Just In
- 6 min ago చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- 3 hrs ago Bhagavad Gita Slokas : భగవద్గీతలోని ఈ శ్లోకాలు జీవితానికి చాలా అవసరం..!
- 4 hrs ago పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- 4 hrs ago మేషరాశిలో శుక్రుడి సంచారం ఈ రాశుల వారు భోగభాగ్యాలతో విలాసవంతమైన జీవితం గడుపుతారు
'బిగ్ బాస్-2'లో వారి రొమాన్స్ నిజమేనా? నాని అందుకే అలా అంటున్నాడా? బూతులు, ముద్దులు, రొమాన్స్
హౌజ్లో మొదటి రోజు నుంచి సామ్రాట్, తేజస్విని మధ్య ఏదో నడుస్తుంది అనే అనుమానం ప్రేక్షకులలో కలిగింది.'బిగ్ బాస్-2'లో వారి రొమాన్స్ నిజమేనా? నాని అందుకే అలా అంటున్నాడా? బిగ్ బాస్-2, బిగ్ బాస్,
తెలుగు బుల్లితెరపై ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఏంటంటే బిగ్బాస్. సీజన్ 1 గ్రాండ్ సక్సెస్ కావడంతో నిర్వాహకులు ఇటీవలే రెండో సీజన్ ప్రారంభించారు. బిగ్ బాస్ సీజన్ 2లో ఎంటర్టైన్మెంట్ డోస్ పెరుగుతోంది. నాని చెప్పినట్టు రోజు రోజుకీ ఇంకొంచెం మసాలా దట్టిస్తున్నారు.
16 మంది సెలబ్రిటీలు.. 100 రోజులు.. ఇంకాస్త మసాలా.. ఏదైనా జరగొచ్చు.. అంటూ జూన్ 10 ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 2 సక్సెస్ఫుల్గా కొనసాగుతూనే ఉంది. ఇక శని, ఆదివారాల్లో నేచురల్ స్టార్ నాని తనదైన శైలి హోస్టింగ్తో ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
బాగానే ఫర్మామెన్స్ చేస్తున్నారు
బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న వారు కూడా ప్రస్తుతం బాగానే ఫర్మామెన్స్ చేస్తున్నారు. దీప్తి సునైనా, గీతా మాధురి, తేజస్వి మదివాడ, యాంకర్ శ్యామల , తనీష్, సామ్రాట్, బాబు గోగినేని, గణేశ్, నందిని, దీప్తి, రోల్ రైడా, అమిత్, భాను, కౌశల్ తదితరులు బాగానే వారి వారి వ్యక్తీకరణలతో ఆకట్టుకుంటున్నారు.
బూతులు ఊరికే రావు
అయితే కొన్ని రోజుల క్రితం దీప్తి సునైనాపై ఒక జ్యూయిలర్స్ యాడ్లో చెప్పిన మాదిరిగా ‘డబ్బులు ఊరికే రావు' అన్న క్యాప్షన్ను మార్చి ‘బూతులు ఊరికే రావు' అని క్యాప్షన్ తగిలించి వివరీతంగా ట్రోల్ చేశారు. ఇలాంటి ట్రోల్స్ కేవలం దీప్తి సునైనాపైనే కాదు బిగ్ బాస్ హౌస్ లోని అందరిపై కొనసాగుతున్నాయి.
చుట్టూ కెమెరాలు రెప్పలార్పకుండా ఉన్నా
ఇక బిగ్బాస్ రియాల్టీ షోలో రొమాన్స్ కామన్ ఫ్యాక్టర్ అయిపోయినట్టుంది. భిన్న ధుృవాలు ఆకర్షించుకుంటాయన్న సూత్రంలా... హౌస్లో ఉన్న ఆడ- మగ ఒకరికొకరు ఠక్కున కనెక్ట్ అయిపోతున్నారు. చుట్టూ కెమెరాలు రెప్పలార్పకుండా ఉన్నా... వాటిని ఎవరూ పెద్దగా పట్టించుకుంటున్నట్టు లేదు. గత సీజన్ లో ఇది కాస్త ఎక్కువగానే ఉండేది.
నాని అందుకే ఇంకా.. అంటూ వారిద్దరినీ అడుగుతున్నాడా?
ప్రస్తుత సీజన్లో హౌస్లో ఉన్న కొందరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుటవుతున్నట్టుంది. వారి సాన్నిహిత్యం రోజురోజుకూ పెరిగిపోతుందట. వారి ప్రేమలు మితిమీరి పోతున్నాయన్నది టాక్. ఇక నాని అప్పుడప్పుడు హౌస్ లో ఇద్దరినీ ఇంకా.. ఇంకేటి అంటూ ప్రశ్నించడం కూడా ఇందుకు నిదర్శనంగా కనపడుతోంది.
