శైలజ అందం చూసి మతిపోయింది, శారీరకంగా కలిశా, సంబంధం కొనసాగిద్దామంటే వద్దంది, గొంతు కోసి కారు ఎక్కించా

శైలజ అందం చూసి మతిపోయింది, శారీరకంగా కలిశా, సంబంధం కొనసాగిద్దామంటే వద్దంది, గొంతు కోసి కారు ఎక్కించా. శైలజ ద్వివేది, ఆర్మీ ఆఫీసర్ భార్య హత్య, నిఖిల్‌ రాయ్ హండా, అమిత్ ద్వివేది భార్య

శైలజ ద్వివేది ఇప్పుడు అంతటా మారుమోగిపోతున్న పేరు ఇది. ఆమె ఫొటోలను చూస్తేనే అర్థం అవుతుంది ఆమె ఎంత మనోహరంగా ఉంటుందో. ఎన్నో అందాల పోటీల్లో పాల్గొని అందాల తారగా కూడా వెలిగింది శైలజ ద్వివేది. అలాంటి అమాయక అందమైన అమ్మాయిని అతి క్రూరంగా చంపాడు ఒక ఆర్మీ మేజర్.

అందాల పోటీల్లో

అందాల పోటీల్లో

గృహిణిగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే శైలజ అందాల పోటీల్లో, సామాజిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. మిసెస్‌ ఇండియా ఎర్త్‌ 2017 ఫైనలిస్టుల్లో ఆమె ఒకరు. మిసెస్‌ ఇండియా టైటిల్ గెలవకపోయినా..‘ మిసెస్‌ ఎర్త్ క్రియేటివ్‌ ' టైటిల్‌ను సొంతం చేసుకొని అందరి దృష్టిని ఆకర్షించారు.

నిఖిల్‌ రాయ్ హండా చేతిలో దారుణ హత్యకు గురైంది

నిఖిల్‌ రాయ్ హండా చేతిలో దారుణ హత్యకు గురైంది

భర్త సహోద్యోగి, ఆర్మీ మేజర్‌ నిఖిల్‌ హండా చేతిలో దారుణ హత్యకు గురైన శైలజ ద్వివేది 2017లో మిసెస్‌ ఇండియా ఎర్త్‌ పోటిల్లో అమృత్‌సర్‌ తరుపున పాల్గొంది. పోటిల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. తన మనసుకు నచ్చినట్లే తన జీవితాన్ని గడుపుతాను అని చెప్పేంత తెగువ గల మహిళ శైలజ ద్వివేది. గతంలో ఒక ప్రముఖ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన గురించి, తన కుటుంబం గురించే కాక మన దేశంలో మహిళల భద్రత ఎలా ఉంది వంటి పలు అంశాల గురించి తన అభిప్రాయలను తెలియజేసింది శైలజ ద్వివేది.

ఆడవారికి కొన్ని కలలుంటాయి

ఆడవారికి కొన్ని కలలుంటాయి

‘‘నాకు చిన్నప్పటి నుంచి నా దేశం తరపున ఏదో ఒక పోటీలో పాల్గొనాలనే కోరిక నాలో చాలా బలంగా ఉండేది. రోజువారి జీవితంలో మహిళలు కుటుంబం కోసమే తప్ప తమ కోసం తాము జీవించటం లేదు. ఆడవారికి కూడా ఒక జీవితం ఉంటుంది. వారికంటూ కొన్ని కలలు, ఆశలు, ఆశయాలు ఉంటాయి. కుటుంబంతో పాటు వాటిని కూడా నెరవేర్చుకోవాలి. ' అని అప్పట్లో తన మనస్సులోని మాటలను చెప్పింది శైలజ ద్వివేది.

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తినే చేసుకున్నాను

ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తినే చేసుకున్నాను

" ఇక నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే అందమైన వ్యక్తినే నేను వివాహం చేసుకున్నాను.. దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న అత్యాచారాలు, వేధింపులు, యాసిడ్‌ దాడులు, గృహహింస వేధింపులు చూస్తుంటే మనం ఇంతటి భయంకర సమాజంలో బతుకుతున్నామా అనిపిస్తుంది. అందం, అదృష్టం కలిసిన అమ్మాయిని నేను" అని శైలజ ద్వివేది అప్పట్లో చెప్పింది.

