Latest Updates
-
ఎప్పుడూ ఒకేలా కాకుండా..బ్యాచిలర్స్ కూడా మెచ్చే స్పైసీ టమాటో ఎగ్ కర్రీ! -
మీ లివర్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది ఈజీగా తెలుసుకోండిలా! -
ఈ ఐదు రాశుల వారిపై శని వక్ర గమనం తీవ్ర ప్రభావం.. డిసెంబర్లో ఈ తేదీ వరకు కష్టాలు తప్పవు.! -
మ్యాగీ ఎప్పుడూ వేడివేడిగానేనా? ఒకసారి ఈ చల్లని మ్యాగీ రైతా ట్రై చేయండి! -
చంకభాగాల్లో నలుపుతో స్లీవ్లెస్ వేసుకోలేకపోతున్నారా.. ఈ సింపుల్ టిప్స్తో ఇక ఆ సమస్యే ఉండదు.! -
మీ భార్యతో ఆ సమయంలోనే ప్రేమగా ఉంటున్నారా.. అది ఎంత పెద్ద తప్పో తెలుసా.? -
కత్రినా కైఫ్ నాజూకైన అందం వెనుక ఉన్న స్పెషల్ డ్రింక్ ఇదే..ఎలా చేసుకోవాలంటే.. -
కిడ్నీల పనితీరు బాగాలేదని తెలిపే ఐదు హెచ్చరిక సంకేతాలు.. వీటిని నిర్లక్ష్యం చేస్తే అంతే.! -
కొందరికి ఫ్రెండ్స్ ఎందుకు ఉండరు? దీని వెనుక ఉన్న సైకాలజీ ఇదే! -
వర్షాకాలంలో వీటిని మాత్రమే తింటే సరిపోదు.. బీపీ, డయాబెటిస్ రోగులకు మేలు చేసే సూపర్ ఫుడ్స్.!
రేపే ఆషాఢ పౌర్ణమి.. ఈ చెట్టును పూజించినట్లయితే కష్టాలు తొలగి లక్ష్మీదేవి కటాక్షం.!
తెలుగు సంప్రదాయంలో ఆషాఢ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, బోనాలు.. ఇలా ఒకటేమిటి ఈ మాసమంతా ప్రజలు ఆధ్యాత్మిక భావనలో మునిగిపోతారు. ఇక రేపు ఆషాఢ పౌర్ణమి కావడంతో ఆ రోజున దానధర్మాలు, పుణ్యకార్యాలు, పూజలకు ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా విష్ణుమూర్తి, లక్ష్మీ దేవిల ఆశీస్సులు పొందడానికి ఇది శుభ సమయం. ఈ క్రమంలో ఆషాఢ పౌర్ణమి రోజు రావి చెట్టును పూజించినట్లయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.

రావి చెట్టులో దేవతలు నివసిస్తారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే దోష పరిహారాలకు, సుఖశాంతుల కోసం రావిచెట్టును పూజించినట్లయితే ప్రయోజనం ఉంటుందని నమ్ముతారు. ఈ క్రమంలో జులై 29న ఆషాఢ పౌర్ణమి సందర్భంగా రావి చెట్టును పూజించి దీపం వెలిగించడం ద్వారా కుటుంబంలో ప్రతికూలత తొలగి సానుకూలంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు.
హిందూ మత సంప్రదాయం ప్రకారం రావి చెట్టు చాలా పవిత్రమైనది. రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటారని.. ఆషాఢ పౌర్ణమి రోజున రావిచెట్టు కింద దీపం వెలిగించి, నీరు సమర్పించినట్లయితే ఇంటికి శాంతి, సంతోషం కలుగుతాయని పండితులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు తొలగి జీవితంలో శ్రేయస్సు కలుగుతుందని చెబుతున్నారు.
ఆషాఢ పౌర్ణమి రోజు రావిచెట్టును పూజించడం వల్ల ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడి, జీవితంలో కష్టాల తొలగిపోతాయి. ఆర్థిక శ్రేయస్సు మెరుగుపడుతుంది. రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మనసులోని నిస్వార్థమైన కోరికలు నెరవేరుతాయి.

పూజా విధానం
ఆషాఢ పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలోనే తలంటు స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో పూజ అనంతరం రావి చెట్టు వద్దకు వెళ్లి విష్ణుమూర్తిని ధ్యానిస్తూ జలాభిషేకం చేయాలి. నెయ్యు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. మనసులోని కోరికను తెలియజేయాలి. మీ శక్తి, బడ్జెట్ మేరకు పేదలకు దానం చేయడం కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తుంది.
రావి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా చీకట్లు పారద్రోలి, జీవితంలో సానుకూల శక్తి వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఉదయం లేదా సాయంత్రం ఇలా దీపాలు వెలిగించడం మంచిది. పేదలకు ఆహారం, దుస్తులు, నిత్యావసర వస్తువులను మీ శక్తి మేరకు దానం చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా పుణ్యం కలిగి, జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు సిద్ధిస్తుందని పండితులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications