Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్..జులై 1 నుంచి ఛార్జీల పెంపు..ఎంతో చూడండి
మనదేశంలో అతిపెద్ద ప్రజారవాణా నెట్ వర్క్ ఇండియన్ రైల్వేస్. నిత్యం వేలాది రైళ్లు పట్టాలపై తిరుగుతుండగా..ఆ రైళ్లల్లో లక్షలాదిమంది తమ గమ్యస్థానాలకు ప్రయాణిస్తుంటారు. అత్యంత సురక్షితమైన ప్రజా రవాణా వ్యవస్థగా కూడా భారతీయ రైల్వేకు పేరుంది. అయితే రైల్వే ప్రయాణికులకు జులై నెల నుంచి బిగ్ షాక్ తగలనుంది. భారతీయ రైల్వే 2025 జూలై 1 నుండి తన ఛార్జీల విధానాన్ని సవరిస్తోంది.
చాలా కాలం తర్వాత రైల్వే శాఖ ఈ ఛార్జీలను సవరిస్తోంది. రోజువారీ ప్రయాణికులను ఇబ్బంది పెట్టకుండా నిర్వహణ ఖర్చులను సమతుల్యం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాబట్టి 2025 జూలై 1వ తేదీ లేదా ఆ తర్వాత ప్రయాణం కోసం టిక్కెట్లు బుక్ చేసుకునేవారు ఈ కొత్త ఛార్జీలను గమనించి ప్లాన్ చేసుకోవడం మంచిది. పెరిగిన ఛార్జీల వివరాలను ఇక్కడ చూడండి.

పెరగనున్న ఛార్జీల వివరాలు
వాస్తవానికి పెరగనున్న ఛార్జీలు అందరికీ వర్తించవు. సుదూర ప్రయాణాలు చేసే వారికి మాత్రమే ఛార్జీలు స్వల్పంగా పెరగనుండగా, లక్షలాది మంది రోజువారీ ప్రయాణికులకు ఎలాంటి మార్పు ఉండదు. జనరల్ సెకండ్ క్లాస్ లో మీరు 500 కిలోమీటర్ల లోపు ప్రయాణిస్తే, మీ ఛార్జీలో ఎలాంటి మార్పు ఉండదు. అంతకు మించి ప్రయాణించే వారికి ప్రతి కిలోమీటర్ కు కేవలం అర పైసా మాత్రమే పెరుగుతుంది. అంటే 1,000 కిలోమీటర్ల ప్రయాణానికి మీరు అదనంగా రూ. 2.50 చెల్లించాలి. మెయిల్ లేదా ఎక్స్ ప్రెస్ (నాన్-ఏసీ) రైళ్లలో ప్రయాణించే వారికి ప్రతి కిలోమీటర్ కు 1 పైసా పెరుగుతుంది. అంటే 1000 కిలోమీటర్ల ప్రయాణానికి ఇప్పుడు రూ. 10 అదనంగా ఖర్చవుతుంది.
ఏసీ చైర్ కార్, 3-టైర్, 2-టైర్ లేదా ఫస్ట్ క్లాస్ ఏసీలో ప్రయాణించే వారికి ప్రతి కిలోమీటర్ కు 2 పైసల చొప్పున ఛార్జీ పెరుగుతుంది. దీని ప్రకారం 1,000 కిలోమీటర్ల ఏసీ ప్రయాణానికి రూ. 20 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఎవరికి ఊరట?
రైల్వే శాఖ రోజువారీ ప్రయాణికులపై ఎలాంటి భారం వేయడం లేదు. అంటే ముంబై లోకల్, హైదరాబాద్ లోకల్, కోల్కతా సబర్బన్ వంటి నగరాల్లో తిరిగే సబర్బన్ రైళ్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. ఉద్యోగ, వ్యాపార, విద్యా అవసరాల కోసం నెలవారీ పాస్లపై ఆధారపడే లక్షలాది మంది ప్రయాణికులపై కూడా ఎలాంటి భారం ఉండదు. వారి ఛార్జీలు యథాతథంగా కొనసాగుతాయి.



Click it and Unblock the Notifications