Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Covid Home Isolation:ఒమిక్రాన్ కోవిద్ పెరుగుతున్న వేళ తీసుకోవాల్సిన జాగ్రత్తలివే... కేంద్రం కొత్త గైడ్ లైన్స్.
భారతదేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిద్-19 రోగులు హోమ్ ఐసోలేషన్లో తీసుకోవాల్సిన మార్గనిర్దేశాల గురించి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ కొన్ని సూచనలు చేసింది.
మన దేశంలో కరోనా రోగుల కేసుల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది. ఓవైపు కరోనా కేసులు పెరుగుతుంటే.. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా విపరీతంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు.

బెంగళూరు, తమిళనాడు, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో వీకెండ్ రోజున పూర్తిగా కర్ఫ్యూ విధించారు. విద్యా సంస్థలకు దాదాపు రెండు సెలవులిచ్చారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కరోనా కేసులు పెరుగుతున్న వేళ హోం ఐసోలేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనాకు సంబంధించి ఏ లక్షణాలు లేని, తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పెషంట్లు ఇక నుండి కేవలం హోం క్వారంటైన్లో ఉండొచ్చు. అయితే కోవిద్-19 ఐసోలేషన్ గైడ్ లైన్స్ ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 5 జనవరి 2022న మరోసారి సవరించింది. ఈ సందర్భంగా ఎవరెవరు హోమ్ ఐసోలేషన్లు ఉండాలి మరియు హోమ్ ఐసోలేషన్ ను ఎప్పుడు ముగించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

కొత్త మార్గదర్శకాలిలా..
కొద్దిపాటి లక్షణాలు లేదా కరోనా రహిత ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారి కోసం కేంద్రం హోమ్ ఐసోలేషన్ గైడ్ లైన్స్ ను సవరించింది. మన దేశంలో 58 వేల కంటే ఎక్కువ కోవిద్-19 కేసులు నమోదైన రోజున కేంద్ర ప్రభుత్వం కొత్తగా సవరించిన గైడ్ లైన్స్ ను విడుదల చేసింది.
* ఎవరికైతే కరోనాకు సంబంధించి తేలికపాటి లక్షణాలు ఉంటాయో, వారు వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* ఎవరికైనా పూర్తి పరీక్షలు, క్లినికల్ మేనేజ్ మెంట్ అవసరమవుతాయో వారికి ఆసుపత్రిలో బెడ్ కేటాయించడం జరుగుతుంది.
* మరిన్ని సేవలు అవసరమైన వారు జిల్లా/సబ్-జిల్లా స్థాయిలోని కంట్రోల్ రూమ్ కి కాల్ చేస్తే మరింత సహాయం ప్రభుత్వం అందజేస్తుంది.
* కరోనా సమయంలో స్వీయ నిర్బంధంలో ఉండాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వీలైనంత దూరంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
* కరోనా రోగుల వద్ద ఒక సంరక్షకుడు(కోవిద్ టీకాను తీసుకున్న వ్యక్తి) 24 గంటలు అందుబాటులో ఉండాలి.
* హోమ్ ఐసోలేషన్లో ఉండే వ్యక్తికి సంరక్షకుడు మరియు వైద్యాధికారి తప్పనిసరిగా అవసరం.
* 60 సంవత్సరాలు పైబడిన వ్రుద్ధ రోగులు మరియు హైపర్ టెన్షన్, మధుమేహం, గుండె జబ్బులు, దీర్ఘకాలిక ఊపిరితిత్తులు/కాలేయం/మూత్రపిండాల వ్యాధి, సెరెబ్రోవాస్కులర్ వ్యాధి మొదలైన సహ-అనారోగ్య పరిస్థితులు ఉన్నవారు చికిత్స పొందుతున్న వారు డాక్టర్ నిర్ధారించిన తర్వాత మాత్రమే ఇంట్లో ఒంటరిగా ఉండేందుకు అనుమతించబడతారు.
* హెచ్ఐవి, క్యాన్సర్ రోగులు హోమ్ ఐసోలేషన్లో ఉండేందుకు సిఫార్సు చేయబడరు. ఇలాంటి రోగులు కేవలం డాక్టర్ నిర్ధారణ తర్వాతే హోమ్ ఐసోలేషన్ కు అనుమతించబడతారు.

హోమ్ ఐసోలేషన్ ఎప్పుడు ఆపేయాలి?
* హోమ్ ఐసోలేషన్లో ఉన్న కోవిద్-19 రోగి 'పాజిటివ్ వచ్చినప్పటి నుండి కనీసం వారం రోజులు గడిచిన తర్వాత డిశ్చార్జ్ అవుతాడు లేదా ఐసోలేషన్ ను ముగించుకుంటాడు.
* ఎవరికైతే వరుసగా మూడు రోజులు జ్వరం లేదని నిర్ధారణ అవుతుందో అలాంటి వారు బయట ఉండొచ్చని ప్రభుత్వం తను సవరించిన మార్గదర్శకాలలో వివరించింది.
* అయితే వారు కూడా మాస్కులు ధరించడం కొనసాగించాలి. అయితే హోమ్ ఐసోలేషన్ గడువు ముగిసిన తర్వాత, తిరిగి మళ్లీ ఎలాంటి పరీక్షలు అవసరంలేదు' అని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.
రోనా కేసులు పెరుగుతున్న వేళ హోం ఐసోలేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనాకు సంబంధించి ఏ లక్షణాలు లేని, తక్కువ లక్షణాలు ఉన్న కరోనా పెషంట్లు ఇక నుండి కేవలం హోం క్వారంటైన్లో ఉండొచ్చు. అయితే కోవిద్-19 ఐసోలేషన్ గైడ్ లైన్స్ ను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 5 జనవరి 2022న మరోసారి సవరించింది.



Click it and Unblock the Notifications