విభూతి రాసుకోటం వల్ల ఆరోగ్య లాభాలు

By Deepti

చాలామంది భారతీయులు నుదురుపై బూడిదని రాసుకునే అలవాటు కలిగిఉంటారు. ఈ బూడిదను విభూతి లేదా 'భస్మ' అంటారు. కొంతమంది నుదురుపై రాసుకుంటే, మరికొంతమంది ఛాతీ మరియు చేతులపై రాసుకుంటారు.

నిజానికి,విభూతి అంటే ఏంటి? విభూతి లేదా భస్మ అనేది ధునిలో మిగిలిపోయిన బూడిద. సాధారణంగా,కొన్నిరకాల ధాన్యాలు,కొన్ని మొక్కలు,నెయ్యి మరియు కలపను పవిత్ర అగ్నిలో వేసి ఆ దినుసులన్నిటి వల్ల వచ్చిన ఉత్పత్తే విభూతి.దానికి చాలా ఆరోగ్య లాభాలు ఉన్నాయి.

అవును, నుదురుపై విభూతి వల్ల ఆరోగ్య లాభాలున్నాయి. వాటిని చర్చిద్దాం.

లాభం #1

లాభం #1

తలనొప్పులలో చాలారకాలున్నాయి. విభూతి లేదా భస్మం నుదురుపై ఉంచుకోటం వల్ల ఎండవల్ల వచ్చిన తలనెప్పిని తగ్గిస్తుంది.అనేకరకాల ప్రత్యామ్నాయ వైద్యాలలో,కనుబొమ్మల మధ్య స్థలంకు ముఖ్య ప్రాధాన్యత కలిగి ఉంటుంది.ఆ స్థలంలో మర్దన కానీ,నెమ్మదిగా ఒత్తిడినివ్వటం వల్ల కొన్నిరకాల తలనెప్పులకు ఉపశమనం లభిస్తుంది.

లాభం #2

లాభం #2

బూడిద లేదా భస్మం ఆయుర్వేదంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.నిజానికి ఆయుర్వేద మందులలో ముఖ్యపదార్థంగా కూడా వాడతారు.నుదురుపై రాసుకోవటం వల్ల జలుబు తగ్గుతుంది.

లాభం #3

లాభం #3

కనుబొమ్మల మధ్య స్థలాన్ని ప్రేరేపించటం వల్ల కూడా మంచి ప్రభావం ఉంటుంది.అది సైనస్ లను ఖాళీ చేస్తుంది. ముక్కుదిబ్బడను కూడా ఆపుతుంది. విభూతిని నుదురుపై రాయటం వల్ల,ఆ భాగం ప్రేరేపించబడుతుంది.

లాభం #4

లాభం #4

విభూతిని నుదురుపై రాసినప్పుడు,అది మర్దనగా ఉపయోగపడి చర్మం ముడతలు పడనీకుండా చేస్తుంది.

లాభం #5

లాభం #5

విభూతిని పెట్టుకోవడం వల్ల మీరు ఆశావాదులుగా ఉంటారు.మీ మనసులోకి నిరాశాజనక ఆలోచనలను రానీకుండా తలుపులాగా వ్యవహరిస్తుంది.

లాభం #6

లాభం #6

కనుబొమ్మల మధ్య స్థలాన్ని వేలితో నెమ్మదిగా వత్తినపుడు, మీ మనస్సుకు విశ్రాంతి కలుగుతుంది. దీనివల్ల మీ మానసిక వత్తిడి తగ్గుతుంది.నిద్రలేమిని కూడా తగ్గించి మీరు హాయిగా పడుకునేట్లు చేస్తుంది.

Desktop Bottom Promotion