Latest Updates
-
ఎండలను ఎదిరించే కమ్మని పానీయం..మసాలా మజ్జిగ తయారీ విధానం ఇదే! -
మద్యం తాగకపోయినా లివర్ డ్యామేజ్? కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి తినండి, వాటికి దూరంగా ఉండండి! -
అక్షయ తృతీయ వేళ పెళ్లిళ్ల సందడి.. కోర్టు మ్యారేజీల వైపు జంటల మొగ్గు! -
చూస్తే కలర్ ఫుల్, తింటే క్రంచీ..ఈ ఎండాకాలంలో టమాటా వడియాలు రుచి చూడాల్సిందే! -
బంధం నిలబడాలంటే... భాగస్వామితో అప్పుడప్పుడు ఈ అబద్ధాలు చెప్పాల్సిందే! -
ఎండల తీవ్రతతో సతమతమవుతున్నారా? ఈ చిట్కాలతో శరీరాన్ని చల్లబరచండి -
ఇంట్లోనే ఫైవ్ స్టార్ హోటల్ రుచి.. ఘుమఘుమలాడే కొబ్బరి కొత్తిమీర చికెన్ రోస్ట్ -
బంగాళదుంపలు, గుడ్లు ఉడకబెట్టేటప్పుడు ఈ తప్పు చేస్తున్నారా? పర్ఫెక్ట్ గా ఉడికే ట్రిక్ చెప్పిన చెఫ్! -
కాలేయ ఆరోగ్యం కోసం చాణక్యుడు చెప్పిన ఈ రహస్యాలు పాటిస్తున్నారా? -
బరువు తగ్గడానికి బ్రహ్మాస్త్రం.. పరగడుపున అవిసె గింజల నీళ్లు తాగితే పొట్ట మాయం!
భయానకంగా మారిని కేరళ వాయ్నాడ్.. అర్థరాత్రి విరిగిపడిన కొండచరియలు..!!
కేరళలోని వాయ్నాడ్ జిల్లాల్లో అర్థరాత్రి వరదలు ముంచుకొచ్చాయ్. ప్రజలంతా ఘాడ నిద్రలో ఉండగా ఒక్కసారిగా వరదలు వచ్చి కొండచరియలు విరిగి పడ్డాయ్. ఒకవైపు ప్రజల ఆర్థనాదాలు, మరోవైపు కొండచెరియలు విరిగి పడ్డంతో వాయ్నాడ్లో భయానక పరిస్థితి నెలకొంది. చాలా ఇళ్లు ధ్వంసమయ్యాయ్. కొండచరియల కింది, ఇళ్ల శిధిలాల కింది వంలాది మంది చిక్కకొని ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, కెఎస్డీఎమ్లో దళాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయ్. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురౌతున్నాయ్.

వాయ్నాడ్లో ఇప్పటికి 44 మంది మృతి చెందగా, 70 మందికి తీవ్ర గాయాలయ్యాయ్. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. వెలుగులోకి రాని మరణాలు చాలా ఉన్నాయని అంటున్నారు. కొన్ని కొండచరియలు ఊళ్లకు ఊళ్లను ఊడ్చేశాయ్. కేరళ సీఎంతో ప్రధాన మంత్రి, రాష్ట్రపతి ఫోన్లో సంభాషించి పరిస్థితిని తెలుసుకున్నారు.
వాయ్నాడ్లో వచ్చిన విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంటులో కూడా డిమాండ్ చేస్తున్నారు. 5వేల కోట్ల రూపాయలను తక్షణ సాయం కింద అందించాలని కోరుతున్నారు. అయితే వాయ్నాడ్లో 225 మంది ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. రేపు వాయ్నాడ్కు, రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ చేరుకుంటున్నారు.
ఈ భారీ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురవనున్నాయ్. 100 మంది వరకు గల్లంతయ్యారని తెలుస్తోంది. ఇళ్లు కూలిపోతున్నాయ్, చెట్లు కొట్టుకుపోతున్నాయ్, కొండచరియలు విరిగిపడుతున్నాయ్, వాయ్నాడ్లో భయానక పరిస్థితి నెలకొని ఉంది. మృతి చెందిన వారికి 2 లక్షల ఎక్స్గ్రేషియాలను ప్రధాని ప్రకటించారు. కొండచరియలే పరిస్తితిని చాలా భయానకంగా మార్చి వేశాయ్.
గతంలో కూడా కేరళలో ఇలాంటి వరదలు చాలా వచ్చాయ్. వర్షాకాలం వచ్చిందంటే కేరళలో పరిస్థితి దారుణంగా ఉంటుంది. పచ్చదనం, కొండలు, లోయలు ఉన్నా అవే ఇప్పుడు ప్రమాదకరంగా మారాయ్. ఎన్ని సహాయక చర్యలు తీసుకున్నా పరిస్థితి దారుణంగా మారుతుంది. వర్షాకాలం రాగానే కేరళీయులలో భయం నెలకొని ఉంటుంది. వాయ్నాడ్లో ప్రస్తుతం దారుణ పరిస్థితి నెలకొని ఉంది. వాయ్నాడ్ నుంచి గతంలో రాహుల్ పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఇది ఆయన నియోజకవర్గమే కావడంతో రాహుల్ గాంధీ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రేపు, ప్రియాంకా గాంధీతో కలిసి రాహుల్ గాంధీ వాయ్నాడ్ రానున్నారు.



Click it and Unblock the Notifications











