Latest Updates
-
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
ఇంటికి అందం స్టైయిర్ కేస్ గార్డెన్..

తొట్లను తొలుత మట్టితో నింపాలి. తొట్టి అంచుల వద్ద కనీసం నాలుగయిదు అంగుళాల దిగువకే మట్టి ఉంచాలి. దీని వలన మొక్కకు ఎరువు వేసేందుకూ, నీరు పోసుకు నేందుకూ అనువుగా ఉంటుంది. నీరు పోసినప్పుడు మట్టి బయటకు పోదు. రకరకాల గడ్డినిగానీ, కూరగాయలను గానీ ముక్కలుగా చేసి మట్టిలో కలపాలి. ఈ గడ్డి చీకి మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. మట్టంతా తడిచేలా నీరు పోయాలి. మూడునాలుగు వారాల తర్వాత ఎంపిక చేసుకున్న విత్తనాలను తొట్లలో నాటాలి. గోంగూర, టమోట, మిర్చిలాంటివయితే ముందు నారు పోసు కోవాలి. నారు వేర్లు బలపడక ముందు పీకి తొట్లలో నాటు కోవాలి. మందు నీటిని చల్లి మట్టి నానిన తర్వాతే నారు పీకాలి.
భూమిలో తగినంత తడిలేకపోతే నారు వేర్లు తెగిపోయే అవకాశం ఉంది. విత్తనాలు మొలకెత్తే వరకూ తగుమోతాదులో మాత్రమే నీటిని చిలకరించాలి. నీరు ఎక్కువైతే విత్తలనాలు అధికంగా నాని మునిగిపోతాయి. మొలకెత్తిన మరుసటి రోజునుంచీ తడి అరకుండా నీటిని పోస్తుంటే సరిపోతుంది. ఉదయం పూట, సాయం సంధ్య తర్వాతే నీటిని పోయాలి. అంటే ఎండ తక్కువగా ఉన్నప్పుడే మొక్కలకు నీరు పెట్టాలి. మొక్క మొదలు దగ్గర మట్టిని ఎత్తుగా ఉంచటం వలన మొక్క కాండానికి నేరుగా నీరు తగలకుండా ఉంటుంది. దానివలన మొక్క కుళ్ళి పోకుండా ఉంటుంది. కాండం నిరంతరం నీటిలో నాను తుంటే కొన్ని రకాల తెగుళ్లు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.
వారానికి కనీసం రెండు మూడా సార్లుగా పండ్లు, కూరగాయల వ్యర్థాలను చిన్నచిన్న ముక్కలుగా తరిగి మట్టిలో కలుపుతుంటే మొక్కలకు తగినంత ఎరువు లభ్యమవుతుంది. చెకచెకా ఎదుగుతాయి. మొక్కలు ఎదిగేకొద్ది తెగుళ్ళుసోకే ప్రమాదం ఉంటుంది. మొక్కల్లో ఏ భాగంలోనయినా మార్పు కన్పించగానే తగు జాగ్రత్తలు, నివారణా చర్యలు చేపట్టాలి.



Click it and Unblock the Notifications