Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
UPI Payments: ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి షాక్.. ఇకపై డబ్బులు పంపిస్తే కట్! నిజమేనా?
కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తరువాత డిజిటల్ పేమెంట్స్ను భారీగా ప్రోత్సహించింది. మరీ ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు తరువాత ఈ డిజిటల్ పేమెంట్స్ వినియోగం భారీగా పెరిగింది. ఎంతలా అంటే కూరగాయలు అమ్మేవారు కొన్ని కొన్ని సందర్భాల్లో భిక్షగాడు కూడా డిజిటల్ పేమెంట్స్ స్వీకరించేంత స్థాయికి వెళ్ళిపోయింది. అయితే UPI ద్వారా చెల్లింపులు చేస్తే ఇకపై ఛార్జీలు వసూలు చేస్తారని, 1.1% ఛార్జీలు కట్ అవుతాయని ఓ వార్త వైరల్ అవుతోంది. అందులో నిజమెంత ఉంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అసలు వార్త ఏటంటే?
రెండు రోజులుగా సోషల్ మీడియాలో UPI పేమెంట్స్ గురించి ఓ వార్త బాగా వైరల్ అవుతోంది. అదేటంటే 2025 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఎవరైతే UPI పేమెంట్స్ చేస్తారో వారి నుంచి చార్జీలు వసూలు చేస్తారని, వారు చేసే పేమెంట్లో 1.1% ఛార్జీలు వసూలు అవుతాయని చెబుతున్నారు. అది కూడా 2000 రూపాయలకు పైగా ఎవరైతే పేమెంట్స్ చేస్తారో వారికి మాత్రమే ఇది వర్తిస్తుందని ఆ వార్త సారాంశం. అంటే 10000 రూపాయల పేమెంట్స్ చేస్తే మీకు 110 రూపాయల ఛార్జీలు అదనంగా కట్ అవుతాయన్నమాట. ఈ మేరకు సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి.

ఇందులో నిజమెంత?
ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన PBI ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమే అని స్పష్టం చేసింది. UPI పేమెంట్లకు కేంద్రం ఎలాంటి పన్ను లేదా చార్జీలు వసూలు చేయడం లేదని వెల్లడించింది. ఉచితంగానే UPI పేమెంట్స్ చేసుకోవచ్చని, అది కూడా NCPI నిబంధనలకు లోబడి పేమెంట్స్ చేసుకోవచ్చని పేర్కొంది. దీని ప్రకారం 2000 రూపాయల కంటే అదనంగా ఎవరైతే పేమెంట్స్ చేస్తున్నారో వారికి ఎలాంటి చార్జీలు ఉండవని పేర్కొంది.
కానీ కేంద్రం PPI పేమెంట్లకు చార్జీలు వసూలు చేస్తోందని, ఈ విధానం 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచే అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ PPI పేమెంట్ చేస్తేనే 1.1% ఛార్జీలు కట్ అవుతాయని, సాధారణ UPI పేమెంట్లకు కాదని మరోసారి స్పష్టం చేసింది. వినియోగదారులు UPI, PPI పేమెంట్ల మధ్య తేడాను అర్ధం చేసుకోకపోవడం వల్లే ఈ గందరగోళం తలెత్తిందని వెల్లడించింది.
UPI పేమెంట్లు చేసుకోవచ్చా?
సోషల్ మీడియాలో ఈ ప్రచారం తరువాత కొందరిలో UPI పేమెంట్లపై కొంత గందరగోళం ఏర్పడింది. తాము UPI చేయకూడదా అనే అనుమానం కలుగుతోంది. అలాంటి వారు నిర్భయంగా UPI పేమెంట్స్ చేసుకోవచ్చు. UPI పేమెంట్స్కు కేంద్రం కానీ NPCI కానీ ఎలాంటి ఎలాంటి చార్జీలను వసూలు చేయడం లేదు.



Click it and Unblock the Notifications