Latest Updates
-
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.! -
కలలో బొద్దింకలు కనిపిస్తే.. మీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా.? -
జేబులో రూ.200 ఉంటే చాలు.. హైదరాబాద్ లో మీ ఫ్రెండ్స్ తో గడిపే సూపర్ ప్లాన్స్ ఇవే! -
చేసిన పనికి గుర్తింపు లేకపోతే ప్రేమ ఎలా తగ్గిపోతుంది
భయానకంగా మారిని కేరళ వాయ్నాడ్.. అర్థరాత్రి విరిగిపడిన కొండచరియలు..!!
కేరళలోని వాయ్నాడ్ జిల్లాల్లో అర్థరాత్రి వరదలు ముంచుకొచ్చాయ్. ప్రజలంతా ఘాడ నిద్రలో ఉండగా ఒక్కసారిగా వరదలు వచ్చి కొండచరియలు విరిగి పడ్డాయ్. ఒకవైపు ప్రజల ఆర్థనాదాలు, మరోవైపు కొండచెరియలు విరిగి పడ్డంతో వాయ్నాడ్లో భయానక పరిస్థితి నెలకొంది. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయ్. కొండచరియల కింది, ఇళ్ల శిధిలాల కింది వంలాది మంది చిక్కకొని ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, కెఎస్డీఎమ్లో దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయ్. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురౌతున్నాయ్.

వాయ్నాడ్లో ఇప్పటికి 44 మంది మృతి చెందగా, 70 మందికి తీవ్ర గాయాలయ్యాయ్. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వెలుగులోకి రాని మరణాలు చాలా ఉన్నాయని అంటున్నారు. కొన్ని కొండచరియలు ఊళ్లకు ఊళ్లను ఊడ్చేశాయ్. కేరళ సీఎంతో ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫోన్లో సంభాషించి పరిస్థితిని తెలుసుకున్నారు.
వాయ్నాడ్లో వచ్చిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంటులో కూడా డిమాండ్ చేస్తున్నారు. 5వేల కోట్ల రూపాయలను తక్షణ సాయం కింద అందించాలని కోరుతున్నారు. అయితే వాయ్నాడ్లో 225 మంది ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. రేపు వాయ్నాడ్కు, రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ చేరుకుంటున్నారు.
ఈ భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురవనున్నాయ్. 100 మంది వరకు గల్లంతయ్యారని తెలుస్తోంది. ఇళ్లు కూలిపోతున్నాయ్, చెట్లు కొట్టుకుపోతున్నాయ్, కొండచరియలు విరిగిపడుతున్నాయ్, వాయ్నాడ్లో భయానక పరిస్థితి నెలకొని ఉంది. మృతి చెందిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియాలను ప్రధాని ప్రకటించారు. కొండచరియలే పరిస్తితిని చాలా భయానకంగా మార్చి వేశాయ్.
గతంలో కూడా కేరళలో ఇలాంటి వరదలు చాలా వచ్చాయ్. వర్షాకాలం వచ్చిందంటే కేరళలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. పచ్చదనం, కొండలు, లోయలు ఉన్నా అవే ఇప్పుడు ప్రమాదకరంగా మారాయ్. ఎన్ని సహాయక చర్యలు తీసుకున్నా పరిస్థితి దారుణంగా మారుతుంది. వర్షాకాలం రాగానే కేరళీయులలో భయం నెలకొని ఉంటుంది. వాయ్నాడ్లో ప్రస్తుతం దారుణ పరిస్థితి నెలకొని ఉంది. వాయ్నాడ్ నుంచి గతంలో రాహుల్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇది ఆయన నియోజకవర్గమే కావడంతో రాహుల్ గాంధీ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేపు, ప్రియాంకా గాంధీతో కలిసి రాహుల్ గాంధీ వాయ్నాడ్ రానున్నారు.



Click it and Unblock the Notifications