Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
స్టార్ హీరోయిన్ను చంపేసిన కప్ప.. భయంకరమైన ఈ నిజం తెలిస్తే మీ గుండె ఆగిపోతుంది!
ఈ భూమిపై ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎన్నో జీవ చరాలు, విషపూరితమైన వింత జీవ రాశులు ఈ భూమిపై నివశిస్తున్నాయి. మరీ ముఖ్యంగా అమెజాన్ అడవుల్లో ఇలాంటి రహస్యమైన జీవ జంతువులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి. అయితే ఓ నటి అమెజాన్ అడవుల్లోని కప్ప కారణంగా మృతి చెందడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కప్ప కారణంగా నటి ఎలా చనిపోయింది, దానికి కారణాలు ఏంటి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎవరీ నటి?
మెక్సికోకు చెందిన ఆ నటి పేరు మార్సెలా అల్కాజర్ రోడ్రిగ్జ్. ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్లో నటించారు. పలు విధమైన సినిమాల్లో కూడా వివిధ రకాల చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఈ నటి ఇటీవల దక్షిణ అమెరికాలో నిర్వహించిన ఓ సాంప్రదాయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సాంప్రదాయకమైన పద్దతిలో కప్పు నీటిని తాగడంతో పాటు శరీరంపై ట్యాటూలు వేసుకొని కప్పు శ్లేస్మాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ప్రమాదకరమైనప్పటికీ అమెజాన్ అడవుల లాంటి కొన్ని ప్రదేశాల్లో దీనిని ఇప్పటికీ పాటిస్తారు?

ఎలా చనిపోయింది?
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులు కాంబో అనే విషపూరితమైన కప్పు నీటిని తాగాల్సి ఉంటుంది. ఇది చాలా విషపూరితమైనది. దీనిని తాగడం వల్ల శరీరంలోని రోగాలు నయమవుతాయని, టాక్సిన్స్ దూరమవుతాయని అక్కడి వ్యక్తులు విశ్వసిస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వ్యక్తులకు ముందుగా కప్పు నుంచి వచ్చిన ఒక లీటర్ నీటిని తాగిస్తారు. ఆ తరువాత శరీరంపై ట్యాటూలు వేసి, కప్పు శ్లేస్మాన్ని రాస్తారు.
ఈ పద్దతిలోనే ఆ నటికి కూడా ముందుగా ఒక లీటర్ కప్పు నీటిని తాగించారు. ఆ తరువాత శరీరంపై ట్యాటూలు వేశారు. అనంతరం కప్పు శ్లేస్మాన్ని పూశారు. ఈ శ్లేస్మం కప్పు రసం, బురదతో తయారు చేస్తారు. ఇలా చేసిన తరువాత ఆ నటి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
కప్పు నీటి విషం శరీరంలోకి పూర్తిగా ఇంకిపోయింది. దీని కారణంగా ఆ నటికి వాంతులు విరేచనాలు కావడం మొదలయ్యాయి. గుండె కొట్టుకోవడం ఎక్కువయ్యింది. బీపీ పెరిగిపోయింది. ఊపిరి తిత్తులు చెడిపోయాయి. రక్త ప్రసరణ తగ్గిపోవడంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. అలాగే ఆ నటి పూర్తిగా వాసిపోయింది. కేవలం ఒక్క అరగంటలోనే ఆమె తన చావును చూసేసింది. ఈ లక్షణాలు కనిపించిన అరగంటలోపు ఆసుపత్రికి తరలిస్తే ప్రమాదం తప్పుతుంది. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోవడంతో ఆ నటి చనిపోయింది.
ఈ విధంగా ఆ నటి తన ప్రాణాలను వీడాల్సి వచ్చింది. ఎంత సాంప్రదాయకమైన కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా కాదని ఏది పడితే అది తాగడం తినడం చేస్తే ఈ నటి లాగానే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇలాంటి సాంప్రదాయకమైన పాల్గొనే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ఉత్తమం.



Click it and Unblock the Notifications