భారత తొలి బడ్జెట్ ఎవరు ప్రవేశపెట్టారు? ఆ విదేశీ భాషలో 13 ఏళ్లు ఎందుకు బడ్జెట్ ప్రవేశపెట్టారు?

ఫిబ్రవరి 1, 2026 ఆదివారం.. దేశవ్యాప్తంగా అందరి దృష్టి పార్లమెంట్ వైపే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నారు.

అయితే నేడు మనం స్మార్ట్‌ ఫోన్లలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ లలో బడ్జెట్ వివరాలను చూస్తున్నాం. కానీ ఒకప్పుడు మన దేశ బడ్జెట్ కేవలం ఒక విదేశీ భాషలో మాత్రమే ముద్రించబడేదన్న విషయం, ఆ సంప్రదాయాన్ని మార్చడానికి 13 ఏళ్లు పట్టిందన్న విషయం చాలా మందికి తెలియదు. ఆ ఆసక్తికరమైన ప్రస్థానం గురించి తెలుసుకుందాం.

From 1860 to 2026 The Untold Story of How the Indian Budget Found its Voice

అసలు మన దేశంలో తొలి బడ్జెట్ ఎప్పుడు వచ్చింది?
చాలామంది 1947లో స్వాతంత్ర్యం వచ్చాక అని భావిస్తారు. కానీ భారతీయ బడ్జెట్ చరిత్ర 1860లోనే మొదలైంది. బ్రిటిష్ అధికారి జేమ్స్ విల్సన్ మన దేశపు తొలి బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు.

అప్పట్లో అది ప్రజల సంక్షేమం కోసం కాకుండా, కేవలం బ్రిటిష్ ప్రభుత్వ ఖర్చులు, పన్నుల లెక్కలను సరిచూసుకోవడానికి మాత్రమే ఉద్దేశించబడింది.

స్వాతంత్ర్యం వచ్చినా.. మారని భాష
1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి త్రివర్ణ పతాకం రెపరెపలాడినా, పరిపాలనలో మాత్రం బ్రిటిష్ వాసనలు వెంటనే పోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో బడ్జెట్ ప్రతులన్నీ పూర్తిగా ఇంగ్లీషులోనే ఉండేవి.

మన దేశ రైతులు, గ్రామీణ ప్రజలకు ఆంగ్లం రాకపోయినా, దేశ ఆర్థిక విధానాలు మాత్రం వారికి అర్థం కాని భాషలోనే ఉండేవి. దీనివల్ల బడ్జెట్‌ లో తమకు ఏముంది? ఏది కొత్త? ఏది పాత? అనే విషయాలు సామాన్యులకు అంతుచిక్కేవి కావు.

హిందీకి ఎందుకు అంత సమయం పట్టింది?
స్వతంత్ర భారతంలో కూడా బడ్జెట్ ఇంగ్లీష్‌ లోనే ఎందుకు కొనసాగింది? అనే సందేహం రావచ్చు. దానికి కారణం..మన పరిపాలనా వ్యవస్థ పూర్తిగా బ్రిటిష్ నమూనాలో ఉండటమే.

పార్లమెంటులో, ఆర్థిక మంత్రిత్వ శాఖలో పనిచేసే అధికారులకు ఇంగ్లీష్ మీదే పట్టు ఉండేది. పైగా క్లిష్టమైన ఆర్థిక పదాలకు సరైన హిందీ పదాలు 1960ల వరకు ప్రామాణికం కాలేదు. అందుకే బడ్జెట్ సామాన్యుడి భాషలోకి రావడానికి సమయం పట్టింది.

From 1860 to 2026 The Untold Story of How the Indian Budget Found its Voice

13 ఏళ్ల తర్వాత వచ్చిన చారిత్రక మార్పు
సుమారు 13 సంవత్సరాల నిరీక్షణ తర్వాత అంటే 1950ల చివరలో (1955-56 బడ్జెట్ సమయం నుండి) ఒక చారిత్రాత్మక మార్పు జరిగింది. సామాన్యుడికి అర్థం కాని బడ్జెట్ ఎందుకని భావించి, మొదటిసారిగా బడ్జెట్‌ ను ఇంగ్లీష్‌తో పాటు హిందీలో కూడా ముద్రించడం ప్రారంభించారు.

రాజ్యాంగం హిందీకి అధికార భాషా హోదా కల్పించాక జరిగిన గొప్ప మార్పు ఇది. ఇది కేవలం భాషా మార్పు మాత్రమే కాదు, ప్రభుత్వ పారదర్శకతను పెంచి, ఆర్థిక విషయాలను ప్రజలకు చేరువ చేసిన ఒక విప్లవం.

నేటి డిజిటల్ యుగం
నేడు కాలం మారింది. పార్లమెంట్ నుండి అరచేతిలోని మొబైల్ వరకు బడ్జెట్ సమాచారం ఇంగ్లీష్, హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లోనూ డిజిటల్ రూపంలో అందుబాటులోకి వచ్చింది.

నాడు సామాన్యుడికి అర్థం కాని ఇంగ్లీష్ చిట్టాగా మొదలైన బడ్జెట్ ప్రస్థానం.. నేడు ప్రతి పౌరుడు సులభంగా విశ్లేషించగలిగే స్థాయికి చేరడం మన ప్రజాస్వామ్య విజయం.

Desktop Bottom Promotion