Latest Updates
-
పెనంపైనే రెస్టారెంట్ స్టైల్ లో.. దూదిలాంటి మెత్తని గార్లిక్ నాన్ చేసేయండిలా! -
మీ కళ్ల ముందే ఎవరైనా కుప్పకూలిపోతే వెంటనే ఏం చేయాలి? -
నెలసరి సమయంలో వ్యాయామం చేయడం సురక్షితమేనా.. నిపుణుల సలహా ఏంటంటే.? -
ఎముకలకు బలాన్నిచ్చే సంప్రదాయ మటన్ షోర్బా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
వర్షాకాలం అలర్ట్.. గోడలపై ఇలా ఉంటే ఊపిరితిత్తుల వ్యాధికి దారితీస్తుందా.. డాక్టర్లు చెబుతున్న వాస్తవాలు -
మీ పిల్లలు కెరీర్లో ఉన్నతంగా ఎదగాలంటే.. స్టడీ రూమ్లో ఈ వాస్తు సలహాలు పాటించాల్సిందే.! -
ఈ వారం ఈ నాలుగు రాశుల వారికి తిరుగే లేదు.. అన్నింటా విజయమే, కష్టానికి తగిన ప్రతిఫలం.! -
కండల వీరుడికి ఏమైంది? సల్మాన్ ఖాన్ ఇలా అయిపోడానికి కారణం అదేనా? -
ఈ సింపుల్ చిట్కాతో ఎంతటి నల్లటి కడాయి అయినా సరే.. కొత్తదానిలా మెరవాల్సిందే! -
అద్భుత శక్తులున్న 4 రామాలయాలు ఇవే!
Mahakumbh 2025: బాబాగా మారిన IIT బాంబేలో చదివిన వ్యక్తి.. కుంభమేళాలో అతని మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే!
మహా కుంభమేళా ప్రారంభమైంది. ప్రతి రోజూ కోట్లాది మంది ప్రజలు త్రివేణి సంగమం వద్ద కుంభమేళా స్నానాలు ఆచరిస్తున్నారు. కేవలం ప్రజలు మాత్రమే కాదు.. నాగ సాధవులు, బాబాలు ఇలా చాలా మంది కుంభమేళాలో పాల్గొంటున్నారు. కొందరు బాబాలో ఈ కుంభమేళా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. 144 సంవత్సరాల తరువాత వస్తున్న మహా కుంభమేళా కావడంతో ఈ కుంభమేళా ప్రత్యేకమైనదిగా నిలిచింది. దీంతో చాలా మంది ఇందులో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే ఈ కుంభమేళాలో ఓ సాధువు అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ బాబా IIT బాంబేలో డిగ్రీ పొంది బాబా మారారు. అయితే ఆయన బాబాగా మారడానికి కారణం ఏంటి? ఆయనను ఈ మార్గంలో నడిపించింది ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఆ బాబా ఎవరు?
మహాకుంభా మేళాలో పాల్గొన్న ఈ IIT బాబా.. బాంబే IITలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. ఆయన అసలు పేరు అభయ్ సింగ్. ఈ బాబా పుట్టి పెరిగింది హర్యానాలో. అతనికి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం అంట. అలాగే అతను యానిమేషన్ కూడా చేస్తారు. అలాగే డిజైనర్ కూడా. అతనికి ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి ఒక్క టెక్నాలజీ గురించి తెలుసు. అతను చెబుతున్న సమాధానాలు అక్కడి ప్రజలతో పాటు అతనికి సంబంధించిన వీడియోలు చూసిన ప్రజలు షాక్ అవుతున్నారు.
ఆధ్యాత్మికత కోసం
IIT బాంబేలో అద్భుతమైన ఇంజనీరింగ్ కోర్స్ చేసినప్పటికీ తనకు ఆధ్యాత్మికత వెళ్లాలనే కోరిక ఉండేదని, అందుకే తాను ఆధ్యాత్మికత వైపు నడుస్తూ బాబాగా మారానని తెలిపారు. బాబాగా మారిన తరువాత తనకు అసలైన జీవితం అంటే ఏంటో తెలుసుస్తుందని చెప్పారు. అలాగే తాను అసలైన జ్ఞానాన్ని ఇప్పుడే పొందుతున్నాను అని చెప్పుకొచ్చారు. ఆధ్యాత్మికతలో తనకు చాలా సుఖవంతమైన జీవనం దొరికిందని చెప్పారు.
బాబాలు అజ్ఞానులు కాదు..
చాలా మంది సన్యాసులకు, బాబాలకు ఎలాంటి టెక్నికల్ పరిజ్ఞానం లేదని చెబుతుంటారు. కానీ అది ఒక అపోహ మాత్రమే. ఎంతోమంది సాధువులు, బాబాలు పెద్ద పెద్ద డిగ్రీలు చదివి కూడా ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపి ఆ ఆధ్యాత్మికత వైపు వెళ్లిన సందర్భాలు చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈ అభయ్ సింగ్ అంటే IIT బాంబే బాబా కూడా వైరల్గా మారారు.
కుంభమేళా ఎక్కడెక్కడ జరుగుతుందంటే
ప్రయాగ్రాజ్: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోని గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం వద్ద జరుగుతుంది.
హరిద్వార్: ఇక్కడ కుంభ, అర్థ కుంభ మేళాలు నిర్వహిస్తారు. ఇక్కడ ఆరు లేదా 12 సంవత్సరాలకు కుంభమేళా నిర్వహిస్తుంటారు
నాసిక్: ఇక్కడ 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు
ఉజ్జయిని: 2028లో జరగనున్న కుంభమేళా ఉజ్జయినిలో జరగనుంది.



Click it and Unblock the Notifications