Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
OFFICIAL: బెంగళూరులో ఇద్దరికి సోకింది HMPV వైరస్సే.. వారి పరిస్థితి ఎలా ఉందంటే?
ఈరోజు ఉదయం బెంగళూరులో ఇద్దరు చిన్నారులకు HMPV వైరస్ సోకినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ చిన్నారులకు సోకింది.. చైనాలో విస్తృతంగా సోకుతున్న HMPV వైరస్సే అని ICMR ధృవీకరించింది. ఆ చిన్నారులకు అదే వైరస్ సోకిందని వెల్లడించింది. రొటీన్ సర్వీలియన్స్లో వారిద్దరిలో మల్టిపుల్ రెస్పిరేటరీ వైరల్ పాథోజోన్స్ను గుర్తించామని వెల్లడించింది. ఇప్పటికే ఈ వైరస్ కేసులు చైనాతో పాటు పలు దేశాల్లో కూడా నివేదించబడ్డాయని, మన దేశంలో కూడా రెండు కేసులను గుర్తించామని తెలిపింది.
ఆ ఇద్దరు చిన్నారులు ఇప్పటి వరకు ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణాలు చేయలేదని, వారికి ఆ వైరస్ సోకడం అనేది గమనార్హం అని వెల్లడించింది. వారిద్దరూ ప్రస్తుతం బాప్టిస్టు ఆసుపత్రిలో పొందుతున్నారని, వారికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపింది. ప్రస్తుత డేటా ప్రకారం మన దేశంలో ఈ HMPV వైరస్ కేసుల పెరుగుదల విస్తృతంగా లేదని, ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఈ రెండు కేసులను తాము నిశితంగా పరిశీలిస్తున్నామని కర్ణాటక ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది. కేసులు పెరగకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలి. ప్రతి 20 సెకండ్లకు ఒకసారి చేతులను శుభ్రం చేసుకోవాలి. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు గుడ్డ అడ్డం పెట్టుకొని తుమ్మాలి. అలాగే వైరస్ సోకినట్లు నిర్ధారణ అయితే బయటికి రావొద్దు. ఇంట్లోనే ఉండి ఇతరులకు అంటకుండా చూసుకోవాలి.
లక్షణాలు ఎలా ఉంటాయంటే
ఈ వ్యాధి సోకిన వారికి కరోనా లక్షణాలే ఎక్కువగా ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు వస్తాయి. గొంతునొప్పి వంటి సమస్యలు కూడా ఎక్కువగా ఇబ్బందులకు గురి చేస్తుంది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే.. బ్రాంకైటిస్, నిమోనియాకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకిం 3 నుంచి ఆరు రోజుల లోగా ఈ వైరస్ లక్షణాలు బయటపడతాయి. చిన్నారులకు, వృద్ధులకు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ వైరస్ ఎక్కువగా సోకుతుంది.



Click it and Unblock the Notifications