త్వరలో మనకు రోజుకు 25 గంటలు.. ఎలాగో తెలుసా..?

మనకు ప్రతిరోజు ఉండే సమయం కేవలం 24 గంటలు మాత్రమే కానీ మీకు సమయం సరిపోవడం లేదని ఎన్నోసార్లు అనుకుని ఉంటారు అయితే భూమి రొటేషన్ లో మార్పులు రావడంతో రోజు ఏకంగా ఇరవై ఐదు గంటలకు పెడుతోంది. ఇప్పుడు కొత్తగా చెబుతున్న విషయం కాదు సరిగ్గా ఆరు నెలల క్రితం ఇదే విషయం పరిశోధనలలో కూడా తేలింది. అయితే అసలు భూమి ఎలా ఏర్పడింది దానికి సమయాన్ని ఎలా లెక్కగట్టారో ఓ సారి చూద్దాం.

Earths complete rotation taking 25 hours per day

గ్యాస్ లో దుమ్ము ధూళి కారణంగా 460 కోట్ల ఏళ్ల క్రితం భూమి ఏర్పడింది. భూమి ఏర్పడ్డ తర్వాత దాని పై ఏర్పడిన వాతావరణ పరిస్థితులలో రొటేషన్ మొదలైంది దాంతో గ్రావిటీ ఏర్పడింది ఈ గురుత్వాకర్షన శక్తే భూమిని కాపాడింది లేదంటే ఎప్పుడో వేరే గ్రహంతో ఢీ కొట్టి పేలిపోయేది. విసిరేసినట్టుగా సౌర కుటుంబంలో ఉండడం వల్ల భూమి నిలబడింది లేదంటే భూమి ఉండేది కాదు.

మనుషులమైన మనమూ ఏర్పడే వారం కాదు. అయితే భూమికి ఉన్న విపరీతమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగా చందమామ కూడా అలా కక్ష్యలో తిరుగుతూ ఉంది. జరుగుతుంది లేదంటే చందమామ కూడా ఎక్కడో విసిరేసి కనిపించేది కాదు. చందమామ గురుత్వాకర్షణ శక్తి ప్రభావం కూడా భూమిపై ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మీరు నిండు పౌర్ణమి రోజున సముద్రం దగ్గరకు వెళ్ళండి అప్పుడు అలల ధాటి విపరీతంగా ఉంటుంది. మనం ఇపుడు చూసే చంద్రుడు భూమికి ఒకప్పుడు చాలా దగ్గరగా ఉండే వాడు. అందుకే భూమి వేగంగా తిరిగేది. సరిగ్గా 140 కోట్ల ఏళ్ల క్రితం ఒక రోజు సమయం ఎంత కేవలం 18 గంటల 40 నిమిషాలు మాత్రమే. డైనాసర్ల కాలంలో కూడా రోజుకు ఇరవై మూడు గంటలు మాత్రమే ఉండేది. కానీ చంద్రుడు ఏడాదికి 3.82 సెంటీ మీటర్ల దూరం జరుగుతున్నాడని సైంటిస్టులు గుర్తించారు. దీంతో భూమి రొటేషన్ లో వేగం తగ్గింది. అందువల్ల పగలు రాత్రి సమయాలు పెరిగాయి.

మన భూమి తన చుట్టూ తాను తిరగడానికి పూర్తయ్యే కాలాన్ని 24 గంటలుగా ఒక రొటేషన్‌గా చెప్పుకుంటున్నాం. అదే సూర్యుని చుట్టూ తిరగడానికి పట్టే కాలాన్ని 365 రోజులు లేదా ఏడాదిగా పిలుచుకుంటున్నాం. సరిగ్గా ఇరవై వేల కోట్ల ఏళ్ల నుంచి రోజుకు 24 గంటలు భూమిపై ఉంది కానీ ఇప్పుడు చంద్రుడు దూరం జరిగాడు భూమి లో వేగం తగ్గింది. భూమిపై వాతావరణ మార్పులు మొదలయ్యాయి. అలాగే కాలంలో కూడా మార్పులు చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం 24 గంటల సమయాన్ని పొడిగించాలని సైంటిస్టులు గుర్తుచేస్తున్నారు. ఒక ఏడాదికి 365. 242 190 రోజులు అని కచ్ఛితమైన లెక్క ఉంది. ఏడదికి రెండు గంటలు అదనంగా ఉన్నా మనం తీసుకోవడం లేదు. అంటే ఏడాది తక్కువగా వేసుకుంటున్నాం.అందుకే లీప్ ఇయర్ ను ఏర్పాటు చేసుకున్నాం.

కానీ ఇప్పుడు రోజుకు 25 గంటలుగా సెట్ చేయాలని తాజాగా మ్యూనిక్ టెక్నికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు కూడా చెబుతున్నారు. వాస్తవానికి భూమి తిరగడం మనం చూడలేం. రోదసిలో వెళ్తున్న వారు కూడా భూమి తిరగడాన్ని చూడలేరు. భూమి చాలా నెమ్మదిగా తిరుగుతుంది. కంటికి కూడా కనిపించదు.

గతంలో భూమిపై రోజుకు 18 గంటలు మాత్రమే ఉండేది. భూమిపై వాతావరణ మార్పులు రావడం వల్ల భూమి తిరగడం స్లో అయిందని చెప్పుకోవచ్చు. దీంతో గంటలు పెరుగుతూ వస్తున్నాయ్. ఇప్పుడు కాకున్నా 50 ఏళ్ల తరువాతైనా రోజుకు 25 గంటలగా నిర్ణయిస్తారు. ఒక రోజు గంటలు పెరగడంతో మనిషి ఆయుష్షు కూడా తగ్గనుంది. 100 ఏళ్లు బుతకుతాడని అనుకుంటే ఆ లెక్క మరింత తక్కువగా వచ్చే అవకాశం ఉంది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది మరి.

Story first published: Saturday, July 20, 2024, 22:02 [IST]
Desktop Bottom Promotion