Latest Updates
-
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి! -
వడగాల్పుల ఎండలు భయపెడుతున్నాయా? ఈ చిన్న చిట్కాలతో ప్రాణాలు కాపాడుకోండి -
చీఫ్ గెస్ట్ గా పిలవలేదని.. క్రికెట్ పిచ్ ను ట్రాక్టర్తో దున్నేసిన పొలిటికల్ లీడర్..వీడియో చూడండి
2032 డిసెంబర్ 22న భూమి బద్దలవడం ఖాయమా? నాసా బయటపెట్టిన సంచలన నిజాలు,అందరిలో ఆందోళన!
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ఇటీవల బయటపెట్టిన ఓ విషయం ఇప్పుడు అందరి గుండెల్లో టెన్షన్ పెంచుతోంది. ఓ భారీ గ్రహశకలం అత్యంత వేగంగా అంతరిక్షం నుంచి భూమివైపు దూసుకొస్తున్నట్లు నాసా సైంటిస్టులు తెలిపారు. ఆస్టరాయిడ్ 2024 YR4 అని ఈ గ్రహ శకలానికి పేరు పెట్టారు. 2024 YR4 గ్రహశకలాన్ని 2 నెలల కిందట చిలీలోని ఒక ఎడారిలో టెలిస్కోప్ ద్వారా ఆకాశాన్ని పరిశీలిస్తుండగా గుర్తించారు. ఈ గ్రహశకలం 100 మీటర్ల వెడల్పు వరకు ఉంటుందని అంచనా వేశారు.
ఈ ఆస్టరాయిడ్ గంటలకు 61,200 కిలోమీటర్ల వేగంతో భూమివైపు కదులుతోందని, ప్రతి సెకనుకు 17 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తోందని సైంటిస్టులు తెలిపారు. ఇది డిసెంబర్ 22, 2032లో భూమికి చాలా దగ్గరగా వెళుతుందని, అది భూమిని ఢీకొనే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.

భయాందోళనలు
భూమి నాశనానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా అనేక మంది అనేక రకాల అంచనాలను వెల్లడించారు. కొన్నిసార్లు అయితే ఆ సంవత్సరంలోనే యుగాంతం ఉంటుందంటూ కూడా అంచనాలు వెలువడ్డాయి. 2012లో యుగాంతం జరగబోతుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది..చాలామంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు..యుగాంతం జరిగితే ఎలా ఉంటుందనే దానిమీద సినిమాలు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లు మాత్రమే అని తేలగా..ఈసారి స్వయంగా నాసా సైంటిస్టులే భూమి మీద 2032 డిసెంబర్ లో భారీ వినాశనం ఉండే అవకాశముందని గతవారం చెప్పడంతో ప్రపంచం మొత్తం ఆందోళన చెందుతోంది.
చందమామపై
అయితే తాజాగా సైంటిస్టులు మరో కీలక ప్రకటన చేశారు. 2032లో ఈ గ్రహశకలం భూమిని తాకే అవకాశం 0.28 శాతంగానే ఉన్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ ఆస్టరాయిడ్ భూమిని తాకే అవకాశం 3.1 శాతమని ఈ మొదట్లో వాళ్లు అంచనాకు వచ్చారు. తర్వాత అది 0.28 శాతానికి తగ్గింది. ఈ గ్రహశకలం చంద్రుడిని తాకే అవకాశం 1 శాతం మేర ఉన్నట్లు నాసా అంచనా వేస్తోంది.
హిరోషిమా,నాగసాకిపై వేసిన అణు బాంబుల కంటే 500 రెట్లు ఎక్కువ
ఇలాంటి గ్రహశకలాలు భూమిపై అతిపెద్ద బిలాన్ని సృష్టించగలవు. అది తాకిన సమీప ప్రాంతాల్లోని నిర్మాణాలు ధ్వంసమవుతాయి. 2024 YR4 ఆస్టరాయిడ్ పొరపాటున భూమి వాతావరణాన్ని తాకినా లేదా దానిలోని ఏదైనా భాగంపై పడినా భయంకరమైన పేలుడు సంభవిస్తుందని సైంటిస్టులు తెలిపారు. దీనివల్ల దాదాపు 8 మిలియన్ టన్నుల TNT శక్తి విడుదల అవుతుంది, ఇది హిరోషిమా,నాగసాకిపై వేసిన అణు బాంబుల కంటే 500 రెట్లు ఎక్కువ విధ్వంసం కలిగిస్తుందని తెలిపారు. 50 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రతిదీ నాశనం అవుతుంది. కాగా,ఒక గ్రహశకలం 1908లో సైబీరియా మీదుగా వెళుతూ పేలిపోయింది. దీంతో 500 చ.కి.మీ భూభాగంలో భవనాలు ధ్వంసమయ్యాయి. ప్రజలు గాయపడ్డారు.



Click it and Unblock the Notifications











