మోడీ 3.O పుస్తకం రిలీజ్.. హ్యాట్రిక్ కొడతాడంటున్న రచయిత ప్రదీప్ భండారి..

జాతీయ మీడియాలో ప్రముఖ జర్నలిస్ట్, జీ మీడియా నెట్వర్క్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్న ప్రదీప్ బండారి ప్రధాని మోడీపై మోడీ3.O అనే పుస్తకాన్ని తాజాగా లాంచ్ చేశారు. లోక్‌సభ ఎన్నికలకు మరి కొన్ని రోజులే ఉండడం మోడీ 3.o టైటిల్‌తో పుస్తకం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఈ పుస్తకం గురించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.

Modi 3 O book launched by writer journalist pradeep bhandari

హ్యాట్రిక్‌తో మోడీ

ప్రధాని మోదీ ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చి మరోసారి మోడీ హ్యాట్రిక్ కొట్టనున్నట్లు ఈ పుస్తకంలోని రచయిత ప్రదీప్ భండారి సూక్ష్మంగా వివరించారు. ప్రజలెందుకు ప్రధాని మోడీని పదేపదే గెలుపుస్తున్నారనే అంశాలపై ఆయన సుదీర్ఘంగా రచించారు.

రచయిత ప్రదీప్ బండారీ జన్‌కీబాత్ అనే ఎన్నికలకు సంబంధించిన సర్వే సంస్థను స్థాపించి ఎడిటర్‌గా కూడా పనిచేస్తున్నారు. 2016 లోక్‌సభ ఎన్నికల్లో ప్రదీప్ బండారీ 400ల లోక్‌సభ స్థానాలపై సర్వే చేసి ఎన్నికల ఫలితాలను ముందుగానే రిపోర్ట్ చేశారు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ 98 శాతం సరైందని తరువాత వచ్చిన ఫలితాలు నిరూపించాయ్. రిపబ్లిక్ మీడియా, ఇండియా న్యూజ్ మీడియా సంస్థల్లో కూడా ప్రదీప్ బండారీ గతంలో పనిచేశారు.

మోడీ 3.O

మోడీ 3.O పుస్తక రచయిత ప్రదీప్ భండారి ఇదివరకే ప్రధాని మోడీకి సంబంధించిన ఎన్నికలపై 2020లో "మోడీ మ్యాండేట్ 2019" అనే పుస్తకాన్ని ప్రచురించారు. గ్రౌండ్ జీరోలోకి వెళ్లి ఈ పుస్తకంలోని అంశాలు రచించినట్లు చెప్పరు. ఇప్పుడు మోడీపై ఎన్నికల సర్వేపై తన రెండవ పుస్తకంగా మోడీ3.O ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ పుస్తకం ఆంగ్లం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. త్వరలోనే అన్ని భారతీయ భాషల్లో రానున్నట్లు తెలిపారు.

ప్రధాని మోడీ మరోసారి హ్యాట్రిక్ ఎలా సాధించనున్నారో తెలుసుకోవాలంటే ఈ పుస్తకాన్ని చదవాల్సిందేనని అంటున్నారు పుస్తక రచయిత ప్రదీప్ బండారి. ఆన్‌లైన్ అమెజాన్‌లో 216 పేజీలతో రూ.395లకు అందుబాటులో ఉంది.

ప్రదీప్ బండారి ఇప్పటి వరకు 39 ఎన్నికల ఫలితాలను ముందుగానే 98 శాతం విజయవంతంగా ప్రెడిక్ట్ చేశారు. రాబోయే 2024 లోక్‌సభ ఎన్నికలను కూడా అలాగే ప్రెడిక్ట్ చేసినట్లు అదంతా ఈ పుస్తకంలోనే ఉందంటున్నారు ప్రముఖ జర్నలిస్ట్ రచయిత ప్రదీప్ బండారి

Story first published: Monday, April 15, 2024, 11:52 [IST]
Desktop Bottom Promotion