చదువులోనూ ఫస్ట్

చదువులోనూ ఫస్ట్

అందం మాత్రమే కాక చదువులోనూ శైలజ ఫస్టే. ట్రావేల్‌ అండ్‌ టూరిజమ్‌లో డిగ్రీ, ఆర్బన్‌ ప్లానింగ్‌లో ఎంటెక్‌, జియోగ్రఫీలో మాస్టర్స్‌ చేసింది శైలజ.

. అయితే తనను వివాహం చేసుకోవాలని నిఖిల్ కోరాడు. అందుకు శైలజ అంగీకరించక పోవడంతో ఈ హత్యకు పాల్పడ్డాడు.

ఫేస్ బుక్ లో చూశాడు

ఫేస్ బుక్ లో చూశాడు

నిఖిల్‌కు ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండేవాడు. తొలిసారిగా శైలజను 2015లోనే ఫేస్‌బుక్‌లో చూశాడు. కామన్ ఫ్రెండ్స్ టైమ్‌లైన్‌లో శైలజ ఫోటోను చూశాడు. ఇదే సమయంలో తనతోపాటు నాగాలాండ్‌లో పనిచేసే అమిత్‌‌‌తో పరిచయం పెంచుకున్నాడు. ఈ పరిచయంతో అతడికి స్నేహితుడయ్యాడు. అప్పటి నుంచి ద్వివేది ఇంట్లో జరిగే పార్టీలకు హాజరయ్యేవాడు. అమిత్‌, నిఖిల్ మంచి స్నేహితులుగా మారడంతో రోజూ ఇంటికి వెళ్లేవాడు.

వీడియో కాల్ చేయడంతో

వీడియో కాల్ చేయడంతో

ఈ క్రమంలో శైలజకు నిఖిల్ ఓ రోజు వీడియో కాల్ చేయడం అమిత్ కంటపడింది. దీంతో ఇక ఇంటికి రావద్దని నిఖిల్‌కు ఖరాఖండిగా చెప్పాడు. ఇది జరిగిన తర్వాత మేజర్ హండా ఉద్యోగ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదు. ఆయన కెరీర్ రికార్డు పడిపోయింది. గత రెండేళ్లుగా అమిత్‌కు విడాకులు ఇచ్చి, తనను వివాహం చేసుకోవాలని శైలజను ఒప్పించడంలో నిమగ్నమయ్యారు నిఖిల్ హండా.కానీ శైలజ మాత్రం ఒప్పుకోలేదు.

రాజత్ తో అంతా చెప్పాడు

రాజత్ తో అంతా చెప్పాడు

ఇక నిఖిల్ హండా తండ్రి గతంలో మర్చెంట్ నేవీ ఆఫీసర్‌గా పనిచేశాడు. తన సోదరుడు రాజత్‌తో హండా చాలా సన్నిహితంగా ఉంటాడు. శైలజను హత్యచేసిన తర్వాత రాజత్ ఇంటికే వెళ్లాడు. శైలజను హత్యచేసిన విషయం అతడికి చెప్పి, కొంత డబ్బు కావాలని, వారం రోజుల్లో తిరిగిచ్చేస్తానని చెప్పాడు. మీరట్‌కు పారిపోవాలనుకున్నాడు.

యాక్సిడెంట్ గా..

యాక్సిడెంట్ గా..

నిఖిల్‌ శైలజ హత్యను ఆక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు. శైలజను చంపి దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించడానికి నిఖిల్‌ హండా గూగుల్‌ సాయం తీసుకున్నాడు. పోలీసుల విచారణలో నిఖిల్ చాలా విషయాలు చెప్పాడు.

శైలజ అందం చూసి

శైలజ అందం చూసి

ఇక ఫేస్‌బుక్‌లో శైలజ అందం చూసి తనకు మతిపోయిందన్నాడు. ఆ అందమే తనను ఆకర్షించిందని.. ఆపై ఆమెతో స్నేహం చేశానని చెప్పుకొచ్చాడు.ముందు శైలజ భర్త అమిత్ ద్వివేదితో స్నేహం చేశానని.. ఆపై తరచూ వారింటికి వెళ్లే వాడిననని.. అలా శైలజతో పరిచయం పెంచుకుని.. ఆమెకు దగ్గరయ్యానన్నాడు.

