ఈ వ్యాధి సోకితే కళ్ళ నుంచి రక్తం కక్కి చచ్చిపోతారు.. ఇప్పటికే 15 మంది చనిపోయారు కూడా..!

ప్రపంచ దేశాలను మరో కొత్త వైరస్ వణికిస్తోంది. మార్గ్‌బర్గ్ అని పిలవబడే ఈ వైరస్ ప్రపంచ దేశాలను కునుకు లేకుండా చేస్తోంది. బ్లీడింగ్ ఐ వైరస్‌గా పెరుగున్న ఈ వ్యాధి కారణంగా సుమారు 17 దేశాలు తమ ప్రయాణికులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే ఈ వ్యాధి సోకి సుమారు 15 మందికి పైగా చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకీ ఈ వైరస్ ఏంటి? దీని లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ వైరస్ సోకితే చనిపోతామా అనే విషయాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

మార్‌బర్గ్ వైరస్ అంటే ఏమిటి?

మార్‌బర్గ్ లేదా బ్లీడింగ్ ఐ అనే ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది. ఎబోలా ఫ్యామిలీకి చెందిన ఈ వైరస్ వైరల్ హిమారేజిక్ అనే జ్వరానికి దారి తీస్తుంది. దీని కారణంగా తీవమైన రక్తస్రావం, రక్తకణాలు దెబ్బతినడం జరుగుతుంది. దీంతో మనిషి ప్రాణాలు పోతాయి. ఈ వైరస్ జొనోటిక్ స్వభావం కలిగి ఉంటుంది. ఇది గబ్బిలాల నుంచి పుట్టుకొస్తుంది. మనిషి యొక్క లాలాజలం, రక్తం, మూత్రం ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది.

Dangerous bleeding eye virus symptoms and treatment Here is everything you should know about it

ఈ వైరస్ లక్షణాలు

ఈ వైరస్ లక్షణాలు ఎబోలా వైరస్ లక్షణాలను పోలి ఉంటాయి. ఈ వైరస్ సోకిన వారిలో విపరీతమైన జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు, గొంతునొప్పి, విరేచనాలు, దద్దుర్లు వంటి ఆరోగ్య సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. కొన్ని కొన్ని సందర్భంగా ఈ వైరస్ తీవ్రమైన రక్తస్రావం, అవయవాల వైకల్యానికి దారి తీస్తుంది. దీని కారణంగా మనుషులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అనుకోకుండా బరువు తగ్గడం, కంటిలో నుంచి, ముక్కులో నుంచి, యోనిలో నుంచి రక్తం కారడం కూడా ఈ వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.

అలాగే కళ్ళు లోపలి వెళ్లినట్లు కనిపించడం, ముఖంలో కళ లేకపోవడం, ముఖం గుంజుకుపోవడం తీవ్రమైన బద్దం కూడా ఈ వ్యాధి లక్షణాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంపాదించాలని సూచిస్తోంది.

చికిత్స ఉందా?

ఈ మార్‌బర్గ్ లేదా బ్లీడింగ్ ఐ వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి యాంటీ వైరల్ చికిత్స అందుబాటులో లేదు. రోగి పరిస్థితి, వైద్య అందించే తీరును బట్టి ఈ వైరస్ సోకిన వారిలో మరణాల రేటు నిర్ణయించబడుతుంది. ఇప్పటి వరకు ఈ వ్యాధి మరణాల రేటు 24% నుంచి 88% వరకు ఉందని అధికారులు చెబుతున్నారు. రీహైడ్రేషన్ వంటి కొన్ని టెక్నిక్స్ ఈ వ్యాధి సోకిన రోగులను కాపాడేందుకు ఉపయోగపడుతున్నాయి.

ఈ వైరస్‌కు చికిత్స, ఇంజక్షన్స్ కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి సోకిన వారిలో రక్తం ఉత్పత్తి అయ్యేందుకు, రోగ నిరోధక శక్తి పెంచేందుకు, వ్యాధిని నయం చేసేందుకు వివిధ రకాల కంపెనీలు పరిశోధనలు కొనసాగిస్తున్నాయి. ఆలోపు ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిందే.

Story first published: Monday, December 9, 2024, 11:07 [IST]
Desktop Bottom Promotion