Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
Chanakya Niti: కాలం కలిసిరాక సమస్యలు సతమతం చేస్తున్నాయా? ఇలా చేయండి
చాణక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు, గొప్ప వ్యూహకర్త. ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. తన బోధనల సమాహారమే చాణక్య నీతి. ఆయన చెప్పిన ఎన్నో సూచనలు, సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు. అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే. చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు.

ఆచార్య చాణక్యుడు మతం, దౌత్యం, రాజకీయాలు, విద్యలో గొప్ప పండితుడు. ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు. వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు. జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు.
సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం ఉన్నట్లుగా.. కష్టనష్టాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటాయని చాణక్యుడు సూచించాడు. కష్టాలను ధైర్యంగా, స్థిరంగా ఎదుర్కొని ముందడుగు వేసినప్పుడే విజయం వరిస్తుందని చెప్పాడు.
కాలం కలిసిరాక సమస్యలు సతమతం చేస్తున్నాయని కుమిలిపోవద్దని, కుంగిపోవద్దని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. రేపు ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదని, నిన్నటి గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదని, వర్తమానంలో మనం ఏం చేయాలన్నదానిపైనే దృష్టి సారించాలని సూచించాడు.
కష్టసమయంలో ఓపికగా ఉండాలని, అలాగే మదిలో కొన్ని విషయాలు ఉంచుకోవాలని, వాటి ద్వారా కష్టాల నుండి బయటపడవచ్చని చాణక్యుడు చెప్పాడు.
విజ్ఞత:
విషమపరిస్థితుల నుండి మనల్ని కాపాడేది విజ్ఞత, విద్య, జ్ఞానం మాత్రమేనని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. జ్ఞానం అభివృద్ధికి దారితీస్తుందన్నాడు. దీని కోసం, విపత్తు వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించడం నేర్చుకోవాలని చెప్పాడు. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించాడు. దాని వల్ల చేసిన పని పాడైపోతుందని, ఎప్పుడు ఎలా వ్యవహరించాలో విజ్ఞతతో ఆలోచించాలని చెప్పాడు.
స్నేహం:
స్నేహం చాలా విలువైనదని చెప్పాడు ఆచార్య చాణక్యుడు. అంతటి విలువైన స్నేహాన్ని ప్రతి ఒక్కరి వద్ద నుండి ఆశించవద్దని చెప్పాడు చాణక్యుడు. స్నేహితులు పదుల సంఖ్యలో లేకపోయినా, ఉన్నది కొందరే అయినా వారిని పూర్తిగా నమ్మేలా ఉండాలని చెప్పాడు. కష్టసమయంలో నిజమైన స్నేహితులు కచ్చితంగా మద్దతుగా నిలుస్తారని చెప్పాడు చాణక్యుడు.
ముక్కు సూటిగా..:
ఈకాలంలో ముక్కు సూటిగా వ్యవహరించే వారికి, మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవారికి సమస్యలు తప్పవని చెప్పాడు చాణక్యుడు. నిర్మొహమాటంగా మనసులో ఏది ఉంటే అది మాట్లాడే వారు ఇతరుల పట్ల చెడ్డవారిగా పరిగణించబడతారని సూచించాడు. అందుకే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని బట్టే మనం మాట్లాడాలని చెప్పాడు.
డబ్బు:
ఏ సమస్యకైనా డబ్బే పరిష్కారంగా కనిపిస్తున్న రోజులివి. జీవించడానికి డబ్బు చాలా అవసరం. జీవితంలో అవసరాలు తీరాలన్నా, సౌకర్యాలు కావాలన్నా డబ్బు చాలు ముఖ్యమని చెప్పాడు చాణక్యుడు. డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రమించాల్సిందేనన్నాడు. డబ్బు కోసం కష్టపడటం తప్పేం కాదని, తప్పుడు మార్గంలో సంపాదించడం తప్పు అని చెప్పాడు ఆచార్యుడు.
సంతృప్తి:
జీవితంలో సంతృప్తి పడటం చాలా అవసరమని చాణక్యుడు బోధించాడు. మోహం, క్రోధము, దురాశల వల్ల మనిషి దుఃఖాన్ని పొందుతాడని.. అందుకే ప్రతి విషయంలో ఆత్మ సంతృప్తిగా ఉండటం అలవాటు చేసుకోవాలని చెప్పాడు చాణక్యుడు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications