Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
రమాదేవి రంకు మొగుడు రమేశ్ తో కలిసి భర్తను దారుణంగా చంపేసింది
వణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన వాసుదేవన్ కొత్తూరు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించేవారు. ఇతని భార్య రమాదేవి కామవాంఛతో రమేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
భర్తతో కాకుండా పరాయి మగాడితో సుఖానికి అలవాటు పడిన ఆమె ఏ మాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించింది. చివరకు ఆమె చేతికి బేడీలు పడ్డాయి. కట్టుకున్న భర్తను కర్కషంగా కడతేర్చేలా చేసింది. చేతులారా భర్తను చంపుకుని తన ఇద్దరు కుమారులను నాన్నలేని వాళ్లను చేసింది. ఓ ఆర్ఎంపీ వైద్యుడి మంచి అందమైన భార్య, ఇద్దరు పిల్లలున్నప్పటికి పరాయి వ్యక్తి భార్యపై మోజు పడ్డాడు.

పరాయి స్త్రీ ఆకర్షణకు లోనై
పరాయి స్త్రీ ఆకర్షణకు లోనై.. వివాహేతర సంబంధం ఉచ్చులో చిక్కి.. ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీశాడు. ఇతడి తప్పిదానికి ఓ వ్యక్తి బలి కావడమే కాదు. నలుగురు పిల్లల జీవితాలు నాశనం అయ్యాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పోలీస్స్టేషన్ పరిధిలోని వడ్డివానిచెరువు సమీపంలో తవణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన ఉపాధ్యాయుడు వాసుదేవన్ ను సుమోతో ఢీకొట్టి చంపించారు.

వాసుదేవన్
తవణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన వాసుదేవన్ కొత్తూరు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించేవారు. ఇతని భార్య రమాదేవి కామవాంఛతో రమేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలా ఏళ్లుగా రమాదేవి, రమేష్ లు గుట్టుకాకుండా వారి సంబంధాన్ని కొనసాగించేవారు.

నా భార్యతో వివాహేతర సంబంధం వదులుకో
అయితే కొన్ని రోజులుకు ఈ విషయం ఉపాధ్యాయుడు వాసుదేవన్ కు తెలిసింది. తన భార్యతో వివాహేతర సంబంధం వదులుకోవాలని రమేష్ను వాసుదేవన్ హెచ్చరించాడు. అయినా రమేష్ రోజూ వాసుదేవన్ లేనప్పుడు రమాదేవి వద్దకు వచ్చి తన కోరికను తీర్చుకుని వెళ్లేవాడు.

భార్యను కూడా మందలించాడు
వాసుదేవన్ తన భార్యను కూడా చాలాసార్లు మందలించాడు. అయినా వారిలో మార్పు రాలేదు. వాసుదేవన్ ఈ విషయాన్ని రమేష్ భార్య ఉషారాణి దృషికి తీసుకువెళ్లాడు. ఆమె మూడు నెలలుగా భర్త రమేష్ను రమాదేవితో కలవనీయకుండా అడ్డుకుంది.

వాసుదేవన్ను ఎలాగైనా హతమార్చి
అన్ని రోజులుగా రమేశ్ ను కోరిక తీర్చుకోకుండా అడ్డుకున్నందుకు వాసుదేవన్ పై కోపం పెంచుకున్నాడు. తమ ఆనందానికి అడ్డు పడుతున్న వాసుదేవన్ను ఎలాగైనా హతమార్చి, ఆ తర్వాత తాము పెళ్లి చేసుకోవాలని రమేష్ నిర్ణయించుకున్నాడు. ఇందుకు రమాదేవి కూడా ఒకే అంది.

రమాదేవి రమేష్కు తెలిపింది
వాసుదేవన్ బంగారుపాళ్యం మండలంలోని బేరిపల్లెలో చెల్లెలు ఇంటికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై పయనం అయ్యాడు. ఈ పక్కా సమాచారాన్ని హతుడి భార్య రమాదేవి తన ప్రియుడు రమేష్కు తెలిపింది. ఇదే సరైన సమయంగా భావించిన రమేష్ వడ్డివానిచెరువు మార్గంలో సుమోతో కాపు కాశాడు.

అక్కడికక్కడే మృతి చెందాడు
ఉపాధ్యాయుడు వాసుదేవన్ దగ్గరకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఎదురెళ్లి ఢీ కొట్టాడు. ఉపాధ్యాయుడు గాయాలకు గురై.. పారిపోయి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు మళ్లీ వాహనంతో ఢీ కొట్టాడు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు వాసుదేవన్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

రమాదేవి సూత్రధారిగా
ఇక రమేష్, రమాదేవి పారిపోయి పెళ్లి చేసుకోవాలని స్కెచ్ వేసుకున్నారు. కాగా వాసుదేవన్ ది ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం జరిగిన హత్య అని వాసుదేవన్ బంధువులు అనుమానించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. వివాహేతర నేపథ్యంలో రమాదేవి సూత్రధారిగా రమేష్ ద్వారా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రమేష్, రమాదేవిలను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరిచారు.

చాలా ఎక్కువగా జరుగుతున్నాయి
కానీ ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. క్షణికానందం కోసం భార్యలు వారి ప్రియులతో కలిసి భర్తలను కిరాతకంగా, దారుణంగా చంపేస్తున్నారు. భర్తలారా మీ భార్యలతో జాగ్రత్తగా ఉండండి.

ప్రాణాలపైకి తెచ్చుకోకండి
గుడ్డిగా నమ్మి ప్రాణాలపైకి తెచ్చుకోకండి. దోపిడీ దొంగల దాడిలో తన భర్త చనిపోయినట్లు.. ఇటీవల విజయనగరం జిల్లాలో నవవధువు ఆడిన డ్రామా ఘటన మరచిపోకముందే.. చిత్తూరు జిల్లాలో ఇలా మరో ఘోరం వెలుగు చూడడం కాస్త విచారకరమే. వివాహేతర సంబంధం నేపథ్యంలో.. కట్టుకున్న భార్యలే ప్రియులతో కలిసి భర్తలను అంతమొందిస్తున్నారు. బీ కేర్ ఫుల్ హజ్బెండ్స్.



Click it and Unblock the Notifications