శారీరక సంబంధం

శారీరక సంబంధం

అంతేగాకుండా శైలజను లొంగదీసుకునేందుకు భార్యతో విబేధాలున్నట్లు చెప్పానని.. అలా ఆమెతో శారీరక సంబంధం కూడా ఏర్పరుచుకున్నానని తెలిపాడు. కానీ శైలజ భర్తకు విడాకులు ఇవ్వమని కోరితే నిరాకరించింది. ఇంకా తనతో వివాహేతర సంబంధం కూడా వద్దనుకుందని.. ఆ కారణంతోనే హత్య చేశానని పోలీసుల విచారణలో నిఖిల్ హుండా వెల్లడించాడు.

3,300 సార్లు ఫోన్ కాల్స్

3,300 సార్లు ఫోన్ కాల్స్

అయితే గత 6నెలల్లో హుడా... శైలజా ద్వివేదికి 3,300 సార్లు ఫోన్ కాల్స్.. 1500 మెసేజ్ లు చేశాడు. శైలజ హత్య జరిగడానికి ముందు రోజు రాత్రి హుడాకి తన భార్యతో గొడవపడ్డాడు. శైలజతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంపై హుడాని అతని భార్య ప్రశ్నించగా.. ఈ విషయంలో ఇద్దరి మధ్యా వివాదం చోటుచేసుకుంది.

శైలజను వివాహం చేసుకోవాలనుకున్నాడు

శైలజను వివాహం చేసుకోవాలనుకున్నాడు

ఈ గొడవ తర్వాతే హుడా.. శైలజను బయట కలవాల్సిందిగా కోరాడు. భార్యకు విడాకులు ఇచ్చేసి శైలజను వివాహం చేసుకోవాలని భావించాడు. అలాగే శైలజను కూడా భర్తకు విడాకులు ఇవ్వమని చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడం వల్లే హత్య చేసినట్లు నిఖిల్ హుడా పోలీసులకు వివరించాడు.

గూగుల్ లో సెర్చ్

గూగుల్ లో సెర్చ్

‘హత్యను యాక్సిడెంట్‌గా చిత్రికరించడం ఎలా...చంపిన తరువాత సాక్ష్యాలను ఎలా నాశనం చేయాలి' వంటి పలు అంశాల గురించి నిఖిల్‌ గూగుల్‌లో సర్చ్‌ చేశాడు. నిఖిల్‌ ఫోన్‌ కాల్‌ డేటాను, ఇంటర్నెట్‌ హిస్టరీని పరిశీలించిన పోలీసులకు ఈ విషయాలు తెలిసాయి. శైలజ, నిఖిల్‌ కారులోకి ఎక్కిన తర్వాత వారిద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పుడు నిఖిల్‌ ఆమె గొంతు నులిమి చంపాడు. తర్వాత కత్తితో ఆమె గొంతు కోశాడు. అనంతరం దాన్ని యాక్సిడెంట్‌గా చిత్రికరించే ప్రయత్నం చేశాడు.

గొంతు మీద నుంచి కారును పోనిచ్చాడు

గొంతు మీద నుంచి కారును పోనిచ్చాడు

అందులో భాగంగా శైలజ మృతదేహాన్ని రోడ్డు మీద పడేసి, ఆపై ఆమె గొంతు మీద నుంచి కారును పోనిచ్చాడు. చూసేవారికి అది యాక్సిడెంట్‌లా కనిపించాలని ఇలా చేశాడు. కానీ పోలీసులకు తన మీద అనుమానం రావడంతో సాక్ష్యాలను నాశనం చేయాడానికి ప్రయత్నించాడు. శైలజను చంపడానికి ఉపయోగించిన కత్తితో పాటు ఆ రోజు తాను ధరించిన ఎరుపు రంగు టీ షర్ట్‌, జీన్స్‌ ప్యాంట్‌లను కాలబెట్టడానికి ప్రయత్నించాడు.

అరెస్ట్

అరెస్ట్

అయితే హరిద్వార్‌ నుంచి మీరట్ వెళ్లే దారిలోఈ పనులన్నింటిని ముగించాలని భావించాడు. కానీ నిఖిల్‌ హండా కారు టోల్‌ప్లాజా నుంచి వెళ్లే దృశ్యాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫూటేజ్‌ ఆధారంగానే నిఖిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Desktop Bottom Promotion