Just In
- 1 hr ago ఈరోజు ప్రేమసంబంధాలు ఏ రాశివారికి ఎలా ఉన్నాయంటే..!
- 5 hrs ago Gajalakshmi Rajayoga: 12 ఏళ్ల తర్వాత మేషరాశిలో గజలక్ష్మి రాజయోగంతో ఈ 3 రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
- 6 hrs ago ఈరోజు రాశి ఫలాలు: ఈ రాశుల వారు డబ్బు విషయాల గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి...
- 16 hrs ago మీరు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ భాగస్వామితో కలిసి ఈ పని చేయండి, వారు రోజంతా హ్యాపీగా ఉంటారు
Bhavina Patel:వీలై ఛైర్ నుండి పారాలింపిక్స్ పతకం వరకు భవీనా పటేల్ ప్రస్థానమిలా...
భవీనా పటేల్ ఎవరు? టోక్యో ఒలింపిక్స్ లో భారత్ తరపున రజతం సక్సెస్ సాధించిన స్టోరీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ భారతదేశం తరపున పసిడి అంచుల దాకా వెళ్లి పోరాడి ఓడింది టేబుల్ టెన్నిస్ ప్లేయర్ భవీనా పటేల్.
అయితే భారతదేశం తరపున తొలి రజత పతకం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. టేబుల్ టెన్నిస్ లో ఎవ్వరూ ఊహించని విధంగా ఫైనల్ లోకి ప్రవేశించింది. అంతకుముందు చైనాకు చెందిన మియావో జంగ్ పై శనివారం రోజున సెమీ ఫైనల్ పోరులో గెలిచింది. దాని కంటే ముందు ప్రీక్వార్టర్స్ లో బ్రెజిల్ కి చెందిన ఒలివెరా, క్వార్టర్స్ లో సెర్బియాకి చెందిన రాంకోవిచ్ లను అలవోకగా ఓడించింది.
ఒలివెరా తొమ్మిదో ర్యాంకులో ఉన్నప్పటికీ.. తను డిపెండింగ్ ఛాంపియన్ అయినా తనపై ఆధిపత్యం చెలాయించింది. అయితే ఫైనల్లో భారీ అంచనాలతో అడుగు పెట్టడంతో కొంత ఒత్తిడికి గురైంది. యింగ్ జావోతో క్లాస్-4 ఉమెన్స్ సింగిల్స్ ఫైనల్లో ఓడిపోయింది. అయితే మన దేశం తరపున టేబుల్ టెన్నిస్ విభాగంలో రజత పతకం సాధించింది. దేశ ప్రథమ పౌరుడు రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోడీతో పాటు దేశ్యాప్తంగా భవీనాను అభినందిస్తూ ట్వీట్ల మోత మోగింది. ఈ సందర్భంగా భవీనా పటేల్ ఎవరు? వీల్ చైర్ నుండి పారాలింపిక్స్ పతకం వరకు తన ప్రస్థానంలోని కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం...
చిన్నతనంలోనే
పోలియో...
గుజరాత్
రాష్ట్రంలోనిన
మెహసానాకు
చెందిన
34
ఏళ్ల
భవీనా
చిన్నతనంలోనే
పోలియో
సోకడంతో
కాళ్లు
చచ్చుబడిపోయాయి.
ఆ
సమయంలో
ఆర్థిక
పరమైన
ఇబ్బందుల
వల్ల
తను
పూర్తిగా
చికిత్స
చేయించలేకపోయింది.
అయితే
నాలుగు
సంవత్సరాల
వయసులో
ఒక
ఆపరేషన్
చేయించుకుంది.
అయితే
దురద్రుష్టవశాత్తు
అది
సక్సెస్
కాలేదు.
ఆ
తర్వాత
తన
జీవితమంతా
వీల్
ఛైర్
కే
అంకితమవ్వాల్సి
వచ్చింది.
టేబుల్
టెన్నిస్
లో..
