Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్..జులై 1 నుంచి ఛార్జీల పెంపు..ఎంతో చూడండి
మనదేశంలో అతిపెద్ద ప్రజారవాణా నెట్ వర్క్ ఇండియన్ రైల్వేస్. నిత్యం వేలాది రైళ్లు పట్టాలపై తిరుగుతుండగా..ఆ రైళ్లల్లో లక్షలాదిమంది తమ గమ్యస్థానాలకు ప్రయాణిస్తుంటారు. అత్యంత సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థగా కూడా భారతీయ రైల్వేకు పేరుంది. అయితే రైల్వే ప్రయాణికులకు జులై నెల నుంచి బిగ్ షాక్ తగలనుంది. భారతీయ రైల్వే 2025 జూలై 1 నుండి తన ఛార్జీల విధానాన్ని సవరిస్తోంది.
చాలా కాలం తర్వాత రైల్వే శాఖ ఈ ఛార్జీలను సవరిస్తోంది. రోజువారీ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా నిర్వహణ ఖర్చులను సమతుల్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి 2025 జూలై 1వ తేదీ లేదా ఆ తర్వాత ప్రయాణం కోసం టిక్కెట్లు బుక్ చేసుకునేవారు ఈ కొత్త ఛార్జీలను గమనించి ప్లాన్ చేసుకోవడం మంచిది. పెరిగిన ఛార్జీల వివరాలను ఇక్కడ చూడండి.

పెరగనున్న ఛార్జీల వివరాలు
వాస్తవానికి పెరగనున్న ఛార్జీలు అందరికీ వర్తించవు. సుదూర ప్రయాణాలు చేసే వారికి మాత్రమే ఛార్జీలు స్వల్పంగా పెరగనుండగా, లక్షలాది మంది రోజువారీ ప్రయాణికులకు ఎలాంటి మార్పు ఉండదు. జనరల్ సెకండ్ క్లాస్ లో మీరు 500 కిలోమీటర్ల లోపు ప్రయాణిస్తే, మీ ఛార్జీలో ఎలాంటి మార్పు ఉండదు. అంతకు మించి ప్రయాణించే వారికి ప్రతి కిలోమీటర్ కు కేవలం అర పైసా మాత్రమే పెరుగుతుంది. అంటే 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి మీరు అదనంగా రూ. 2.50 చెల్లించాలి. మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ (నాన్-ఏసీ) రైళ్లలో ప్రయాణించే వారికి ప్రతి కిలోమీటర్ కు 1 పైసా పెరుగుతుంది. అంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికి ఇప్పుడు రూ. 10 అదనంగా ఖర్చవుతుంది.
ఏసీ చైర్ కార్, 3-టైర్, 2-టైర్ లేదా ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారికి ప్రతి కిలోమీటర్ కు 2 పైసల చొప్పున ఛార్జీ పెరుగుతుంది. దీని ప్రకారం 1,000 కిలోమీటర్ల ఏసీ ప్రయాణానికి రూ. 20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరికి ఊరట?
రైల్వే శాఖ రోజువారీ ప్రయాణికులపై ఎలాంటి భారం వేయడం లేదు. అంటే ముంబై లోకల్, హైదరాబాద్ లోకల్, కోల్కతా సబర్బన్ వంటి నగరాల్లో తిరిగే సబర్బన్ రైళ్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. ఉద్యోగ, వ్యాపార, విద్యా అవసరాల కోసం నెలవారీ పాస్లపై ఆధారపడే లక్షలాది మంది ప్రయాణికులపై కూడా ఎలాంటి భారం ఉండదు. వారి ఛార్జీలు యథాతథంగా కొనసాగుతాయి.



Click it and Unblock the Notifications