మౌనం పాటించడం!

Maintaining Silence
ప్రశాంత౦గా ధ్యానం చేసుకోవడానికి వీలుగా రెండు వారాల పాటు మాట్లాడకుండా వుండాలని నలుగురు సన్యాసులు నిర్ణయించుకున్నారు. మొదటి రోజు రాత్రే కొవ్వొత్తి దీపం గాలికి ఆరిపోయి వారిని అంధకారంలోకి నెట్టింది.
మొదటి సన్యాసి పైకి అన్నాడు "అయ్యో! కొవ్వొత్తి ఆరిపోయిందే!" అని.
"మనం మాట్లాడకూడదు కదా?" రెండో వాడు అన్నాడు.
వెనకే మూడో వాడన్నాడు కదా - "మీరిద్దరూ ప్రశాంతతని ఎందుకు భగ్నం చేశారు?"
ఇక నాలుగోవాడు నవ్వి "నేనొక్కడినే మాట్లాడనిది" అని గొప్పగా చెప్పాడు.

Story first published: Saturday, July 21, 2012, 16:08 [IST]
Desktop Bottom Promotion