తనకు
పోలియో
వచ్చింది
తను
ఏ
మాత్రం
వెనుకడుగు
వేయలేదు.
తనకు
ఇష్టమైన
టేబుల్
టెన్నిస్
ఆడటం
ప్రారంభించింది.
అహ్మదాబాద్
లోని
ITI
నుండి
కంప్యూటర్
సైన్స్
కోర్సులో
చదువుతున్నప్పుడు,
తనకు
ఎంతగానో
ఇష్టమైన
టేబుల్
టెన్నిస్
లో
శిక్షణ
తీసుకోవడం
ప్రారంభించింది.
అయితే
అతి
కష్టమ్మీద
ట్రైనింగ్
కోసం
ఆటో
మరియు
బస్సులల్లో
వెళ్లాల్సి
వచ్చింది.
ఇలాంటి
సమయంలో
తన
భర్త
నికుల్
పటేల్
ను
తనకు
మద్దతుగా
నిలిచారు.
అయితే
విదేశీ
పర్యటనల
సమయంలో
భవీనా
మరిన్ని
సమస్యలు
ఎదుర్కోవాల్సి
వచ్చిందట.
పివి సింధు సరికొత్త రికార్డు.. ఆ ఘనత సాధించిన తొలి తెలుగమ్మాయి..
ఒత్తిడిని జయించడం..
తొలి రోజుల్లో ఫిట్ నెస్ కోసం సరదాగా టేబుల్ టెన్నిస్ స్టార్ట్ చేసిన భవీనా, తర్వాత అదే గేమ్ ని తన కెరీర్ గా ఎంచుకుని కష్టపడింది. ఒత్తిడిని జయించడం.. మొదట్లో వెనుకబడినా పుంజుకోవడాన్ని బాగా అలవాటు చేసుకుంది. మొత్తానికి పారాలింపిక్స్ లో పతకం గెలిచిన భారత రెండో మహిళా అథ్లెట్ గా అరుదైన ఘనత సాధించింది. 2016 సంవత్సరంలో దీపా మాలిక రజత పతకం సాధించిన విషయం తెలిసిందే.
2011లో
ఛాంపియన్
గా
గుర్తింపు..
2011
సంవత్సరంలో
టేబుల్
టెన్నిస్
థాయ్
లాండ్
లో
టోర్నమెంట్లో
ఛాంపియన్
షిప్
గెలుచుకోవడం
ద్వారా
భవీనా
తన
కెరీర్లో
తొలిసారి
అతిపెద్ద
విజయాన్ని
సాధించింది.
అప్పుడే
ఆమెకు
దేశవ్యాప్తంగా
గుర్తింపు
వచ్చింది.
ఆ
తర్వాత
2013
సంవత్సరంలో
అక్టోబర్
నెలలో
బీజింగ్
ఆసియా
పారా
టేబుల్
టెన్నిస్
ఛాంపియన్
షిప్
మహిళల
సింగిల్స్
క్లాస్-4
ఈవెంట్లో
రజత
పతకం
సాధించి
కొత్త
హిస్టరీ
క్రియేట్
చేసింది.
2017
సంవత్సరంలో
ఆసియా
పారా
టేబుల్
టెన్నిస్
ఛాంపియన్
షిప్
లో
భవీనా
కాంస్య
పతకాన్ని
సైతం
కైవసం
చేసుకుంది.
అయితే
అనుకోని
కారణాల
వల్ల
రియో
ఒలింపిక్స్
లో
భవీనా
అర్హత
సాధించలేకపోయింది.
అయితే
టోక్యో
ఒలింపిక్స్
లో
రజత
పతకం
సాధించడం
ద్వారా,
ప్రతి
ఒక్కరూ
కష్టపడితే
కచ్చితంగా
విజయం
సాధించగలరని..
ఉన్నత
శిఖరాలను
చేరుకోగలమని
భవీనా
నిరూపించింది.