Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఆ రోగంలో హైదరాబాదీలు టాప్.. మరణానికి అతి దగ్గరలో..!
ఈ మధ్య కాలంలో చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. కాలుష్యం, మారుతున్న జీవన విధానం, తింటున్న ఆహార పదార్థాల కారణంగా చాలా మంది అనేక రోగాల బారిన పడుతూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దానికి అద్దం పట్టేలా కేంద్రం ఈరోజు విడుదల చేసిన జాబితా కూడా ఉంది. ఈ జాబితాలో దేశంలో షుగర్ పేషెంట్లు అధికమయ్యారని కేంద్రం పేర్కొంది. షుగర్ పేషెంట్లలో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందో వెల్లడించింది కూడా. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నంబర్ వన్ స్థానంలో తమిళనాడు
దేశంలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు ఉన్న జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. ఆ రాష్ట్రంలో 80.90 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారని పేర్కొంది. అటు రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 39.81 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నాయని తెలిపింది. మూడో స్థానంలో కర్ణాటక ఉండగా.. ఆ రాష్టంలో 28.74 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నట్లు పేర్కొంది.

తెలంగాణ ఎన్నో స్థానమంటే
అత్యధిక మంది షుగర్ పేషెంట్లు ఉన్న జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. తెలంగాణాలో 24.52 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారని పేర్కొంది. ఇది కొంత కలవర పెట్టె అంశంమని చెప్పుకోవచ్చు. ఏపీలో 20.92 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉండగా.. అత్యల్పంగా ఢిల్లీలో కేవలం 1,108 మంది మాత్రమే ఉన్నారు. అటు దేశ వ్యాప్తంగా 3.13 కోట్ల మంది షుగర్ బాధితులున్నారని కేంద్రం పేర్కొంది.
షుగర్ ఎందుకొస్తుందంటే?
మన శరీరంలో క్లోమ గ్రంథి అని ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ శరీరానికి కావాల్సిన శక్తిని అందించే షుగర్ను శరీరంలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ క్లోమ గ్రంథి ఇన్సులిన్ను సరిగ్గా ఉత్పత్తి చేయకపోయినా, ఇన్సులిన్ పనితీరులో లోపాలు ఉన్నా రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. గ్లూకోజ్ శక్తిగా మారడం ఆగిపోతుంది. దీంతో షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. దానినే డయాబెటిక్ లేదా మధుమేహం అని అంటుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications











