Latest Updates
-
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026
Maha Shivratri 2023: బడ్జెట్లో జ్యోతిర్లింగాల దర్శనభాగ్యం.. రైల్వే టూర్ ప్యాకేజీ
ప్రముఖ శివాలయాలను, జ్యోతిర్లింగాను దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది.
మహాశివరాత్రి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 18వ తేదీన మహా శివరాత్రి. ఈ రోజుల శివాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడనున్నాయి. ఈ పర్వదినం సందర్భంగా ప్రముఖ శివాలయాలను, జ్యోతిర్లింగాను దర్శించుకోవాలని చాలా మంది కోరుకుంటారు. అలాంటి వారి కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందిస్తోంది.

దేశంలో పర్యాటకాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) భక్తుల కోసం ప్రత్యేక ప్యాకేజీ తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీ 12 రాత్రులు, 13 రోజుల పాటు ఉండనుంది. ఈ టూర్ లో భాగంగా దేశంలోని 12 జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు.

ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు:
1. సోమనాథ్ ఆలయం - గుజరాత్
2. కాశీ విశ్వనాథ్ - వారణాసి
3. మహాకాళేశ్వరుడు - ఉజ్జయిని
4. మల్లిఖార్జున - శ్రీశైలం
5. ఓంకారేశ్వర్ - మధ్యప్రదేశ్
6. కేదర్ నాథ్ - ఉత్తరాఖండ్
7. భీమశంకర్ - మహారాష్ట్ర
8. బైద్యనాథ్ - ఝార్ఖండ్
9. రామనాథస్వామి - తమిళనాడు
10. నాగేశ్వర - గుజరాత్
11. త్రయంబకేశ్వర - మహారాష్ట్ర
12. ఘృష్ణేశ్వర - మహారాష్ట్ర

12 రాత్రులు, 13 రోజుల పాటు టూర్:
భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ) జ్యోతిర్లింగాలను సందర్శించేలా ఈ టూర్ ప్యాకేజీని తీర్చిదిద్దింది. ఈ ప్రయాణంలో ఓంకారేశ్వర్, మహాకాళేశ్వర్, సోమనాథ్, భేట్ ద్వారక, శివరాజ్ పూర్ బీచ్ వంటి ప్రసిద్ధ పుణ్య క్షేత్రాలను చూడొచ్చు. ఐఆర్సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్లు, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ అధికారుల ద్వారా, ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లేవారికి కూడా ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొత్తం టూర్ 12 రాత్రులు, 13 రోజుల పాటు ఉంటుంది.

టూర్ ప్యాకేజీ గురించి ఇతర వివరాలు:
తేదీ: మార్చి 08, 2023 నుండి మార్చి 20, 2023 వరకు
ప్యాకేజీ కోడ్: SZBD384A
ప్యాకేజీ ధర: రూ.15,350
మరింత సమాచారం కోసం www.irctcportal.in పోర్టల్ సందర్శించవచ్చు.
రూ.15,350
సోమనాథ్ ఆలయం - గుజరాత్
కాశీ విశ్వనాథ్ - వారణాసి
మహాకాళేశ్వరుడు - ఉజ్జయిని
మల్లిఖార్జున - శ్రీశైలం
ఓంకారేశ్వర్ - మధ్యప్రదేశ్
కేదర్ నాథ్ - ఉత్తరాఖండ్
భీమశంకర్ - మహారాష్ట్ర
బైద్యనాథ్ - ఝార్ఖండ్
రామనాథస్వామి - తమిళనాడు
నాగేశ్వర - గుజరాత్
త్రయంబకేశ్వర - మహారాష్ట్ర
ఘృష్ణేశ్వర - మహారాష్ట్ర
భారత్ గౌరవ్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్



Click it and Unblock the Notifications