Latest Updates
-
నోరూరించే దహీ ఇడ్లీ.. ఈ సమ్మర్ లో మీ ఫ్యామిలీకి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..ఎలా చేసుకోవాలంటే.. -
ఒక రోజులో ఎంత బీరు తాగితే సేఫ్? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన చేదు నిజం! -
కేవలం 5 నిమిషాల్లో ఇంట్లోనే టేస్టీ ద్రాక్ష రసం..ఎలా తయారు చేసుకోవాలంటే.. -
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
National Mathematics Day 2022: 'అనంతం' గురించి తెలిసిన వ్యక్తి తను, శ్రీనివాస రామానుజన్ మామూలోడు కాదు
ఈరోజు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస రామానుజన్కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
ఈరోజు గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ 145వ జయంతిని పురస్కరించుకుని మనం జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 2012లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రామానుజన్ చేసిన సేవలను గుర్తించేందుకు డిసెంబర్ 22న జయంతిని నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా ప్రకటించారు. సంఖ్యా సిద్ధాంతం, గణిత విశ్లేషణకు రామానుజన్ ఎంతో కృషి చేశారు.

ఈరోజు జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శ్రీనివాస రామానుజన్కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
* శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887న తమిళనాడులోని ఈరోడ్లో బ్రాహ్మణ అయ్యంగార్ కుటుంబంలో జన్మించారు. ఆయన చాలా చిన్న వయస్సులోనే గణితంపై ఇష్టాన్ని పెంచుకున్నారు. 12 సంవత్సరాల వయస్సులో త్రికోణమితిపై పట్టు సాధించారు. కుంభకోణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో స్కాలర్షిప్కు అర్హత సాధించారు.
* శ్రీనివాస రామానుజన్కు గణితం తప్ప మరో సబ్జెక్టు అంటే అంతగా ఇష్టం ఉండేది కాదు. వాటిని పట్టించుకునే వారు కాదు. అలా పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.
* 1912లో రామానుజన్ మద్రాసు పోర్ట్ ట్రస్ట్లో గుమాస్తాగా పని చేశారు. అక్కడే రామానుజన్ ఓ గణిత మేధావి అని తన సహచరులు గుర్తించారు. వారిలో ఒకరు ఆయనను కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కాలేజీ ప్రొఫెసర్ జీహెచ్ హార్డీకి సూచించారు. ఆయన 1913లో హార్డీని కలిసి ఆ తర్వాత ట్రినిటీ కాలేజీలో చేరారు.

* ప్రొఫెసర్ హార్డీతో కలిసి రామానుజన్ ఎన్నో పత్రాలు ప్రచురించారు. వీరిద్దరు పలు ఉమ్మడి ప్రాజెక్టులకు కూడా సహకరించారు.
* రామానుజన్ 1917లో లండన్ మ్యాథమెటికల్ సొసైటీకి ఎన్నికయ్యారు. మరుసటి ఏడాది, ఎలిప్టిక్ విధులు, సంఖ్యల సిద్ధాంతంపై పరిశోధన కోసం ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీకి ఎంపికయ్యారు. ట్రినిటీ కాలేజీకి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు కూడా ఆయనే.
* ఎలాంటి అధికారిక శిక్షణ లేనప్పటికీ రామానుజన్ అనంత శ్రేణి, నిరంతర భిన్నాలు, సంఖ్య సిద్ధాంతం మరియు గణిత విశ్లేషణ అభివృద్ధి చేశారు.

* ఆయన హైపర్జియోమెట్రిక్ సిరీస్, రీమాన్ సిరీస్, ఎలిప్టిక్ ఇంటెగ్రల్స్, డైవర్జెంట్ సిరీస్ సిద్ధాంతం, జీటా ఫంక్షన్ యొక్క ఫంక్షనల్ ఈక్వేషన్లు వంటి ముఖ్యమైన రచనలు చేశారు. ఆయన తన స్వంత సిద్ధాంతాలను కనిపెట్టారు. స్వతంత్రంగా 3,900 ఫలితాలను సంకలనం చేశారు.
* 1919లో రామానుజన్ భారతదేశానికి తిరిగి వచ్చారు. ఒక సంవత్సరం తర్వాత, ఏప్రిల్ 26న, ఆయన ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 32 సంవత్సరాలు.
* రాబర్ట్ కనిగెల్ రచించిన ఆయన జీవిత చరిత్ర 'ది మ్యాన్ హూ నో ఇన్ఫినిటీ' రామానుజన్ జీవితాన్ని, సాధించిన గొప్ప కీర్తి గురించి చెప్పారు.
* 2015లో అదే పేరుతో ఒక చిత్రం విడుదలైంది. ఇందులో రామానుజన్ పాత్రలో బ్రిటిష్-ఇండియన్ నటుడు దేవ్ పటేల్ నటించారు. ఈ చిత్రం భారతదేశంలో రామానుజన్ బాల్యం, బ్రిటన్లో ఆయన గడిపిన కాలం, గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు కావడానికి ఆయన ప్రయాణాన్ని కళ్లకు కట్టేలా చూపించారు.

రామానుజన్ ప్రత్యేకత ఏంటంటే..
31 సంవత్సరాల వయస్సులోనే రామానుజన్ రాయల్ సొసైటీకి ఎంపికయ్యారు. అతిపిన్న వయస్సులో ఎంపికైన వ్యక్తిగా నిలిచారు. రామానుజన్ ఎలిప్టిక్ ఫంక్షన్స్, థియరీ ఆఫ్ నంబర్స్లో పరిశోధనలతో ఆయన ఎంపికయ్యారు. 13 అక్టోబరు 1918న, కేంబ్రిడ్జ్లోని ట్రినిటీ కాలేజీకి ఫెలోగా ఎన్నికైన మొదటి భారతీయుడు కూడా ఆయనే కావడం విశేషం.
రామానుజన్ ఏం కనిపెట్టారంటే..
రామానుజన్ నంబర్: 1729 అనేది 10, 9 రెండు సంఖ్యల ఘనాల మొత్తాన్ని రామానుజన్ సంఖ్య అని పిలుస్తారు. సర్కిల్ పద్ధతి: రామానుజన్, GH హార్డీతో కలిసి, 200 కంటే ఎక్కువ సంఖ్యల విభజన యొక్క మొదటి అప్రాక్సిమేషన్స్ అందించిన సర్కిల్ పద్ధతిని కనుగొన్నారు.
ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎవరో తెలుసా..
ప్రపంచ గణిత పితామహుడు: ఆర్కిమెడిస్
భారత గణిత పితామహుడు: ఆర్యభట్ట
కింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్: శ్రీనివాస రామానుజన్
గణితాన్ని కనిపెట్టింది ఎవరో తెలుసా..
లిఖిత గణితానికి సంబంధించిన తొలి ఆధారం మెసొపొటేమియాలో తొలి నాగరికతను నిర్మించిన పురాతన సుమేరియన్ల నాటిది. వారు 3000 BC నుండి సంక్లిష్టమైన మెట్రాలజీని అభివృద్ధి చేశారు.



Click it and Unblock the Notifications