తేజస్వినికి నచ్చలేదు
ఇక కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ 2లో చెరుకు రసం టాస్క్ సమయంలో సామ్రాట్తో తేజస్విని డైరెక్ట్ గా కొన్ని మాటలు అంది. సామ్రాట్ను హౌజ్ లోని లేడీ కంటెస్ట్ ముట్టుకోవడం తేజస్వినికి నచ్చలేదు. నిన్ను మరొకరు పట్టుకోవడం లేదా నువ్వు మరొకరిని ముట్టుకోవడం నాకు నచ్చదు అని సామ్రాట్తో తేజస్విని చెప్పింది. నీతో మరొకరు క్లోజ్గా ఉంటే నేను తట్టుకోలేను. ఒకవేళ నీకు ఇష్టమైతే నేనేమీ చేయలేను అని తేజస్విని చెప్పడం ఆసక్తిని రేపింది.
ఎలాంటి సందేహాలు అవసరం లేదు
ఇక బిగ్బాస్ హౌస్లో దీప్తి సునైన, తనీష్ మధ్య కొత్త అఫైర్ మొదలైంది. స్విమ్మింగ్ పూల్ వద్ద సునైనాకు తనీష్ తన చేతికి ఉన్న బ్రాస్లెట్ ఇవ్వడం వారి మధ్య కొత్త బంధానికి తెర లేచింది. అర్ధరాత్రి దీప్తి సునైనా, తనీష్ దొంగాట ఆడటం మరో గమ్మత్తైన విషయం. అయితే ఇవన్నీ వారు క్యాజ్ వల్ గా చేస్తున్నారని ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని అనిపిస్తోంది.
మీవి పెట్టి తిప్పండి.. బాగా జ్యూస్ కారుతుంది
ఇక కొన్ని రోజుల క్రితం జరిగిన చెరుకు రసం టాస్క్ లో తేజస్వి అసభ్య వ్యాఖ్యలు చేసింది. మిషన్లో చెరుకు గడలు పెట్టి ఎంత తిప్పినా రసం రావడం లేదు అని తేజస్వితో సామ్రాట్ చెప్పుకొన్నాడు. అందుకు సమాధానంగా ‘మీవి పెట్టి తిప్పండి.. బాగా జ్యూస్ కారుతుంది' అని తేజస్వి అన్నారు. తేజస్వి అసభ్యంగా వాడిన మాటలతో సామ్రాట్ హర్ట్ అయ్యాడు.
రొమాంటిక్ సన్నివేశాలు
ఇక హౌజ్లో మొదటి రోజు నుంచి సామ్రాట్, తేజస్విని మధ్య ఏదో నడుస్తుంది అనే అనుమానం ప్రేక్షకులలో కలిగింది. కొన్ని రోజలు క్రితం ఒక ఎపిసోడ్లో ఇద్దరి మధ్య కాస్త రొమాంటిక్ సన్నివేశాలు చూస్తే అందరికీ వారిరిద్దరి మధ్యే ఏదో ఉందనిపిస్తుంంది. హౌస్మెట్స్కు దూరంగా గుసగులాడటం.. ఒకరి మీద ఒకరు పడటం, తినిపించుకోవడం, నువ్వు చూపించే ప్రేమ కళ్లల్లో కనిపిస్తుందని సామ్రాట్కు హగ్ ఇవ్వడం చూస్తే వీరిద్దరి మధ్య తెలియని ఆకర్షణ ఏదో మెల్లగా మొదలైందనే అభిప్రాయం అందరిలో కలుగుతుంది.
మునగకాడ కూర ఎఫెక్ట్
కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ ఇంటిలో మునగకాడ కూరను చేసింది తేజస్వీ. ఈ కూరపైన తేజూ-భానుల మధ్య హాటెస్ట్ చర్చ జరిగింది. అదేంటంటే... అమిత్, రోల్ రైడా ఒకరినొకరు కౌగిలించుకొని వుండటాన్ని చూపించిన భాను తేజస్వితో నీ మునగకాడ కూర ఎఫెక్ట్ మాములుగా లేదమ్మో. నీ మునగకాడ కూర ఎఫెక్ట్తో వాళ్లిద్దరు ఏం చేస్తున్నారో చూడు అనేసింది. పైగా అదోరకంగా బిగ్గరగానూ నవ్వేసింది.
బూతులు మాట్లాడుకుంటూ రెచ్చిపోయారు
అలాగే కొన్ని రోజుల క్రితం ఒక ఎపిసోడ్ లో భానుశ్రీ తాను పెట్టిన టీ తీసుకోకుండా కాఫీ తీసుకోవడంతో... కళ్లు కనిపించం లేదా? అంటూ నందినీ అనడంతో భానుశ్రీ ఇగో హర్ట్ అయింది. ఎందుకలా అన్నావ్ అంటూ భాను వేలు చూపిస్తూ నందినిపై విరుచుకుపడటం, వేలు చూపిస్తూ మాట్లాడితే ఊరుకునేది లేదంటూ నందిని కౌంటర్ ఇవ్వడంతో గొడవ మరింత ముదిరింది. ఇద్దరూ బూతులు మాట్లాడుకుంటూ రెచ్చిపోయారు. మూసుకుని కూర్చో, పళ్లు రాళతాయ్, ఫాల్తూ, గలీజ్ మాటలు అంటూ ఇద్దరూ ఒకరిపై ఒకరు ఫైర్ అయ్యారు.
