20 డిగ్రీలు, 42 యూనివర్సిటీలు.. ఓ ఐఏఎస్ అధికారి అద్భుత ప్రతిభ!

మనలో చాలా డిగ్రీలు చేస్తారు. కొందరైతే ఒక్క డిగ్రీని సంపాధించడానికే కిందా మీదా పడిపోతుంటారు. మరికొందరేమో సులువుగా ఓ రెండు, మూడు డిగ్రీలను సాధించుకుంటారు. మనకు తెలిసిన వాళ్లో, స్నేహితులో.. ఎవరో ఒకరు డబుల్, త్రిబుల్ పీజీ చేసిన వాళ్లను మనం చాలానే చూసుంటాం.

కానీ ఏకంగా 20 డిగ్రీలను చదివిన వాళ్లను మాత్రం ఎక్కడా చూసి ఉండం. కనీసం విని కూడా ఉండం. కానీ మనం ఇప్పుడు చూడబోయే స్టోరీలో మాత్రం.. ఓ వ్యక్తి ఏకంగా 20 డిగ్రీలను అందుకున్నాడు. 42 యూనివర్సిటీల్లో చదువుకొని ఈ ఘనత సాధించాడు. భారతదేశపు అత్యంత అర్హత కల్గిన వ్యక్తిగా అధికారికంగా పేరు పొందాడు శ్రీకాంత్ జిచ్కర్.

Indias Most Educated Man Shrikant Jichkar, This IAS Has 20 Degrees From 42 Universities Know In Telugu

మోస్ట్ ఎడ్యుకేటెడ్ మ్యాన్:

శ్రీకాంత్ జిచ్కర్ పాతికేళ్ల వయసులోనే అనేక రికార్డులను క్రియేట్ చేశాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా పేరు సంపాధించుకున్నాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం... జిచ్కర్ భారతదేశంలోనే అత్యంత అర్హత కల్గిన వ్యక్తిగా బిరుదు పొందాడు. ఈ డిగ్రీలు అన్నింటిలో ఆయన ఫస్ట్ క్లాస్ లో పాసవ్వడమే కాకుండా.. బంగారు పతకాలను కూడా గెలుచుకున్నాడు.

శ్రీకాంత్ జిచ్కర్ సాధించిన డిగ్రీలు:

1. మెడికల్ డాక్టర్, MBBS, MD
2. లా LL.B.
3. ఇంటర్‌నేషనల్ లా, LL.M.
4. మాస్టర్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, DBM, MBA
5. బ్యాచిలర్స్ ఇన్ జర్నలిజం
6. M.A. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్
7. M.A. సోషియాలజీ
8. M.A. ఎకనామిక్స్
9. M.A. సంస్కృతం
10. M.A. హిస్టరీ
11. M.A. ఇంగ్లీష్ లిటరేచర్
12. M.A. ఫిలాసఫీ
13. M.A. పొలిటికన్ సైన్స్
14. M.A. ప్రాచీన భారతీయ చరిత్ర, సంస్కృతి మరియు పరావస్తు శాస్త్రం
15. M.A. సైకాలజీ
16. D.Litt. సంస్కృతం
17. IPS
18. IAS

ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా పనిచేసిన జిచ్కర్:

1973 నుంచి 1900 సంవత్సరాల మధ్యలో శ్రీకాంత్ జిచ్కర్ 42 పరీక్షలు రాశాడు. అయితే సివిల్స్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగానే.. ఐపీఎస్ కు రిజైన్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన మొదటి జాతీయ ఎన్నికలలో పోటీ చేయడానికి నాలుగు నెలల తర్వాత అతను తన పదవిని విడిచిపెట్టాడు. 1980లో శ్రీకాంత్ జిచ్కర్ ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అత్యంత చిన్న వయస్సులో ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిగా మారాడు.

ఆ తర్వాతి కాలంలో రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా కూడా పదవులు పొందారు. 1999లో రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దాని తర్వాత ఆయన దేశవ్యాప్తంగా పర్యటనలు చేశారు.

తనకు ఇష్టమైన పెయింటింగ్ వేయడం, నాటకాల్లో నటించడంతో పాటుగా మతం, ఆరోగ్యం, విద్య వంటి వాటిపై ప్రసంగాలు చేశారు. యునెస్కోలో భారతదేశానికి ప్రాతినిథ్యం కూడా వహించారు.

2004లో శ్రీకాంత్ జిచ్కర్ మృతి:

2004 జూన్ 2వ తేదీన అనుకోకుండా జిచ్కర్ ప్రమాదానికి గురయ్యారు. తన స్నేహితుడితో కలిసి కారులో వెళ్తుండగా ఓ బస్సు వారిపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ జిచ్కర్ ప్రాణాలు కోల్పోయాడు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 49 మాత్రమే.

చిన్న వయసులోనే చనిపోయినప్పటికీ ఆయన వైద్యుడిగా, న్యాయవాదిగా, ఐపీఎస్ గా, ఐఏఎస్ గా, రాజకీయ నాయకుడిగా తన జీవితాన్ని పరిపూర్ణంగా జీవించాడు. జిచ్కర్ తన పర్సనల్ లైబ్రరీ కోసం 52 వేల పుస్తకాలను సేకరించాడు. ఇది చూస్తేనే ఆయనకు చదువుపై, నేర్చుకోవడంపై ఎంత ప్రేముందో అర్థం అవుతుంది.

Story first published: Friday, March 31, 2023, 16:55 [IST]
Desktop Bottom Promotion