Latest Updates
-
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం! -
ఫైవ్ స్టార్ రెస్టారెంట్ రుచితో.. ఇంట్లోనే సులభంగా క్రీమీ కోకోనట్ చికెన్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
వడగాల్పుల వేళ జాగ్రత్త! ఎండల నుంచి ప్రాణాలు కాపాడుకోవడం ఎలా? -
అక్షయ తృతీయ రోజున ఈ సమయాల్లో పూజ చేస్తే అదృష్టం మీదే! -
వృషభం, సింహం, ధనుస్సు రాశుల వారికి ఈ వారం రాజయోగం.. మీ జాతకం ఎలా ఉందంటే? - 19 నుండి 25 ఏప్రిల్ 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆ ఒక్క విషయంలో జాగ్రత్త! - ఆదివారం, 19 ఏప్రిల్ 2026 -
తల్లిదండ్రులూ అలెర్ట్..ఏడాదిలోపు పిల్లలకు పొరపాటున కూడా ఇవి తినిపించొద్దు! -
పెళ్లి గురించి ఎవరూ చెప్పని 5 పచ్చి నిజాలు..ఇవి తెలుసుకోకపోతే కష్టమే!
మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
Is it good to soak mangoes in water : వేసవి సీజన్ వెంటబెట్టుకుని వచ్చే పండ్లు మామిడిపండ్లు. మామిడి పండును పండ్లకే రారాజుగా పిలుచుకుంటారు. ఈ పండు అంటే అందరీ చాలా ఇష్టమైన పండు . ఈ సీజన్ కోసం సంవత్సరం పొడవునా ఎదురుచూసే వారున్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అందులో నేను కూడా ఒకరిని. వారిలో మీరు కూడా ఒకరైతే ఈ కథనం మీకోసమే.
మరి మామిడి పండ్లును ఎలా తినోలో మీకు తెలుసా ? మామిడిపండును తినాలనిమీకు ఎంత ఆశగా అనిపించినా దాన్నితినే ముందు నీళ్లలో కొద్దిసేపు నానబెట్టాలంట. ఈ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇది మీకు ఆశ్చర్యం కలిగించే విషయమే అయినా..అలా ఎందుకు చేయాలో ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

ఆయుర్వేద నిపుణురాలు దీక్షా భావ్సర్ ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో పంచుకున్న పోస్ట్లో మామిడిపండును నీటిలో నానబెట్టడం ఎందుకు అవసరమో వివరించారు. అయితే మామిడి పండ్లను నీటిలో ఎంతసేపు ఉంచాలి? ఎలా తినాలి అనే వారి కోసం ఇక్కడ సమాధానం ..
మామిడికాయను నీళ్లలో ఎక్కువసేపు నానబెట్టి తినండి
ఆయుర్వేద నిపుణులు మామిడిపండ్లను తినడానికి ముందు కనీసం 1 నుండి 2 గంటల పాటు శుభ్రమైన నీటిలో నానబెట్టాలని సిఫార్సు చేస్తున్నారు. కానీ సమయం తక్కువగా ఉంటే, కనీసం మీరు మామిడి పండ్లను 20-30 నిమిషాలు నీటిలో ఉంచిన తర్వాత కూడా తినవచ్చు.
మామిడి పండ్లును తినడానికి ముందు ఎందుకు నానబెట్టాలి
హీలింగ్ సోల్స్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల దానిలో ఉన్న అదనపు ఫైటిక్ యాసిడ్ తొలగిపోతుంది. ఇది ఒక రకమైన యాంటీ-న్యూట్రియంట్, ఇది ఐరన్, క్యాల్షియం, జింక్ మరియు ఖనిజ లోపానికి దారితీసే ఇతర ఖనిజాల వంటి కొన్ని ఖనిజాలను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది.
మామిడి పండ్లను నీటిలో నానబెట్టడం వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి
నానబెట్టిన మామిడిపండ్లను తినడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు, తలనొప్పి, మలబద్ధకం మరియు ఇతర పేగు సమస్యలను కూడా నివారిస్తుంది.
మామిడిపండ్లు మరియు అవొకాడో పండ్లు స్వీట్ గా పండినప్పుడు మాత్రమే పాలతో కలిపి తీసుకోవాలి.
బాగా పండిన మామిడిపండ్లను పాలతో కలిపి తీసుకోవడం వల్ల వాత మరియు పిత్తం తగ్గుతుంది. ఇలా తీసుకోవడం రుచికరమైనది మాత్రమే కాదు, పోషకాలు నిండుగా ఉండటం వల్ల చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. కామోద్దీపనం కలిగిస్తుంది.
గమనిక: ఈ సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న ఊహలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. కథనానికి సంబంధించిన ఏ ఇన్పుట్ లేదా సమాచారాన్ని తెలుగు బోల్డ్ స్కై ధృవీకరించదు. ఏదైనా సమాచారం మరియు ఊహలను అమలు చేయడానికి లేదా అమలు చేయడానికి ముందు దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications










