరణం ఒకేలా ఉందని సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ మడివాడ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ కు హార్ట్ ఎటాక్ వచ్చిందని ఓ మెడికల్ సెంటర్ లో నిర్ధారించాక.. మెరుగైన వైద్యం కోసం పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆయన చనిపోయాడని.. అదే రీతిలో సాయిచంద్ కూడా చనిపోయాడని గుర్తించారు. గుండెపోటు వచ్చినప్పుడు ప్రాణాపాయ స్థితిని తప్పించడానికి ఏం చేయొచ్చనే విషయాలను కూడా ఆయన తెలిపారు.
సీపీఆర్పై అందరికీ శిక్షణ ఇవ్వాలి:
ప్రతీ ఒక్కరికీ సీపీఆర్ ఎలా చేయాలనే విషయమై శిక్షణ ఇవ్వాలని.. ఆటోమెటెడ్ ఎక్స్ టర్నర్ డిఫిబ్రిలేటర్స్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించి, వాటిని పౌర సంఘాల దగ్గర ఉంచాలని సూచించారు. హార్ట్ అటాక్ బారిన పడిన రోగులను ఆస్పత్రికి తరలించే సమయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. హార్ట్ ఎటాక్ వచ్చిన వారిని అంబులెన్సులో మాత్రమే ఆస్పత్రికి తరలించాలని... ప్రైవేటు వాహనాల్లో సీపీఆర్ చేయడం కష్టమని వివరించారు.
అంబులెన్సులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్సీషియన్:
సీపీఆర్ చేయడం, డిఫిబ్రిలేటర్ వాడకం, ఇన్ ట్యూబేషన్ విషయంలో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకు శిక్షణ ఇవ్వాలి. ప్రతీ అంబులెన్సులో ఎమర్జెన్సీ మెడికల్ టెక్సీషియన్ ఉంచేలా చట్టాలను తీసుకురావాలి. వీరికి 15 రోజుల్లోగా శిక్షణ ఇవ్వచ్చు. పశ్చిమ దేశాల తరహాలో ప్రజలు పెద్ద సంఖ్యలు గుమిగూడే ప్రదేశాల్లో ఆటోమేటెడ్ ఎక్స్ టర్నర్ డిఫిబ్రిలేటర్స్, శిక్షణ పొందిన వ్యక్తులను ఉంచే జీవీ తీసుకురావాలని ముఖర్జీ మడివాడ మంత్రి కేటీఆర్ కు సూచించారు.
కరోనానే కారణమని చెప్పలేం:
గుండె సంబంధిత రోగులను శిక్షణ పొందిన ఈఎంటీలు, రీససిటేషన్ పరికరాలు ఉన్న అంబులెన్సుల్లో తరలించేలా మరో జీవో తీసుకురావాలని కూడా ఆయన సూచించారు. కరోనా తర్వాత వచ్చిన జీవన శైలి మార్పుల వల్లే గుండెపోట్లు పెరిగాయని చెబుతున్నారు. గుండె పోటుకు కరోనా, వ్యాక్సిన్లు కారణమని భావించలేమని తెలిపారు. గుండె జబ్బులు చాలా కారణాలు ఉంటాయన్నారు.
Disclaimer: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications











