Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
శాస్త్రవేత్త ప్రకటన.. మానవ జాతి అంతం అయ్యేది అప్పుడే! మన తరువాత భూమిని ఎవరు పాలిస్తారంటే?
శతాబ్దాల క్రితం భూమిని డైనోసార్లు పరిపాలించాయన్న విషయం తెలిసిందే. కాలక్రమేణా భూమి పరిణామం చెందడంతో డైనోసార్లు కూడా అంతమైపోయాయి. ఆ తరువాత భూమిపై వివిధ జాతులు వెలుగులోకి వచ్చినప్పటికీ.. మానవ జాతి భూమిని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం మానవజాతి భూమిపై ఆధిపత్య జాతులుగా మారిపోయారు. ఈ మార్పు కూడా శాశ్వతం కాదు. డైనోసార్ల అంతరించిపోయినట్లే, కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత మానవ జాతి అంతం కావచ్చు.
అయితే మనుషుల తరువాత భూమిపై ఆధిపత్యం చెలాయించే జంతువు ఏదైనా ఉద్భవిస్తుందా లేదా ఉన్న మానవ జాతే మళ్ళీ భూమిపై పుట్టుకొస్తుందా? ఇతర జీవాలు ఏవేవి భూమిపై తమ ప్రతాపాన్ని చూపిస్తాయి అనే విషయంపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటో ఈ స్టోరీలో వివరించాము, చూడండి.

భూమి భవిషత్తు ఎలా ఉంటుంది?
మానవులతో సహా భూమిపై ఉన్న అన్ని జీవులు పరిణామం చెందాయని మనకు తెలుసు. ఈ పరిణామాల్లో చాలా వరకు భూమి హానికరంగానే మారాయి. కానీ కొన్ని పరిణామాలు మాత్రం భూమిని పరిరక్షించాయి, అలాగే ఉపయోగకరంగా మారాయి. మానవ జాతి అంతరించి పోయే కాలం చాలా దూరంలో ఉంది. మానవ జాతి అంతరించిపోయిన తర్వాత ఏ జాతులు ఆధిపత్యం చెలాయిస్తాయో అనేది ప్రతి ఒక్కరిలో ఉత్సుకతను పెంచుతాయి. ఆ జాతి ఏదంటే?
భూమిని పాలించే తదుపరి జీవి
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మానవుల తర్వాత భూమి కొత్త రకమైన పరిణామానికి దారి తీయొచ్చు. ఆక్టోపస్లు మరింత ఆధిపత్య పాత్ర పోషించే అవకాశం ఉంది. వారి తెలివితేటలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు వారిని ఆధిపత్య శక్తిగా మారుస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ విషయంలో ఆక్టోపస్లు ఇప్పటికే విశేషమైన సామర్థ్యాలను కనబరిచాయి. ఈ మేరకు అవి టూల్స్ ఉపయోగించి ట్యాంకుల నుండి తప్పించుకునే వీడియో చూశాము కూడా. "అవి నాగరికతను నిర్మించే జాతిగా పరిణామం చెందుతాయి" అని పరిశోధకులు అంటున్నారు. వారి అధునాతన నాడీ వ్యవస్థ ఈ ఆలోచనలకు అనుగుణంగా ఉండడం కూడా విషయం.
అయితే, ఆక్టోపస్లు భూమిపై జీవించలేవు. అవి కేవలం సముద్రంలోనే జీవిస్తాయి. కానీ "కాలక్రమేణా పరిణామం చెందడంతో.. వారు నీటి వెలుపల కూడా శ్వాస తీసుకోవడానికి కావాల్సిన మార్గాలను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది" అని పరిశోధకులు చెబుతున్నారు. ఈ పరిణామ మార్పులు భవిష్యత్తులో భూసంబంధమైన జంతువులను వేటాడేందుకు ఆక్టోపస్లకు తగిన నైపుణ్యం, సామర్థ్యం అందిస్తాయని చెబుతున్నారు.



Click it and Unblock the Notifications