Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
ఇంటికి అందం స్టైయిర్ కేస్ గార్డెన్..

తొట్లను తొలుత మట్టితో నింపాలి. తొట్టి అంచుల వద్ద కనీసం నాలుగయిదు అంగుళాల దిగువకే మట్టి ఉంచాలి. దీని వలన మొక్కకు ఎరువు వేసేందుకూ, నీరు పోసుకు నేందుకూ అనువుగా ఉంటుంది. నీరు పోసినప్పుడు మట్టి బయటకు పోదు. రకరకాల గడ్డినిగానీ, కూరగాయలను గానీ ముక్కలుగా చేసి మట్టిలో కలపాలి. ఈ గడ్డి చీకి మొక్కలకు ఎరువుగా ఉపయోగపడుతుంది. మట్టంతా తడిచేలా నీరు పోయాలి. మూడునాలుగు వారాల తర్వాత ఎంపిక చేసుకున్న విత్తనాలను తొట్లలో నాటాలి. గోంగూర, టమోట, మిర్చిలాంటివయితే ముందు నారు పోసు కోవాలి. నారు వేర్లు బలపడక ముందు పీకి తొట్లలో నాటు కోవాలి. మందు నీటిని చల్లి మట్టి నానిన తర్వాతే నారు పీకాలి.
భూమిలో తగినంత తడిలేకపోతే నారు వేర్లు తెగిపోయే అవకాశం ఉంది. విత్తనాలు మొలకెత్తే వరకూ తగుమోతాదులో మాత్రమే నీటిని చిలకరించాలి. నీరు ఎక్కువైతే విత్తలనాలు అధికంగా నాని మునిగిపోతాయి. మొలకెత్తిన మరుసటి రోజునుంచీ తడి అరకుండా నీటిని పోస్తుంటే సరిపోతుంది. ఉదయం పూట, సాయం సంధ్య తర్వాతే నీటిని పోయాలి. అంటే ఎండ తక్కువగా ఉన్నప్పుడే మొక్కలకు నీరు పెట్టాలి. మొక్క మొదలు దగ్గర మట్టిని ఎత్తుగా ఉంచటం వలన మొక్క కాండానికి నేరుగా నీరు తగలకుండా ఉంటుంది. దానివలన మొక్క కుళ్ళి పోకుండా ఉంటుంది. కాండం నిరంతరం నీటిలో నాను తుంటే కొన్ని రకాల తెగుళ్లు కూడా సోకే ప్రమాదం ఉంటుంది.
వారానికి కనీసం రెండు మూడా సార్లుగా పండ్లు, కూరగాయల వ్యర్థాలను చిన్నచిన్న ముక్కలుగా తరిగి మట్టిలో కలుపుతుంటే మొక్కలకు తగినంత ఎరువు లభ్యమవుతుంది. చెకచెకా ఎదుగుతాయి. మొక్కలు ఎదిగేకొద్ది తెగుళ్ళుసోకే ప్రమాదం ఉంటుంది. మొక్కల్లో ఏ భాగంలోనయినా మార్పు కన్పించగానే తగు జాగ్రత్తలు, నివారణా చర్యలు చేపట్టాలి.



Click it and Unblock the Notifications