Latest Updates
-
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది -
బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లు తినొచ్చా? ఫిట్నెస్ నిపుణులు ఏమంటున్నారంటే!
ఆ రోగంలో హైదరాబాదీలు టాప్.. మరణానికి అతి దగ్గరలో..!
ఈ మధ్య కాలంలో చాలా మంది రోగాల బారిన పడుతున్నారు. కాలుష్యం, మారుతున్న జీవన విధానం, తింటున్న ఆహార పదార్థాల కారణంగా చాలా మంది అనేక రోగాల బారిన పడుతూ అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. దానికి అద్దం పట్టేలా కేంద్రం ఈరోజు విడుదల చేసిన జాబితా కూడా ఉంది. ఈ జాబితాలో దేశంలో షుగర్ పేషెంట్లు అధికమయ్యారని కేంద్రం పేర్కొంది. షుగర్ పేషెంట్లలో ఏ రాష్ట్రం ఏ స్థానంలో ఉందో వెల్లడించింది కూడా. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
నంబర్ వన్ స్థానంలో తమిళనాడు
దేశంలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు ఉన్న జాబితాలో తమిళనాడు అగ్రస్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. ఆ రాష్ట్రంలో 80.90 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారని పేర్కొంది. అటు రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది. ఆ రాష్ట్రంలో 39.81 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నాయని తెలిపింది. మూడో స్థానంలో కర్ణాటక ఉండగా.. ఆ రాష్టంలో 28.74 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నట్లు పేర్కొంది.

తెలంగాణ ఎన్నో స్థానమంటే
అత్యధిక మంది షుగర్ పేషెంట్లు ఉన్న జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని కేంద్రం వెల్లడించింది. తెలంగాణాలో 24.52 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉన్నారని పేర్కొంది. ఇది కొంత కలవర పెట్టె అంశంమని చెప్పుకోవచ్చు. ఏపీలో 20.92 లక్షల మంది షుగర్ పేషెంట్లు ఉండగా.. అత్యల్పంగా ఢిల్లీలో కేవలం 1,108 మంది మాత్రమే ఉన్నారు. అటు దేశ వ్యాప్తంగా 3.13 కోట్ల మంది షుగర్ బాధితులున్నారని కేంద్రం పేర్కొంది.
షుగర్ ఎందుకొస్తుందంటే?
మన శరీరంలో క్లోమ గ్రంథి అని ఉంటుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇన్సులిన్ శరీరానికి కావాల్సిన శక్తిని అందించే షుగర్ను శరీరంలో ప్రొడ్యూస్ చేస్తుంది. ఒకవేళ క్లోమ గ్రంథి ఇన్సులిన్ను సరిగ్గా ఉత్పత్తి చేయకపోయినా, ఇన్సులిన్ పనితీరులో లోపాలు ఉన్నా రక్తంలో గ్లూకోజ్ పేరుకుపోతుంది. గ్లూకోజ్ శక్తిగా మారడం ఆగిపోతుంది. దీంతో షుగర్ వ్యాధి వచ్చేస్తుంది. దానినే డయాబెటిక్ లేదా మధుమేహం అని అంటుంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications