Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఇకపై ఈ విధమైన రీల్స్ చేస్తే జైలుకే.. జాగ్రత్త మీరు కూడా..!
సోషల్ మీడియా వినియోగం చాలా పెరిగిపోయింది. యూట్యూబ్ షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో రాత్రికి రాత్రి ఫేమస్ అయిపోవాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకు తగ్గట్టుగానే చాలా మంది ప్రమాదకరమైన రీల్స్ చేస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టుకొని ఉంటారు. మరీ ముఖ్యంగా రైళ్లతో రీల్స్ చేయడం, రైళ్ల స్టేషన్ల దగ్గర, రైళ్ల పట్టాలపై నిలబడి రీల్స్ చేయడం వంటివి చేస్తుంటారు. ఇలాంటి వారిపై ప్రభుతం కఠిన చర్యలు తీసుకోనుంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది? ఏ విధమైన శిక్షలను అమలు చేయనుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైల్వే బోర్డు ఏం చెప్పిందంటే?
దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్ల దగ్గర నిలబడి రీల్స్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. ఇలా చేయడం వల్ల తమ వ్యక్తిగత ప్రాణాలను పణంగా పెట్టడంతో పాటు ఇతర ప్రయాణికులకు అలసౌకర్యంగా మారుతుంది. ఇలాంటి ఘటనలు దేశంలో మరీ ఎక్కువ అవుతుండడంతో కేంద్ర రైల్వే శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. రైళ్ల దగ్గర నిలబడి రీల్స్ చేయడం.. పట్టాలపై కూర్చొని రీల్స్ చేయడం, రైల్వే స్టేషన్ల వద్ద రీల్స్ చేస్తే వారిపై కేసులు నమోదు చేయనున్నారు. అలాగే వారిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోనున్నారు.

కేసులతో పాటు..
రైళ్ల దగ్గర నిలబడి రీల్స్ చేయడం వల్ల తమ వ్యక్తిగత ప్రాణాలను ప్రమాదంలో పెట్టడంతో పాటు రైళ్లలో ప్రయాణిస్తున్న వందలాది మంది ప్రజలను కూడా ప్రమాదంలో నెడుతున్నారు. అందుకే రైల్వే బోర్డు ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేయాలని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రభుత్వ రైల్వే పోలీసులను ఆదేశించింది. దీంతో పాటు అలాంటి రీల్స్ చేసే వారికి భారీగా ఫైన్ వేయాలని తెలిపింది. కఠినమైన శిక్షలను అమలు చేయాలని వారు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా శిక్షలతో పాటు శిక్షణ కూడా విధించాలని సూచించింది. అలాగే అలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ చేసే వ్యక్తులను రైల్వేలో నిషేధించాలనే ప్రతిపాదనను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ఎలాంటి ప్రమాదాలు వస్తున్నాయి?
సోషల్ మీడియా పిచ్చితో ప్రజలు నిజంగానే పిచ్చిపట్లు ప్రవర్తిస్తున్నారు. రైళ్ల పట్టాలపై వస్తువులు పెట్టడం, నడుస్తున్న రైలులో ఇతర వాహనాలను నడపడం, రైళ్లపై రాళ్లు, బాంబులు వేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు వందలాది మంది ప్రజలను ప్రామాదంలో నెడుతున్నట్లు అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే పై విధమైన కఠిన నిర్ణయాలు తీసుకుంది.
ఇవి మాత్రం చేయకూడదు..
నిత్యం లక్షలాది మంది ఇండియన్ రైల్వేస్లో తమ ప్రయాణాన్ని సాగిస్తుంటారు. తమ వ్యాపార, వ్యక్తిగత పనుల కోసం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తుంటారు. ఎన్నో ఆశలు, ఆశయాలతో వారు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తారు. అయితే కొందరు చేసే కొన్ని పిచ్చి పిచ్చి పనుల వల్ల వారి ప్రాణం పోవడంతో పాటు.. వారి కుటుంబంలో చీకట్లు కమ్ముకునే అవకాశం ఉంది. మనం ఎన్నో రైలు ప్రమాదాలు చూసే ఉంటాం. అందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయింది కూడా చూశాం. అలాంటి విషాదాలకు మీరు కారణం కాకూడదు. ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేయకూడదు.



Click it and Unblock the Notifications











