Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
కరోనా రిటర్స్..గతం కన్నా భయంకరంగా ఉంటదా?..బాబా వంగా అంచనా ఇదే
మళ్లీ కరోనా పంజా విప్పింది. చాపకింద నీరులా దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1010కి పైగానే ఉండగా..మరణాలు కూడా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మళ్లీ జనం మాస్కులు పెట్టుకోవడం,సామాజిక దూరం పాటించడం తిరిగి మొదలుపెట్టారు. అయితే ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని..జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరిలో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.
ఇదిలా ఉంటే కరోనా గురించి బాగా వంగా అంచనాలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగ అనే అంధ మహిళ..భవిష్యత్తులో జరగబోయే వాటిని అంచనాలు వేశారు. ప్రిన్సెస్ డయానా మరణం, కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక విషయాల గురించి ఆమె చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. అందుకే బాబా వంగా అంచాలను చాలామంది విశ్వసిస్తుంటారు.

జపాన్ దేశానికి చెందిన నావలిస్ట్ రియో టట్సుకి అనే మహిళను జపాన్ బాబా వంగాగా పిలుస్తుంటారు. ఈ జపాన్ బాబా వంగా వేసిన అంచనాలు కూడా కొన్ని నిజమయ్యాయి. కరోనా వైరస్ గురించి జపాన్ బాబా వంగ చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 1999లో జాపాన్ బాబా వంగా "ది ఫ్యూచర్ యాస్ ఐ సీ ఇట్(The Future as I See It)"అనే టైటిల్ తో ఓ బుక్ రాసింది. ఇందులో ఆమె భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి అంచనా వేశారు.
జపాన్ బాబా వంగా ఆ బుక్ లో చెప్పిన ప్రకారం.. 2020లో గుర్తుతెలియని వైరస్ ఒకటి వస్తుంది..ఏప్రిల్ తర్వాత కనుమరుగవుతుంది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత 2030లో ఈ వైరస్ తీవ్ర రూపంతో వస్తుందంటూ కరోనా మహమ్మారి గురించి చెప్పారు. కరోనా విధ్వంసకరమైన రీతిలోనే మళ్లీ వస్తుందని, చాలా మంది చనిపోతారని జపాన్ బాబా వంగా అంచనా చెప్పింది.
జపాన్ బాబా వంగాలు అంచనాలు ఇప్పుడు అందరిలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. మళ్లీ లాక్ డౌన్ వస్తుందా అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications











