Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
రాత్రి భోజనం తర్వాత ఎట్టి పరిస్థితిలో ఈ పనులు చేయకండి..చేస్తే ఇక అంతే..
రాత్రి పూట భోజనం చేసిన వెంటనే కొందరు నిద్రిస్తారు. ఇంకా కొందరు స్నానం చేస్తారు. మరి కొందరైతే స్మోకింగ్ చేస్తారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే రాత్రి పూట భోజనం తరువాత ఈ పనులను అస్సలు చేయకూడదు.
ఇవే కాదు, ఇంకా ఇలాంటివే కొన్ని పనులను రాత్రి పూట డిన్నర్ అవగానే చేయరాదు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వాకింగ్ చేయడం...
రాత్రి పూట డిన్నర్ చేసిన వెంటనే కొంత సేపు వాకింగ్ చేయాలని చెబుతారు. అలా చేస్తే ఆరోగ్యానికి మంచిదని కూడా అంటారు. కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. ఎందుకంటే తిన్న వెంటనే నడవడం వల్ల రక్తం చేతులకు, కాళ్లకు వెళ్తుంది. దీంతో జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. కనుక తిన్న వెంటనే వాకింగ్ చేయరాదు. అంతగా చేయాలనిపిస్తే ఒక గంట లేదా గంటన్నర పాటు వేచి ఉన్నాక చేయవచ్చు.

నీరు తాగడం...
మన శరీరానికి నీరు అవసరమే. కానీ దాన్ని తగిన సమయంలోనే తాగాలి. ప్రధానంగా రాత్రి పూట డిన్నర్ చేసిన వెంటనే నీటిని అస్సలు తాగరాదు. కనీసం 30 నుంచి 60 నిమిషాల పాటు వేచి ఉండాలి. లేదంటే జీర్ణవ్యవస్థ పనికి ఆ నీరు అడ్డు పడుతుంది. దీంతో మలబద్దకం సమస్య వస్తుంది.

పండ్లు తినడం...
రాత్రి పూట భోజనం చేసిన వెంటనే పండ్లను తినడం చాలా మందికి అలవాటు. అయితే అలా చేయకూడదు. ఎందుకంటే రాత్రి పూట డిన్నర్ తరువాత పండ్లను తింటే దాంతో పొట్ట ఉబ్బరంగా తయారవుతుంది. గ్యాస్ సమస్యలు వస్తాయి. దీంతోపాటు తిన్నది కూడా సరిగ్గా జీర్ణమవదు.

పళ్లు తోముకోవడం...
డిన్నర్ చేసిన వెంటనే దంతాలను తోముకోవడం కూడా చాలా మందికి అలవాటు. అయితే అలా చేయకూడదు. ఎందుకంటే దంతాల మీద ఉన్న ఎనామిల్ పొర తొలగిపోతుంది. అప్పుడు దంతాలు తమ సహజ కాంతిని కోల్పోతాయి. కాబట్టి డిన్నర్ చేసిన వెంటనే పళ్లు తోముకోరాదు. కనీసం 30 నిమిషాల పాటు అయినా వేచి ఉండాలి. ఆ తరువాతే ఆ పని చేయాలి.

పొగ తాగడం...
డిన్నర్ చేసిన వెంటనే కాదు, అసలు ఏ సమయంలోనూ, ఎప్పుడూ కూడా స్మోకింగ్ చేయరాదు. దాంతో క్యాన్సర్ వచ్చే రిస్క్ పెరుగుతుంది. అయితే ఆ అలవాటును మానలేం అనే వారు, కనీసం డిన్నర్ చేశాకైనా మానేయడం మంచిది. ఎందుకంటే డిన్నర్ చేసిన వెంటనే స్మోకింగ్ చేస్తే సాధారణ సమయంలో చేసిన స్మోకింగ్ కన్నా క్యాన్సర్ వచ్చే రిస్క్ను మరింతగా పెంచుతుంది.

టీ, కాఫీ తాగడం...
చాలా మంది డిన్నర్ చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతారు. నైట్ షిఫ్ట్ చేసే వారైతే అలా తాగేవారు ఇంకా ఎక్కువగానే ఉంటారు. నిజానికి అలా డిన్నర్ అయిన వెంటనే టీ, కాఫీ వంటివి తాగితే జీర్ణ క్రియకు ఆటంకం ఏర్పడుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు వస్తాయి. తిన్న ఆహారంలో ఉండే పోషకాలు శరీరానికి అందవు. ప్రధానంగా ఐరన్ను శరీరం ఏమాత్రం గ్రహించలేదు. కనుక తిన్న వెంటనే కాఫీ, టీ తాగరాదు.

స్నానం చేయడం...
తిన్న వెంటనే స్నానం చేసినా అప్పుడు కూడా రక్త ప్రసరణ శరీరంలోని ఇతర భాగాలకు జరుగుతుందే తప్ప జీర్ణ వ్యవస్థకు సరిగ్గా జరగదు. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరగదు.

నిద్రించడం...
డిన్నర్ చేసిన వెంటనే నిద్రించరాదు. అలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. గ్యాస్, అసిడిటీ పెరగడంతోపాటు తిన్న ఆహారం కొవ్వుగా మారుతుంది. అప్పుడు అధికంగా బరువు పెరుగుతారు. కాబట్టి నిద్రించడానికి రెండు గంటల ముందే భోజనం చేయాలి.



Click it and Unblock the Notifications