Latest Updates
-
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.?
బాబా వంగా అంచనా..2026లో బంగారం ధర ఎంత ఉంటుందో తెలుసా?
మనదేశంలో బంగారాన్ని కేవలం ఒక లోహంగానే చూడరు. బంగారం అంటే భారతీయలకు ఒక ఎమోషన్. ఆడపిల్ల పెళ్లికైనా, కష్టకాలంలో ఆదుకోవడానికైనా పసిడినే నమ్ముకుంటారు. అయితే, గత కొద్ది రోజులుగా బంగారం ధరలు కనీవినీ ఎరుగని రీతిలో ఊగిసలాడుతున్నాయి.
రికార్డు స్థాయిలో రూ. 1,33,300 (10 గ్రాములకు) తాకిన ధరలు..ఉన్నట్లుండి రూ. 1,24,970కి, ఆపై రూ. 1,20,000 స్థాయికి పడిపోవడంతో సామాన్యులు, పెట్టుబడిదారులు అయోమయంలో పడ్డారు. ఈ తరుణంలో ప్రముఖ భవిష్యవాణి కర్త బాబా వంగా అంచనాలు ఇప్పుడు మార్కెట్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

2026 నాటికి ఏం జరగబోతోంది?
ప్రపంచవ్యాప్తంగా తన జోస్యాలతో ప్రసిద్ధి చెందిన బల్గేరియన్ అంధురాలైన బాబా వంగా అంచనాల ప్రకారం.. 2026 బంగారం మార్కెట్ కు అత్యంత కీలకమైన సంవత్సరం కాబోతోంది. బాబా వంగా నేరుగా బంగారం ధర గురించి చెప్పకపోయినప్పటికీ ఆమె అంచనా వేసిన ప్రపంచ ఆర్థిక మాంద్యం పసిడి ధరలకు రెక్కలు తొడగనుంది.
ఆమె అంచనా నిజమైతే 2026లో ప్రపంచవ్యాప్తంగా నగదు కొరత తీవ్రమవుతుంది. బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉంది. ఆయిల్, ఎనర్జీ సంక్షోభాలు తలెత్తుతాయి. ఆర్థిక వ్యవస్థ అస్థిరంగా ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం సురక్షితమైన పెట్టుబడిగా భావించేది బంగారాన్నే. ఎప్పుడైతే కరెన్సీ విలువ పడిపోతుందో అప్పుడు బంగారం డిమాండ్ అమాంతం పెరుగుతుంది.
ఈ లెక్కన 2026 నాటికి 10 గ్రాముల బంగారం ధర రూ. 150,000 నుంచి ఏకంగా రూ. 200,000 వరకు చేరుకుని ఆల్ టైమ్ రికార్డు సృష్టించే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గతంలో బాబా వంగా అంచనాలు నిజమయ్యాయా?
బాబా వంగా చెప్పిన మాటలను అంత తేలిగ్గా తీసిపారేయలేం. గతంలో అమెరికాలోని ట్విన్ టవర్లపై ఉగ్రదాడి, ప్రిన్సెస్ డయానా మరణం, మయన్మార్ భూకంపం,జపాన్ సునామీ వంటి అనేక సంఘటనలను ఆమె ముందే సూచించారు. అవి అక్షరాలా నిజమయ్యాయి.
ఇప్పుడు ఆర్థిక మాంద్యం గురించి ఆమె చేసిన హెచ్చరిక కూడా నిజమైతే బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
పెట్టుబడిదారులకు సూచన
ప్రస్తుతం మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటున్నట్లు కనిపిస్తున్నా, అంతర్జాతీయ పరిణామాలు ఏ క్షణాన ఏ మలుపు తిరుగుతాయో చెప్పలేం. బాబా వంగా అంచనాలు, రాబోయే ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునేవారు మార్కెట్ కదలికలను నిశితంగా గమనించడం మంచిది. ధర తగ్గినప్పుడే కొనుగోలు చేయడం తెలివైన నిర్ణయం కావచ్చు.



Click it and Unblock the Notifications