Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
మృత్యుంజయుడు: అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ బ్రిటీష్ పౌరుడు..ఏం చెప్పాడంటే..
అహ్మాదాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఇవాళ ఎయిరిండియా విమానం కూలిపోయిన ఘటనలో ఒకే ఒక్క వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలోని 11వ నంబర్ సీటులోని 40 ఏళ్ల బ్రిటీష్ పౌరుడు స్వల్ప బయటపడినట్లు అహ్మదాబాద్ సీపీ జీఎస్ మాలిక్ చెప్పారు. విమానం కూలిపోయిన సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికులుడు బయటికొచ్చినట్లు సమాచారం. గాయాలతో ప్రయాణికుడు రోడ్డుమీద నడుస్తూ అంబులెన్స్ వెపుకి వెళ్తున్నట్లున్న వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి.
కాగా ప్రాణాలతో బయటపడిన వ్యక్తి పేరు విశ్వాస్ కుమార్ రమేష్. భారత సంతతికి చెందిన ఈ వ్యక్తి లండన్ లో స్థిరపడ్డారు. గత 20 ఏళ్లుగా విశ్వాస్ కుమార్ అక్కడే భార్యా,పిల్లలతో కలిసి నివసిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కుటుంబసభ్యులను కలిసేందుకు భారత్ వచ్చిన విశ్వాస్ కుమార్..తన సోదరుడు అజయ్ కుమార్ రమేష్ తో కలిసి తిరిగి లడన్ వెళ్లేందుకు గురువారం మధ్యాహ్నాం ఎయిరిండియాకి చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం ఎక్కారు.

విమానం కూలిపోయిన సమయంలో అందులో మొత్తం 242 మంది ఉన్నారు. విశ్వాస్ ఒక్కరే బతికి బయటపడ్డారు. అదృష్టవశాత్తూ హోర విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ అహ్మదాబాద్ లోని ఓ ట్రీట్మెంట్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. అతని కళ్లు,ఛాతీ, పాదాలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన విశ్వాస్ కుమార్.. టేకాఫ్ అయిన 30 సెకన్లకే పెద్ద శబ్దం వినబడింది. వెంటనే విమానం కూలిపోయింది. నేను సృహలోకి వచ్చిచూసేసరికి నా చుట్టూ అన్ని మృతదేహాలునక్నాయి. వెంటనే లేచి పరిగెత్తాను. విమానశకలాలు అక్కడక్కడా చెల్లాచెదురుగా పడున్నాయి..ఎవరో నన్ను అంబులెన్స్ లోకి వెక్కించారని" ఆయన చెప్పారు.
విమానం మధ్యాహ్నాం 1: 39 గంటల సమయంలో అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోపే ఎయిర్ పోర్ట్ సమీపంలోనే కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. అంతేకాకుండా విమానం ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ బిల్డింగ్ లోకి దూసుకెళ్లడంతో ఆ హాస్టల్ మెస్ లో మధ్యాహ్నా భోజనం చేస్తున్న పలువురు మెడికల్ విద్యార్థులు మరణించినట్లు సమాచారం. పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు. మరోవైపు, కూలిపోయిన ఈ విమానం ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా చనిపోయారు. 2016 నుంచి 2021 వరకు గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ పనిచేశారు.
ఇప్పటివరకు 200కి పైగా మృతదేహాలు లభ్యమయ్యాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాల కోసం ఎయిరిండియా ఢిల్లీ,ముంబై నుంచి అహ్మదాబాద్ కు 2 ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. కాగా,అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్ లో దగ్గర విషాద వాతావరణం నెలకొంది. తమ ఆత్మీయుల కోసం బంధువులు,ఫ్రెండ్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని ఆందోళనతో ఎదురుచూస్తున్నారు.



Click it and Unblock the Notifications