సనాతన ధర్మ టూర్ కి బయల్దేరిన ఏపీ డిప్యూటీ సీఎం..పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది!..ఫొటోలు చూడండి

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సనాతన ధర్మ పరిరక్షణ యాత్ర భాగంగా ఇవాళ హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి కొచ్చికి బయలుదేరారు. హైందవ ధర్మ పరిరక్షణ కోసం పర్యటన చేపట్టిన పవన్..నేటి నుంచి నాలుగు రోజుల పాటు కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను ఆయన దర్శించుకోనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ కేరళ ఆర్థిక రాజధాని కొచ్చిన్‌ కు బయల్దేరి వెళ్లారు. కొచ్చి దగ్గర్లోని శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని సందర్శించి తర్వాత తిరువనంతపురం వెళ్లి అనంత పద్మ నాభ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.

సనాతన ధర్మ యాత్రలో భాగంగా తమిళనాడు రాష్ట్రంలోని మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర దేవాలయం, స్వామిమలైయ్, తిరుత్తై సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయాలను కూడా పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. కొంతకాలంగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా తిరుపతి లడ్డూ కల్తీ ఇష్యూ అప్పటినుంచి ఆయన సతాన ధర్మం గురించి చేస్తున్న వ్యాఖ్యలు హైలెట్ అవుతున్నాయి. తిరుపతి లడ్డూ వివాదం వేళ పవన్ కల్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు డిమాండ్ తెర మీదకు తెచ్చారు. దేశ వ్యాప్తంగా పవన్ డిమాండ్ కు మద్దతు లభించింది.

Pawan kalyan andhra pradesh deputy cm started 3 days sanatan dharma tour

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసమే

హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా అడుగులు వేస్తున్న పవన్ ఇందు కోసం మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఐదు రోజుల పాటు దక్షిణ భారత దేశంలోని ప్రముఖ ఆలయాలను సందర్శించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ స్కెచ్ లో భాగమా?

అయితే ఇదంతా బీజేపీ స్కెచ్ లో భాగమేనని, ఏపీ డిప్యూటీ సీఎం సనాతన ధర్మ టూర్ వెనక బీజేపీ వ్యూహం ఉంది అనే వాదన వినిపిస్తోంది. ఎన్డీఏలో భాగ స్వామిగా ఉన్న పవన్..కమలం పార్టీ పెద్దల ఆదేశాలతోనే ఈ టూర్ పెట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు,పవన్ కళ్యాణ్ ముందుగా అనుకున్న మొక్కులను తీర్చుకునేందుకు ఈ పర్యటన చేపట్టాలని కొందరు చెబుతున్నారు.

జమిలి ఎన్నికల దిశగా మోదీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దక్షిణాదిన ఏపీలో మినహా.. మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేదు. ఏపీలోనూ కూటమి భాగస్వామిగా ఉంది. దక్షిణాదిలో ఎంతో కాలంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ కర్ణాటకకు మాత్రమే పరిమితం అయింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలు అప్పగించేలా కసరత్తు జారుగుతోందని రాజకీయ వర్గాలు నుంచి సమాచారం.

Desktop Bottom Promotion