Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
రోగి కడుపులో 263 నాణేలు, బ్లేడులు, మేకులు: ఆశ్చర్యంలో డాక్టర్లు!
ఒక వ్యక్తి కడుపు నుంచి ఏకంగా 40 కత్తులను వెలికితీశారు. ఆయనకు అక్కడున్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఇప్పుడాయన పరిస్థితి బాగానే ఉంది.
ఇంటర్నెట్ ఎన్నో వింతలు, విశేషాలకు నిలయం. ఎన్నో ఆసక్తికర సంఘటనలు, ఆశ్చర్యం కలిగించే విషయాలు, భయంకరమైన, జుగుప్సాకర విశేషాలకు పుట్టిల్లు. ప్రతి రోజు ఏదో ఒక గమ్మత్తైన విషయాన్ని ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు.
క్రితం సారి 48 ఏళ్ల వ్యక్తి కడుపులో 639 మేకులను డాక్టర్లు కనుగొన్నారు. ఆయనకు కలకత్తా మెడికల్ హాస్పిటల్లో చికిత్స చేశారు. ఆయనకు స్కిజోఫ్రీనియా ఉందని వైద్యులు కనిపెట్టారు.

ఇంచుమించు అలాంటి కేసునే అమ్రిత్సర్లో కనుక్కున్నారు. ఒక వ్యక్తి కడుపు నుంచి ఏకంగా 40 కత్తులను వెలికితీశారు. ఆయనకు అక్కడున్న ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేశారు. ఇప్పుడాయన పరిస్థితి బాగానే ఉంది.
మరొక కేసు డాక్టర్లను, ఇంటర్నెట్ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఒక వ్యక్తి నాణేలను, సూదులను, బ్లేడ్లను, గాజు ముక్కలను రోజు మింగేవాడు. ఆ కథాకమామీషేమిటో తెలుసుకుందాం రండి.....

263 నాణేలు వెలికితీశారు
ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం 32ఏళ్ల వయసున్న ఒక మనిషి కడుపులో నుంచి 263 నాణేలను, షేవింగ్ బ్లేడ్లను, సూదులను సర్జరీ చేసి మరీ తీయాల్సి వచ్చింది.

రోగి ఎవరంటే...
మధ్య ప్రదేశ్లో సాత్నా జిల్లాలో సోహ్వాల్ అనే గ్రామంలో మహమూద్ మక్సూద్ అనే వ్యక్తి స్థానిక సంజయ్ గాంధీ ఆసుపత్రిలో తీవ్రమైన కడుపు నొప్పితో చేరాడు. ఆయనకు మూడు గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు.

కడుపునొప్పికి కారణం
నవంబర్ 18న ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో ఆసుపత్రి సిబ్బందికి అనుమానమొచ్చి ఎక్స్ రే తీశారు. అది చూసిన డాక్టర్లు నివ్వెరపోయారు. కడుపులో లోహపు నాణేలతో పాటు ఇతర వస్తువులు ఉన్నాయి. ఇదే కడుపునొప్పికి కారణంగా తేల్చారు.

అక్కడికెలా వెళ్లాయి?
ఒక డాక్టర్ తెలిపిన వివరాల ప్రకారం ఆ వ్యక్తి రహస్యంగా ఈ వస్తువులను మింగేవాడట. అదీ కాకుండా అతడి మానసిక స్థితి ఏమీ బాగాలేదని డాక్టర్లు చెప్పారు. అదృష్టవశాత్తు అన్ని వస్తువులు తిన్నా అతడి కడుపు లోపలి భాగాలకు ఏమీ కాలేదట. ఇవి ఎప్పుడూ తిననని డాక్టర్లకు ప్రమాణం చేశాడు.

చికిత్స ఇలా చేశారు..
మహమూద్ కడుపులోంచి వస్తువులను తీసేందుకు 6 నిష్ణాతులైన వైద్యులు శ్రమపడ్డారు. దాదాపు 5కేజీల వస్తువులు వారు తీశారు. 4 పెద్ద సూదులు, ఒక చెయిన్, 263 నాణేలు, 10 నుంచి 12 షేవింగ్ బ్లేడ్లు, కొన్ని గాజు ముక్కలను వారు కడుపులోంచి తీశారు. ఇలాంటి కేసును చూడటం తమ కెరీర్లోనే తొలిసారని డాక్టర్లు అన్నారు. ఆపరేషన్ను సరైన సమయంలో చేశామని ఒక డాక్టర్ అన్నాడు. అప్పటికే కొన్ని మేకులు లోపలి భాగాన్ని కుచ్చుకొని రక్తం స్రవించిందని చెప్పాడు.

రోగి పరిస్థితేమిటి
ప్రస్తుతానికి రోగి పరిస్థితి బాగుంది, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. సాత్నాలో అతడికి ఇదివరకే చికిత్స జరిగిందని రోగితో సంబంధం ఉన్నావారు చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆయన రేవా అనే పట్టణంలో చికిత్స పొందుతున్నాడు. అతడు 6నెలల నుంచి ఇలాంటి వస్తువులను మింగుతున్నాడని తేలింది.

విచిత్రమైన అలవాటు అతడిది
రోగి తిండి అలవాటుపై అతడి కుటుంబసభ్యులను అడగగా డిప్రెషన్కు గురికాక ముందు లోహపు వస్తువులను తినే వాడని చెప్పారు. అదీ కాక అతడు ఎప్పుడు ఇలా తినేవాడని తమకు చెప్పలేదని అన్నారు. అతడు డ్రైవర్గా పనిచేసేవాడని కస్టమర్లు ఇచ్చిన నాణేలను మింగేవాడని కొందరంటున్నారు.



Click it and Unblock the Notifications











