Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
దీపావళి 2025 తేదీ,పూజా విధానం, శుభ ముహూర్తాలు, నియమాలు
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో దీపావళి ఒకటి. ఈ రోజున దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తారు,బాణాసంచా కాలుస్తారు. అయితే ఈ సంవత్సరం దీపావళి తేదీపై ప్రజల్లో కాస్త గందరగోళం నెలకొంది. పండుగను అక్టోబర్ 20న జరుపుకోవాలా లేక 21న జరుపుకోవాలా అనే సందేహం చాలామందిలో ఉంది. శాస్త్రాల ప్రకారం దీపావళి పూజను కార్తీక మాసంలోని అమావాస్య తిథి నాడు, సూర్యాస్తమయం తర్వాత వచ్చే ప్రదోష కాలంలో నిర్వహించాలి. ఈ సంవత్సరం కార్తీక అమావాస్య తిథి రెండు రోజుల పాటు ఉంది.
అక్టోబర్ 20,2025 మధ్యాహ్నం 03:44 గంటలకు అమావాస్య ప్రారంభమై..అక్టోబర్ 21 సాయంత్రం 05:54 గంటలకు అమావాస్య ముగుస్తుంది. అక్టోబర్ 20న సూర్యాస్తమయం తర్వాత ప్రదోష కాలం మొత్తం అమావాస్య తిథి వ్యాపించి ఉంటుంది. కానీ అక్టోబర్ 21న ప్రదోష కాలంలో కేవలం 9 నిమిషాలు మాత్రమే అమావాస్య ఉండి ఆ తర్వాత కార్తీక శుక్ల ప్రతిపాద తిథి ప్రారంభమవుతుంది. ప్రదోష కాలంలో లక్ష్మీ పూజ చేయడం అత్యంత ముఖ్యం కాబట్టి పండితులు, జ్యోతిష్యులు అక్టోబర్ 20 సోమవారం నాడే దీపావళి జరుపుకోవాలని స్పష్టం చేస్తున్నారు.

లక్ష్మీ పూజకు శుభ ముహూర్తాలు
ప్రదోష కాలం: సాయంత్రం 05:46 నుండి రాత్రి 08:18 వరకు.
లక్ష్మీ పూజకు శుభ సమయం: సాయంత్రం 07:08 నుండి రాత్రి 08:18 వరకు.
వృషభ కాలం (స్థిర లగ్నం): సాయంత్రం 07:08 నుండి రాత్రి 09:03 వరకు.
నిశిత ముహూర్తం: రాత్రి 11:41 నుండి అర్ధరాత్రి 12:31 వరకు.
లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇలా పూజించండి
వృషభ లగ్నంలో పూజ: స్థిర లగ్నమైన వృషభ లగ్నంలో లక్ష్మీదేవిని పూజిస్తే, ఇంట్లో సంపద స్థిరంగా ఉంటుందని నమ్మకం.
ఇష్టమైన పుష్పం: అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది తామర పువ్వు. పూజలో దీనిని తప్పకుండా సమర్పించాలి.
ప్రియమైన నైవేద్యం: లక్ష్మీదేవికి కుంకుమపువ్వు కలిపిన పాయసం (ఖీర్) అంటే చాలా ఇష్టం. ఈ నైవేద్యం సమర్పించడం వల్ల అమ్మవారు త్వరగా ప్రసన్నురాలవుతారు.
తామర గింజల మాల: దీపావళి రాత్రి తామర గింజల మాల (కమల గట్ట మాల)తో కనకధారా స్తోత్రం పఠిస్తే, ఆర్థికంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి.
ముత్తయిదువ సామాగ్రి: పూజలో పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో పాటు అమ్మవారికి అలంకరణ వస్తువులు సమర్పించడం శుభప్రదం.
ముఖ్య నియమాలు
దీపావళి రోజు సాయంత్రం లక్ష్మీ పూజ తర్వాత ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వకూడదని నమ్ముతారు. రాహుకాలం (ఉదయం 7:50 - 9:15), యమగండం (ఉదయం 10:40 - మధ్యాహ్నం 12:06) సమయాల్లో శుభకార్యాలు ప్రారంభించవద్దు.



Click it and Unblock the Notifications











