Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
అలర్ట్: ప్రతి మహిళ చేయించుకోవాల్సిన ముఖ్యమైన టెస్ట్ లు..!!
కెరీర్, ఫ్యామిలీ అంటూ.. రెస్ట్ లేకుండా బిజీగా గడిపే మహిళా మీరు ? మీ గురించి కేర్ తీసుకోవడానికి సమయం లేకుండా గడుపుతున్నారా ? అయితే.. మీరు ఖచ్చితంగా మీ కోసం కొన్ని మార్పులు చేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మంచి పద్ధతి కాదు, మంచి అలవాటు కూడా కాదు.

చాలా సందర్భాల్లో మహిళలు మల్టీ టాస్కింగ్ చేస్తుంటారు. వాళ్ల కుటుంబ బాధ్యతలు, కెరీర్ కోసం పనిచేయడం, ఇంటి పనులు చేసుకోవడం, వంట వంటి రకరకాల పనులతో బిజీ బిజీగా గడుపుతారు. ఇలా అన్ని పనుల్లో బిజీగా ఉండటం వల్ల వాళ్ల ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. కానీ దీనివల్ల.. భవిష్యత్ లో రకరకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
అంతేకాదు.. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు భార్యా భర్తలు ఇద్దరిపైనా పడతాయి. అయితే కొన్ని మాత్రం కేవలం మహిళలకే వచ్చే అవకాశాలుంటాయి. కాబట్టి ఇలాంటి అనారోగ్య సమస్యలపై మహిళలకు అవగాహన ఉండటం చాలా అవసరం. చాలా సందర్భాల్లో మహిళలు సడెన్ గా అనారోగ్యానికి గురవుతుంటారు.
అయితే కొన్ని సందర్భాల్లో వాళ్లలో కనిపించే లక్షణాలను చాలా నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల సమస్య మరింత పెద్దగా మారుతుంది. కాట్టి.. మహిళల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. టైం టు టైం పరీక్షలు చేయించుకోవాలి. మహిళలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిన కొన్ని మెడికల్ టెస్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్
21 నుంచి 65 ఏళ్ల లోపు మహిళలు ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి. కనీసం 3 నుంచి 5 ఏళ్లకు ఒకసారైనా.. ఈ పరీక్ష చేయించుకోవాలి. ఎందుకంటే.. ఇది ఎక్కువగా మహిళల్లో కనిపిస్తుంది. కాబట్టి అలర్ట్ గా ఉండాలి.

బ్రెస్ట్ క్యాన్సర్
35 నుంచి 75 ఏళ్ల వయసు లోపు మహిళలు ఖచ్చితంగా రెగ్యులర్ గా బ్రెస్ట్ క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవాలి. దీనివల్ల ఈ ప్రాణాంతక వ్యాధి రాకుండా జాగ్రత్త పడవచ్చు.

బోన్ మినరల్ టెస్ట్
40 ఏళ్లు దాటిన మహిళలకు బోన్ మినరల్ డెంన్సిటీ టెస్ట్ చేస్తారు. ఓస్టియోపోరోసిస్ రిస్క్ ఏమైనా ఉందా అని ఈ పరీక్ష చేస్తారు. మహిళల్లో సాధారణంగా కనిపించే ఎముకల సమస్య ఇది.

కోలన్ స్కోపీ
కోలన్ క్యాన్సర్ రిస్క్ ఉందేమో ఒక్కసారి చెక్ చేయించుకుంటే.. మొదటి దశలోనే గుర్తించవచ్చు. ఈ టెస్ట్ 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు మహిళల్లో కంపల్సరీ నిర్వహించాలి.

పీసీఓడీ స్క్రీనింగ్
ఏ వయసు మహిళల్లో అయినా.. ఈ టెస్ట్ చేస్తారు. రుతుక్రమం మొదలయినప్పటి నుంచి ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్ ద్వారా ఓవరీస్ లో సిస్ట్స్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తారు. వీటి వల్ల రుతుక్రమ సమస్యలు వస్తాయి.

ఫెర్టిలిటీ చెక్ అప్
గర్భం పొందాలని భావించే మహిళలందరికీ.. ఈ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్ లో గర్భాశయం, అండశయం పనితీరు సక్రమంగా ఉందా లేదా అని పరీక్ష చేస్తారు.

డయాబెటిస్ టెస్ట్
45 ఏళ్లు వయసు దాటిన మహిళల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని ఖచ్చితంగా టెస్ట్ చేయాలి. దీనివల్ల డయాబెటిస్ ముప్పు నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications