Latest Updates
-
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే..
ఇంటికి అందం స్టైయిర్ కేస్ గార్డెన్..

తొట్లను తొలుత మట్టితో నింపాలి. తొట్టి అంచుల వద్ద కనీసం నాలుగయిదు అంగుళాల దిగువకే మట్టి ఉంచాలి. దీని వలన మొక్కకు ఎరువు వేసేందుకూ, నీరు పోసుకు నేందుకూ అనువుగా ఉంటుంది. నీరు పోసినప్పుడు మట్టి బయటకు పోదు. రకరకాల గడ్డినిగానీ, కూరగాయలను గానీ ముక్కలుగా చేసి మట్టిలో కలపాలి. ఈ గడ్డి చీకి మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. మట్టంతా తడిచేలా నీరు పోయాలి. మూడునాలుగు వారాల తర్వాత ఎంపిక చేసుకున్న విత్తనాలను తొట్లలో నాటాలి. గోంగూర, టమోట, మిర్చిలాంటివయితే ముందు నారు పోసు కోవాలి. నారు వేర్లు బలపడక ముందు పీకి తొట్లలో నాటు కోవాలి. మందు నీటిని చల్లి మట్టి నానిన తర్వాతే నారు పీకాలి.
భూమిలో తగినంత తడిలేకపోతే నారు వేర్లు తెగిపోయే అవకాశం ఉంది. విత్తనాలు మొలకెత్తే వరకూ తగుమోతాదులో మాత్రమే నీటిని చిలకరించాలి. నీరు ఎక్కువైతే విత్తలనాలు అధికంగా నాని మునిగిపోతాయి. మొలకెత్తిన మరుసటి రోజునుంచీ తడి అరకుండా నీటిని పోస్తుంటే సరిపోతుంది. ఉదయం పూట, సాయం సంధ్య తర్వాతే నీటిని పోయాలి. అంటే ఎండ తక్కువగా ఉన్నప్పుడే మొక్కలకు నీరు పెట్టాలి. మొక్క మొదలు దగ్గర మట్టిని ఎత్తుగా ఉంచటం వలన మొక్క కాండానికి నేరుగా నీరు తగలకుండా ఉంటుంది. దానివలన మొక్క కుళ్ళి పోకుండా ఉంటుంది. కాండం నిరంతరం నీటిలో నాను తుంటే కొన్ని రకాల తెగుళ్లు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.
వారానికి కనీసం రెండు మూడా సార్లుగా పండ్లు, కూరగాయల వ్యర్థాలను చిన్నచిన్న ముక్కలుగా తరిగి మట్టిలో కలుపుతుంటే మొక్కలకు తగినంత ఎరువు లభ్యమవుతుంది. చెకచెకా ఎదుగుతాయి. మొక్కలు ఎదిగేకొద్ది తెగుళ్ళుసోకే ప్రమాదం ఉంటుంది. మొక్కల్లో ఏ భాగంలోనయినా మార్పు కన్పించగానే తగు జాగ్రత్తలు, నివారణా చర్యలు చేపట్టాలి.



Click it and Unblock the Notifications