Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
కరోనా రిటర్స్..గతం కన్నా భయంకరంగా ఉంటదా?..బాబా వంగా అంచనా ఇదే
మళ్లీ కరోనా పంజా విప్పింది. చాపకింద నీరులా దేశంలో క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1010కి పైగానే ఉండగా..మరణాలు కూడా నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మళ్లీ జనం మాస్కులు పెట్టుకోవడం,సామాజిక దూరం పాటించడం తిరిగి మొదలుపెట్టారు. అయితే ప్రజలు ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని..జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ కొందరిలో మళ్లీ భయాందోళనలు మొదలయ్యాయి.
ఇదిలా ఉంటే కరోనా గురించి బాగా వంగా అంచనాలు ఇప్పుడు మరోసారి వైరల్ గా మారాయి. బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగ అనే అంధ మహిళ..భవిష్యత్తులో జరగబోయే వాటిని అంచనాలు వేశారు. ప్రిన్సెస్ డయానా మరణం, కరోనా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సహా అనేక విషయాల గురించి ఆమె చెప్పిన అంచనాలు నిజమయ్యాయి. అందుకే బాబా వంగా అంచాలను చాలామంది విశ్వసిస్తుంటారు.

జపాన్ దేశానికి చెందిన నావలిస్ట్ రియో టట్సుకి అనే మహిళను జపాన్ బాబా వంగాగా పిలుస్తుంటారు. ఈ జపాన్ బాబా వంగా వేసిన అంచనాలు కూడా కొన్ని నిజమయ్యాయి. కరోనా వైరస్ గురించి జపాన్ బాబా వంగ చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 1999లో జాపాన్ బాబా వంగా "ది ఫ్యూచర్ యాస్ ఐ సీ ఇట్(The Future as I See It)"అనే టైటిల్ తో ఓ బుక్ రాసింది. ఇందులో ఆమె భవిష్యత్తులో జరగబోయే సంఘటనల గురించి అంచనా వేశారు.
జపాన్ బాబా వంగా ఆ బుక్ లో చెప్పిన ప్రకారం.. 2020లో గుర్తుతెలియని వైరస్ ఒకటి వస్తుంది..ఏప్రిల్ తర్వాత కనుమరుగవుతుంది. మళ్లీ 10 ఏళ్ల తర్వాత 2030లో ఈ వైరస్ తీవ్ర రూపంతో వస్తుందంటూ కరోనా మహమ్మారి గురించి చెప్పారు. కరోనా విధ్వంసకరమైన రీతిలోనే మళ్లీ వస్తుందని, చాలా మంది చనిపోతారని జపాన్ బాబా వంగా అంచనా చెప్పింది.
జపాన్ బాబా వంగాలు అంచనాలు ఇప్పుడు అందరిలో టెన్షన్ పుట్టిస్తున్నాయి. మళ్లీ లాక్ డౌన్ వస్తుందా అంటూ నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.



Click it and Unblock the Notifications