Latest Updates
-
అష్టమి తిథిఎందుకు అంత శక్తివంతమైనది? -
మునగాకు నువ్వుల పచ్చడితో ఎముకలు ఉక్కుగా మారాల్సిందే.. సింపుల్గా ఇలా చేసేయండి.! -
పట్టులా మెరిసే జుట్టు కోసం ఇంట్లోనే హెయిర్ కండిషనర్.. చిటికెలో ఇలా చేసేయండి.? -
అదే పనిగా స్మార్ట్ఫోన్ చూస్తున్నారా.. డ్రై ఐ సిండ్రోమ్కి దారి తీసే లక్షణాలివే.! -
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.? -
పెళ్లయిన తర్వాత ఎన్నేళ్లకు విడాకుల ముప్పు ఎక్కువ? ఈ నిజాలు తెలుసుకోండి! -
జూన్ 19: ఈ రాశుల వారికి రాత్రికి రాత్రే అదృష్టం.. ధనలాభం, కెరీర్లో ఊహించని మార్పులు! -
వంటగదిలో వీటిని నిర్లక్ష్యం చేస్తున్నారా.. ఇక మీ హెల్త్ రిస్క్లో పడినట్లే.! -
గజకేసరి రాజయోగం: నేడు ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. అదృష్టం మీదే! -
దంతాల నుంచి తరచూ రక్తస్రావం.. ఈ ఐదు తప్పులు చేస్తున్నారేమో.!
రమాదేవి రంకు మొగుడు రమేశ్ తో కలిసి భర్తను దారుణంగా చంపేసింది
వణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన వాసుదేవన్ కొత్తూరు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించేవారు. ఇతని భార్య రమాదేవి కామవాంఛతో రమేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
భర్తతో కాకుండా పరాయి మగాడితో సుఖానికి అలవాటు పడిన ఆమె ఏ మాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించింది. చివరకు ఆమె చేతికి బేడీలు పడ్డాయి. కట్టుకున్న భర్తను కర్కషంగా కడతేర్చేలా చేసింది. చేతులారా భర్తను చంపుకుని తన ఇద్దరు కుమారులను నాన్నలేని వాళ్లను చేసింది. ఓ ఆర్ఎంపీ వైద్యుడి మంచి అందమైన భార్య, ఇద్దరు పిల్లలున్నప్పటికి పరాయి వ్యక్తి భార్యపై మోజు పడ్డాడు.

పరాయి స్త్రీ ఆకర్షణకు లోనై
పరాయి స్త్రీ ఆకర్షణకు లోనై.. వివాహేతర సంబంధం ఉచ్చులో చిక్కి.. ఓ వ్యక్తి నిండు ప్రాణాలు తీశాడు. ఇతడి తప్పిదానికి ఓ వ్యక్తి బలి కావడమే కాదు. నలుగురు పిల్లల జీవితాలు నాశనం అయ్యాయి. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పోలీస్స్టేషన్ పరిధిలోని వడ్డివానిచెరువు సమీపంలో తవణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన ఉపాధ్యాయుడు వాసుదేవన్ ను సుమోతో ఢీకొట్టి చంపించారు.

వాసుదేవన్
తవణంపల్లె మండలం చెర్లోపల్లెకు చెందిన వాసుదేవన్ కొత్తూరు గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించేవారు. ఇతని భార్య రమాదేవి కామవాంఛతో రమేష్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. చాలా ఏళ్లుగా రమాదేవి, రమేష్ లు గుట్టుకాకుండా వారి సంబంధాన్ని కొనసాగించేవారు.

నా భార్యతో వివాహేతర సంబంధం వదులుకో
అయితే కొన్ని రోజులుకు ఈ విషయం ఉపాధ్యాయుడు వాసుదేవన్ కు తెలిసింది. తన భార్యతో వివాహేతర సంబంధం వదులుకోవాలని రమేష్ను వాసుదేవన్ హెచ్చరించాడు. అయినా రమేష్ రోజూ వాసుదేవన్ లేనప్పుడు రమాదేవి వద్దకు వచ్చి తన కోరికను తీర్చుకుని వెళ్లేవాడు.