గంభీరంగా ఉండే స్వరం
ఇక కార్యక్రమంలో ఆకట్టుకొనే వాటిలో బిగ్బాస్ వాయిస్ ఒకటి. అయితే ఇప్పటి వరకూ బిగ్బాస్ ఎవరో ఎవరికీ తెలియదు. సీజన్ మారింది. కంటెస్టంట్లు మారిపోయారు. హోస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ స్థానంలో నేచురల్ స్టార్ నానీ వచ్చేశారు. కానీ బిగ్బాస్ ఎవరు, గంభీరంగా ఉండే స్వరం మాత్రం ఎవరిదో ఎవరికీ తెలియదు. అయితే వీటన్నింటికి సమాధానంగా ఓ వార్త హల్చల్ చేస్తోంది.
డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ గొంతు
బిగ్బాస్కు వాయిస్ ఓవర్ ఇస్తున్నది ఓ సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. పలు సినిమాలు, సీరియల్లు, ప్రకటనలకు డబ్బింగ్ చెప్పిన సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్ట్ రాధాకృష్ణ బిగ్బాస్గా గొంతు సవరించారంట. ఇందుకోసం నిర్వాహకులు దాదాపు 100 మంది గొంతులను పరీక్షించి, రాధాకృష్ణను ఎంచుకున్నారట. అయితే ఈ వార్త ఎంత వరకూ అనేది రాధాకృష్ణ స్పందిస్తే తప్ప ఎవరికీ తెలియదు.
కౌశల్ రెచ్చిపోయాడు
ఇక బిగ్ బాస్-2 హౌజ్లో కొన్ని రోజుల క్రితం నటుడు కిరిటీ.. కౌశల్ మధ్య గొడవ జరిగింది. తేజస్వికి ప్రాబ్లమ్ ఉందని కిరిటీ చెప్పగా.. సమస్యేంటో చెప్పు అని గట్టి స్వరంతో కౌశల్ రెచ్చిపోయాడు. చివరికి గొడవకు మొదటి కారకుడైన కిరిటీ.. కౌశిక్కు క్షమాపణ చెప్పడంతో హౌజ్ కాస్త సైలెంట్ అయ్యింది.
కిరీటీకి ఘనంగా వీడ్కోలు
అయితే తాగాగా బిగ్బాస్ హౌస్ నుంచి కిరీటి ఎలిమినేట్ అయ్యారు. గణేశ్, గీత్ సేవ్ అయ్యారు. పార్టిసిపెంట్లంతా కిరీటీకి ఘనంగా వీడ్కోలు పలికారు. కేవలం ఒక్క ఎపిసోడ్ కారణంగా కిరీటి బిగ్బాస్ ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోందనీ... ప్రేక్షకుల నిర్ణయం మేరకు ఈ వారం ఆయనను ఎలిమినేట్ చేస్తున్నట్టు బిగ్బాస్ హోస్ట్ నాని చెప్పారు.
లిప్ టు లిప్ కిస్
ఇక తమిళ "బిగ్ బాస్ -2" ఇపుడు సంచలంగా మారింది. ఈ బిగ్ బాస్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ హద్దులుదాటి ప్రవర్తిస్తున్నారు. గతంలో ఒక ఎపిసోడ్ లో తమిళ కంటెస్టెంట్స్ జనని అయ్యర్, ఐశ్వర్య దత్త 'లిప్ టు లిప్ కిస్' పెట్టుకోవడం షోకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆ ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి.
బుగ్గపై ముద్దు
ఇక‘బిగ్ బాస్' సీజన్ 1లో హౌస్ లోకి దీక్షాపంత్ ఎంట్రీ అయిన ఎపిసోడ్ కూడా చాలా హాట్ గా ఉంటుంది. అప్పుడు వచ్చిన రోజే స్విమ్మింగ్ పూల్ లో సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ. శివబాలాజీ, ప్రిన్స్ వంటి రొమాంటిక్ డైలాగ్స్ తో పడేసే ప్రయత్నం చేశారు. ఇక సారీ' చెప్పడంలో భాగంగా దీక్షాను బుజ్జగించాడు ప్రిన్స్. అందుకు ఒప్పుకోకపోవడంతో ఒక్కసారిగా ‘సారీ' అంటూ బుగ్గపై ముద్దు పెట్టేసాడు. అప్పట్లో ఇది వైరల్ గా మారింది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ సడెన్ ఎంట్రీ
బిగ్ బాస్ తొలి సీజన్తో పోలిస్తే ఇప్పుడు కొంచెం వెనుకపడిందని టాక్. అయితే దీని టీఆర్పీని పెంచేందుకు యత్నాలు ప్రారంభమయ్యాయని సమాచారం. దీనిలో భాగంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సడెన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. ఏదైనా జరగొచ్చు.. ఏ క్షణమైనా బిగ్బాస్ హౌస్లోకి ఎన్టీఆర్ గెస్ట్గా ఎంటర్ అవ్వొచ్చని సమాచారం.