Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Mahakumbh 2025: బాబాగా మారిన IIT బాంబేలో చదివిన వ్యక్తి.. కుంభమేళాలో అతని మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే!
మహా కుంభమేళా ప్రారంభమైంది. ప్రతి రోజూ కోట్లాది మంది ప్రజలు త్రివేణి సంగమం వద్ద కుంభమేళా స్నానాలు ఆచరిస్తున్నారు. కేవలం ప్రజలు మాత్రమే కాదు.. నాగ సాధవులు, బాబాలు ఇలా చాలా మంది కుంభమేళాలో పాల్గొంటున్నారు. కొందరు బాబాలో ఈ కుంభమేళా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 144 సంవత్సరాల తరువాత వస్తున్న మహా కుంభమేళా కావడంతో ఈ కుంభమేళా ప్రత్యేకమైనదిగా నిలిచింది. దీంతో చాలా మంది ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఈ కుంభమేళాలో ఓ సాధువు అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ బాబా IIT బాంబేలో డిగ్రీ పొంది బాబా మారారు. అయితే ఆయన బాబాగా మారడానికి కారణం ఏంటి? ఆయనను ఈ మార్గంలో నడిపించింది ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆ బాబా ఎవరు?
మహాకుంభా మేళాలో పాల్గొన్న ఈ IIT బాబా.. బాంబే IITలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. ఆయన అసలు పేరు అభయ్ సింగ్. ఈ బాబా పుట్టి పెరిగింది హర్యానాలో. అతనికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అంట. అలాగే అతను యానిమేషన్ కూడా చేస్తారు. అలాగే డిజైనర్ కూడా. అతనికి ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీ గురించి తెలుసు. అతను చెబుతున్న సమాధానాలు అక్కడి ప్రజలతో పాటు అతనికి సంబంధించిన వీడియోలు చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు.
ఆధ్యాత్మికత కోసం
IIT బాంబేలో అద్భుతమైన ఇంజనీరింగ్ కోర్స్ చేసినప్పటికీ తనకు ఆధ్యాత్మికత వెళ్లాలనే కోరిక ఉండేదని, అందుకే తాను ఆధ్యాత్మికత వైపు నడుస్తూ బాబాగా మారానని తెలిపారు. బాబాగా మారిన తరువాత తనకు అసలైన జీవితం అంటే ఏంటో తెలుసుస్తుందని చెప్పారు. అలాగే తాను అసలైన జ్ఞానాన్ని ఇప్పుడే పొందుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మికతలో తనకు చాలా సుఖవంతమైన జీవనం దొరికిందని చెప్పారు.
బాబాలు అజ్ఞానులు కాదు..
చాలా మంది సన్యాసులకు, బాబాలకు ఎలాంటి టెక్నికల్ పరిజ్ఞానం లేదని చెబుతుంటారు. కానీ అది ఒక అపోహ మాత్రమే. ఎంతోమంది సాధువులు, బాబాలు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి కూడా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపి ఆ ఆధ్యాత్మికత వైపు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ అభయ్ సింగ్ అంటే IIT బాంబే బాబా కూడా వైరల్గా మారారు.
కుంభమేళా ఎక్కడెక్కడ జరుగుతుందంటే
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరుగుతుంది.
హరిద్వార్: ఇక్కడ కుంభ, అర్థ కుంభ మేళాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఆరు లేదా 12 సంవత్సరాలకు కుంభమేళా నిర్వహిస్తుంటారు
నాసిక్: ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు
ఉజ్జయిని: 2028లో జరగనున్న కుంభమేళా ఉజ్జయినిలో జరగనుంది.



Click it and Unblock the Notifications