Latest Updates
-
లంచ్ బాక్స్ కైనా, లైట్ డిన్నర్ కైనా ది బెస్ట్ ఆప్షన్.. నిమిషాల్లో రెడీ అయ్యే అవకాడో చికెన్ సలాడ్ -
బీపీని తరిమికొట్టే 5 సూపర్ ఫుడ్స్.. ఇక మందులతో పనిలేదు! -
సాయంత్రానికి నోరూరించే జొన్న పకోడీ..మామిడికాయ పచ్చడితో తింటే ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
వేడిని తగ్గించే కీర దోసకాయతో.. నోరూరించే కొరియన్ కిమ్చి..ఈజీగా చేసేయండిలా.. -
ఫిట్స్ వస్తే చేతిలో తాళాలు పెడుతున్నారా? అయితే ఈ షాకింగ్ నిజం తెలుసుకోండి! -
నోరూరించే వంకాయ పచ్చి కారం..వేడి అన్నంతో తింటే అద్భుతో అద్భుత అద్భుతసహ్య.. -
ఎముకలను ఉక్కులా మార్చే రాగి నువ్వుల లడ్డూ..15 నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే.. -
వృషభం, మిథునం, సింహ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ అదృష్టం ఎలా ఉంది? - 17 నుండి 23 మే 2026 వరకు -
వృషభం, సింహం, ధనస్సు రాశుల వారికి రాజయోగం.. ఆదివారం మీ అదృష్టం ఎలా ఉంది? - ఆదివారం, 17 మే 2026 -
Chilkur Balaji Temple: వీసా మాఫియా గుడి.. చిలుకూరు బాలాజీ ఆలయంపై ట్రంప్ పార్టీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Exclusive: లైఫ్ లో ఒక్కసారైనా ఈ ఫ్లవర్ షో చూడాలి, లక్షల్లో రకరకాల పూలు, స్పెషల్ స్టోరీ
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దేశభక్తిని తలపించే కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా సిలికాన్ సిటీ బెంగళూరులోని లాల్ బాగ్ లో ఫల, పుష్ప ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. బెంగళూరు నగరంలోని లాల్ బాగ్ లో ఎప్పటిలాగే ఈ సంవత్సరం కూడా ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు.
ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా సెలవు కావడంతో లాల్ బాగ్ కు ప్రజలు పోటెత్తారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం లాల్ భాగ్ లో ప్రత్యేక థీమ్ లతో ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ థీమ్, పార్లమెంట్ థీమ్ తో ప్రత్యేకంగా ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. సుమారు 32 లక్షల పూలు ఉపయోగించి ప్రత్యేకంగా ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు.

మామూలుగానే లాల్ బాగ్ లో పర్యాటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. ఇప్పుడు లాల్ బాగ్ లో ప్రత్యేకంగా ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేయడంతో పర్యాటకుల సంఖ్య మూడింతలు పెరిగింది. బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు లాల్ బాగ్ వచ్చి వెళ్తుంటారు. ఇప్పుడు ఫల, పుష్ప ప్రదర్శన సందర్భంగా పలు ప్రాంతాల ప్రజలు లాల్ బాగ్ కు భారీగా తరలివస్తున్నారు.

లాల్ బాగ్ కు నాలుగు వైపుల ఉన్న నాలుగు గేట్ల దగ్గర టిక్కెట్ కౌంటర్లలో ఫల, పుష్ప ప్రదర్శన వీక్షించడానికి టిక్కెట్లు విక్రయిస్తున్నారు. ఫల, పుష్ప ప్రదర్శన చూడాలనుకున్న వారికోసం ప్రత్యేకంగా టికెట్ల ధరలు నిర్ణయించారు. పెద్దలకు 80 రూపాయలు, పిల్లలకు 30 రూపాయలు ధర నిర్ణయించారు. ఇక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా ఫల, పుష్ప ప్రదర్శన వీక్షించడానికి అవకాశం కల్పించారు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6.30 గంటల వరకు లాల్ బాగ్ లో ఫల, పుష్ప ప్రదర్శన చూడడానికి అవకాశం ఉంది.

స్వాతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా లాల్ బాగ్ లో సుమారు రూ. 2. 80 కోట్లు ఖర్చు చేసి ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు. లాల్ బాగ్ లో ఫల, పుష్ప ప్రదర్శన చిన్నా,పెద్ద అని తేడా లేకుండా అందరినీ కట్టిపడేస్తుంది. ఫల, పుష్ప ప్రదర్శన సందర్భంగా లాల్ బాగ్ లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తమిళనాడు, కేరళ, అసోం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా పూలు తెప్పించి లాల్ బాగ్ లో ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేశారు.

సుమారు ఏడు లక్షల నుండి ఎనిమిది లక్షల పూలు ఉపయోగించి అంబేద్కర్ థీమ్ చక్కగా ఏర్పాటు చేశారు. లక్షలాది పూలు ఉపయోగించి పార్లమెంట్ భవనం తయారు చేశారు. లక్షలాదిమంది ప్రజలు లాల్ బాగ్ చేరుకుని ఫల, పుష్ప ప్రదర్శన వీక్షించారు. ఆగస్టు 15వ తేదీ ప్రభుత్వ సెలవు కావడం, తరువాత వరుసగా వరమహాలక్ష్మి పండుగతో పాటు వీకెండ్ రావడంతో శని, ఆదివారం రోజుల్లో ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉందని కర్ణాటక తోటల పెంపకం శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.




Click it and Unblock the Notifications