భార్యను కూడా మందలించాడు
వాసుదేవన్ తన భార్యను కూడా చాలాసార్లు మందలించాడు. అయినా వారిలో మార్పు రాలేదు. వాసుదేవన్ ఈ విషయాన్ని రమేష్ భార్య ఉషారాణి దృషికి తీసుకువెళ్లాడు. ఆమె మూడు నెలలుగా భర్త రమేష్ను రమాదేవితో కలవనీయకుండా అడ్డుకుంది.

వాసుదేవన్ను ఎలాగైనా హతమార్చి
అన్ని రోజులుగా రమేశ్ ను కోరిక తీర్చుకోకుండా అడ్డుకున్నందుకు వాసుదేవన్ పై కోపం పెంచుకున్నాడు. తమ ఆనందానికి అడ్డు పడుతున్న వాసుదేవన్ను ఎలాగైనా హతమార్చి, ఆ తర్వాత తాము పెళ్లి చేసుకోవాలని రమేష్ నిర్ణయించుకున్నాడు. ఇందుకు రమాదేవి కూడా ఒకే అంది.

రమాదేవి రమేష్కు తెలిపింది
వాసుదేవన్ బంగారుపాళ్యం మండలంలోని బేరిపల్లెలో చెల్లెలు ఇంటికి వెళ్లాడు. తిరిగి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై పయనం అయ్యాడు. ఈ పక్కా సమాచారాన్ని హతుడి భార్య రమాదేవి తన ప్రియుడు రమేష్కు తెలిపింది. ఇదే సరైన సమయంగా భావించిన రమేష్ వడ్డివానిచెరువు మార్గంలో సుమోతో కాపు కాశాడు.

అక్కడికక్కడే మృతి చెందాడు
ఉపాధ్యాయుడు వాసుదేవన్ దగ్గరకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఎదురెళ్లి ఢీ కొట్టాడు. ఉపాధ్యాయుడు గాయాలకు గురై.. పారిపోయి ప్రాణాలు రక్షించుకునేందుకు ప్రయత్నించగా నిందితుడు మళ్లీ వాహనంతో ఢీ కొట్టాడు. ఈ క్రమంలో ఉపాధ్యాయుడు వాసుదేవన్ తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

రమాదేవి సూత్రధారిగా
ఇక రమేష్, రమాదేవి పారిపోయి పెళ్లి చేసుకోవాలని స్కెచ్ వేసుకున్నారు. కాగా వాసుదేవన్ ది ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారం జరిగిన హత్య అని వాసుదేవన్ బంధువులు అనుమానించి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగారు. వివాహేతర నేపథ్యంలో రమాదేవి సూత్రధారిగా రమేష్ ద్వారా హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రమేష్, రమాదేవిలను అదుపులోకి తీసుకొని కోర్టుకు హాజరుపరిచారు.

చాలా ఎక్కువగా జరుగుతున్నాయి
కానీ ఇలాంటి ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. క్షణికానందం కోసం భార్యలు వారి ప్రియులతో కలిసి భర్తలను కిరాతకంగా, దారుణంగా చంపేస్తున్నారు. భర్తలారా మీ భార్యలతో జాగ్రత్తగా ఉండండి.

ప్రాణాలపైకి తెచ్చుకోకండి
గుడ్డిగా నమ్మి ప్రాణాలపైకి తెచ్చుకోకండి. దోపిడీ దొంగల దాడిలో తన భర్త చనిపోయినట్లు.. ఇటీవల విజయనగరం జిల్లాలో నవవధువు ఆడిన డ్రామా ఘటన మరచిపోకముందే.. చిత్తూరు జిల్లాలో ఇలా మరో ఘోరం వెలుగు చూడడం కాస్త విచారకరమే. వివాహేతర సంబంధం నేపథ్యంలో.. కట్టుకున్న భార్యలే ప్రియులతో కలిసి భర్తలను అంతమొందిస్తున్నారు. బీ కేర్ ఫుల్ హజ్బెండ్స్.



Click it and Unblock the Notifications