Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
2032 డిసెంబర్ 22న భూమి బద్దలవడం ఖాయమా? నాసా బయటపెట్టిన సంచలన నిజాలు,అందరిలో ఆందోళన!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల బయటపెట్టిన ఓ విషయం ఇప్పుడు అందరి గుండెల్లో టెన్షన్ పెంచుతోంది. ఓ భారీ గ్రహశకలం అత్యంత వేగంగా అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. ఆస్టరాయిడ్ 2024 YR4 అని ఈ గ్రహ శకలానికి పేరు పెట్టారు. 2024 YR4 గ్రహశకలాన్ని 2 నెలల కిందట చిలీలోని ఒక ఎడారిలో టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని పరిశీలిస్తుండగా గుర్తించారు. ఈ గ్రహశకలం 100 మీటర్ల వెడల్పు వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఈ ఆస్టరాయిడ్ గంటలకు 61,200 కిలోమీటర్ల వేగంతో భూమివైపు కదులుతోందని, ప్రతి సెకనుకు 17 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తోందని సైంటిస్టులు తెలిపారు. ఇది డిసెంబర్ 22, 2032లో భూమికి చాలా దగ్గరగా వెళుతుందని, అది భూమిని ఢీకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.

భయాందోళనలు
భూమి నాశనానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా అనేక మంది అనేక రకాల అంచనాలను వెల్లడించారు. కొన్నిసార్లు అయితే ఆ సంవత్సరంలోనే యుగాంతం ఉంటుందంటూ కూడా అంచనాలు వెలువడ్డాయి. 2012లో యుగాంతం జరగబోతుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది..చాలామంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు..యుగాంతం జరిగితే ఎలా ఉంటుందనే దానిమీద సినిమాలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లు మాత్రమే అని తేలగా..ఈసారి స్వయంగా నాసా సైంటిస్టులే భూమి మీద 2032 డిసెంబర్ లో భారీ వినాశనం ఉండే అవకాశముందని గతవారం చెప్పడంతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.
చందమామపై
అయితే తాజాగా సైంటిస్టులు మరో కీలక ప్రకటన చేశారు. 2032లో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం 0.28 శాతంగానే ఉన్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ ఆస్టరాయిడ్ భూమిని తాకే అవకాశం 3.1 శాతమని ఈ మొదట్లో వాళ్లు అంచనాకు వచ్చారు. తర్వాత అది 0.28 శాతానికి తగ్గింది. ఈ గ్రహశకలం చంద్రుడిని తాకే అవకాశం 1 శాతం మేర ఉన్నట్లు నాసా అంచనా వేస్తోంది.
హిరోషిమా,నాగసాకిపై వేసిన అణు బాంబుల కంటే 500 రెట్లు ఎక్కువ
ఇలాంటి గ్రహశకలాలు భూమిపై అతిపెద్ద బిలాన్ని సృష్టించగలవు. అది తాకిన సమీప ప్రాంతాల్లోని నిర్మాణాలు ధ్వంసమవుతాయి. 2024 YR4 ఆస్టరాయిడ్ పొరపాటున భూమి వాతావరణాన్ని తాకినా లేదా దానిలోని ఏదైనా భాగంపై పడినా భయంకరమైన పేలుడు సంభవిస్తుందని సైంటిస్టులు తెలిపారు. దీనివల్ల దాదాపు 8 మిలియన్ టన్నుల TNT శక్తి విడుదల అవుతుంది, ఇది హిరోషిమా,నాగసాకిపై వేసిన అణు బాంబుల కంటే 500 రెట్లు ఎక్కువ విధ్వంసం కలిగిస్తుందని తెలిపారు. 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రతిదీ నాశనం అవుతుంది. కాగా,ఒక గ్రహశకలం 1908లో సైబీరియా మీదుగా వెళుతూ పేలిపోయింది. దీంతో 500 చ.కి.మీ భూభాగంలో భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు గాయపడ్డారు.



Click it and Unblock the Notifications