Latest Updates
-
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
Republic Day 2022:చరిత్ర తిరగరాసిన నారీమణులు.. ఫ్లై పాస్ట్ ను లీడ్ చేసిన ఫస్ట్ లేడీ పైలట్ స్వాతి రాథోడ్
రిపబ్లిక్ డే 2022 సందర్భంగా తొలి ఐఎఎఫ్ పైల్ స్వాతి రాథోడ్ గురించి ఆసక్తికరమైరమైన విషయాలను తెలుసుకుందాం.
జనవరి 26వ తేదీ అంటే గణతంత్ర దినోత్సవ(Republic Day) వేడుకలు జరుపుకునే రోజు అని మనందరికీ తెలుసు. ఇదే ప్రత్యేకమైన విషయం అంటే.. అంతకంటే ప్రత్యేకంగా ఎప్పుడూ గుర్తుంచుకునేలా ఈరోజును మార్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు మన మహిళా పైలట్లు, జవాన్లు.

చరిత్రలోనే తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత వైమానిక దళం(IAF)లో పనిచేస్తున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ ఫ్లైపాస్ట్ కు నాయకత్వం వహించారు. ఇలా నాయకత్వం వహించిన వారిలో తొలి మహిళా పైలట్ గా స్వాతి రాథోడ్ చరిత్రలో నిలిచిపోయారు. ఇది మహిళలందరికీ స్ఫూర్తినివ్వడమే కాదు.. వారి సామర్థ్యాన్ని, ప్రతిభను కూడా గుర్తించినట్లు అవుతుంది. స్వాతి రాథోడ్ ఈ స్థాయికి చేరడానికి తన తండ్రి చేయించిన సాధన.. ఆ సాధనతోనే తాను ఎంతగానో ప్రేరణ పొందినట్లు స్వాతి చెబుతున్నారు.

ఈ సందర్భంగా స్వాతి రాథోడ్ తండ్రి మాట్లాడుతూ 'నా కుమార్తె ఈరోజు నన్ను తల ఎత్తుకునేలా చేసింది. తను కన్న కలలు సాకారం కావడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనందంతో నేను ఉబ్బితబ్బిబ్బవుతున్నాను. నాకు మాటలు రావడం లేదు, నాకు చాలా గర్వంగా ఉందని' స్వాతి తండ్రి భావ్నాని సింగ్ రాథోడ్ అన్నారు.
స్వాతి గురించి చెబుతూ.. తను రాజస్థాన్ రాష్ట్రంలోని నాగ్ పూర్ జిల్లాలో జన్మించిందని.. రాజస్థాన్ లోని అజ్మీర్ పాఠశాలలో తన విద్యను పూర్తి చేసినట్లు తెలిపారు. తన చిన్నతనం నుండే గొప్ప దేశభక్తురాలు. అప్పట్లో పాఠశాలలో నిర్వహించిన పెయింటింగ్ పోటీల్లో, ఆమె జాతీయ జెండాను గీసి, భారతదేశంపై ఉన్న తన ప్రేమను చాటుకుందని గుర్తు చేశారు.
స్వాతి రాథోడ్ సాధించిన ఈ ఘనతను చూసి మేము చాలా గర్వపడుతున్నాం. స్వాతి సాధించిన ఈ విజయం వల్ల దేశంలోని ఇతర మహిళలకు సాధికారత సాధించేందుకు ప్రేరణగా నిలుస్తుందని తాము ఆశిస్తున్నామని స్వాతి పేరేంట్స్ చెప్పారు.
చరిత్రలోనే తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా భారత వైమానిక దళం(IAF)లో పనిచేస్తున్న ఫ్లైట్ లెఫ్టినెంట్ స్వాతి రాథోడ్ ఫ్లైపాస్ట్ కు నాయకత్వం వహించారు. ఇలా నాయకత్వం వహించిన వారిలో తొలి మహిళా పైలట్ గా స్వాతి రాథోడ్ చరిత్రలో నిలిచిపోయారు. ఇది మహిళలందరికీ స్ఫూర్తినివ్వడమే కాదు.. వారి సామర్థ్యాన్ని, ప్రతిభను కూడా గుర్తించినట్లు అవుతుంది. స్వాతి రాథోడ్ ఈ స్థాయికి చేరడానికి తన తండ్రి చేయించిన సాధన.. ఆ సాధనతోనే తాను ఎంతగానో ప్రేరణ పొందినట్లు స్వాతి చెబుతున్నారు.



Click it and Unblock the Notifications